ETV Bharat / sports

నాన్న మరణం ఓ వైపు.. టెస్టు అరంగేట్రం మరోవైపు

author img

By

Published : Jun 21, 2021, 9:54 AM IST

ఇంగ్లాండ్​తో జరిగిన ఏకైక టెస్టులో అటు బ్యాట్​తో పాటు బంతితోనూ అదరగొట్టి భారత మహిళా జట్టును ఓటమి నుంచి కాపాడింది స్నేహ్ రాణా(Sneh Rana). అయితే ఇది తనకు టెస్టుల్లో మొదటి మ్యాచ్. అలాగే వాళ్ల నాన్న చనిపోయిన రెండు నెలలకు ఈ మ్యాచ్​ ఆడాల్సి వచ్చింది. అయినా ఎంతో ఒత్తిడిలోనూ రాణించి అందరి మన్ననలు పొందింది స్నేహ.

Sneh rana
స్నేహ్ రాణా

రెండు నెలల క్రితం నాన్న చనిపోయాడు. ఆమె శోకంలో మునిగిపోయి ఉంది. అదే సమయంలో ఐదేళ్ల తర్వాత భారత జట్టు నుంచి పిలుపొచ్చింది. అది కూడా టెస్టు మ్యాచ్ అడే అవకాశం. నాన్న మరణం తాలూకు బాధ నుంచి ఇంకా కోలుకోకపోయినా టీమ్ఇండియాకు ఆడే అవకాశాన్ని వదులుకోకూడదని ఇంగ్లాండ్ విమానమెక్కింది. తొలి అవకాశాన్ని గొప్పగా ఉపయోగించుకుంది. టెస్టు అరంగేట్రంలోనే అదరగొట్టి జట్టును ఓటమిపాలు కాకుండా కాపాడింది. ఆ అమ్మాయే స్నేహ్ రాణా(Sneh Rana). ఇంగ్లాండ్ మహిళల జట్టుతో జరిగిన ఏకైక టెస్టులో అసాధారణ పోరాటంతో జట్టును గట్టెక్కించిందీ ఉత్తరప్రదేశ్ ఆల్​రౌండర్.

Sneh rana
స్నేహ్ రాణా

ఒకవైపు బౌలింగ్​లో నాలుగు వికెట్లు తీయడం సహా బ్యాటింగ్​లోనూ అజేయ అర్ధసెంచరీతో సత్తాచాటింది స్నేహ్. 2014లోనే వన్డే, టీ20 జట్టులోకి వచ్చిన ఈమెకు ఇన్నాళ్లకు తొలి టెస్టు ఆడే అవకాశం దక్కింది. అది కూడా ఆమె తండ్రి భగవాన్ సింగ్ రాణా చనిపోయిన రెండు నెలలకు. తనను క్రికెటర్​గా మార్చిన నాన్నకు నివాళిగా మళ్లీ మైదానంలోకి వచ్చింది.

ఆల్​రౌండ్ ప్రదర్శన

మొదట ఆఫ్ స్పిన్​తో ప్రత్యర్థిని కట్టడి చేసిన రాణా.. తర్వాత ఫాలో ఆన్​లో జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి ఓటమి అంచున ఉన్న నిలిచిన సమయంలో బ్యాట్​తో ఆదుకుంది. పదో నెంబర్ బ్యాట్స్​మన్ తానియా భాటియా తోడుగా జట్టును పరాజయం నుంచి బయటపడేసింది. ఈ క్రమంలో అరంగేట్ర టెస్టులో కనీసం నాలుగు వికెట్లు తీసి, 50 ప్లస్ స్కోర్ సాధించిన తొలి మహిళా క్రికెటర్​గా రికార్డు సృష్టించింది.

Sneh rana
స్నేహ్ రాణా

"ఇవి ఉద్వేగభరిత క్షణాలు. తిరిగి భారత్​కు ఆడాలని నాన్న కోరుకున్నారు. ఆయన కోరుకున్నట్లే జట్టులోకి రావడమే కాక.. టెస్టు అరంగేట్రంలోనే రాణించా. ఈ ప్రదర్శన నాన్నకే అంకితం. నేను భవిష్యత్​లో ఏ మ్యాచ్​ ఆడినా అది ఆయన కోసమే" అని మ్యాచ్ అనంతరం 27 ఏల్ల స్నేహ్ ఉద్వేగంగా చెప్పింది. ఈ టెస్టు కాకుండా ఇప్పటివరకు టీమ్ఇండియా తరఫున ఏడు వన్డేలు, ఐదు టీ20లు ఆడింది రాణా.

ఇవీ చూడండి: 'నాథన్​​కు ఇచ్చి.. నాకెందుకు ఇవ్వలేదు?'

రెండు నెలల క్రితం నాన్న చనిపోయాడు. ఆమె శోకంలో మునిగిపోయి ఉంది. అదే సమయంలో ఐదేళ్ల తర్వాత భారత జట్టు నుంచి పిలుపొచ్చింది. అది కూడా టెస్టు మ్యాచ్ అడే అవకాశం. నాన్న మరణం తాలూకు బాధ నుంచి ఇంకా కోలుకోకపోయినా టీమ్ఇండియాకు ఆడే అవకాశాన్ని వదులుకోకూడదని ఇంగ్లాండ్ విమానమెక్కింది. తొలి అవకాశాన్ని గొప్పగా ఉపయోగించుకుంది. టెస్టు అరంగేట్రంలోనే అదరగొట్టి జట్టును ఓటమిపాలు కాకుండా కాపాడింది. ఆ అమ్మాయే స్నేహ్ రాణా(Sneh Rana). ఇంగ్లాండ్ మహిళల జట్టుతో జరిగిన ఏకైక టెస్టులో అసాధారణ పోరాటంతో జట్టును గట్టెక్కించిందీ ఉత్తరప్రదేశ్ ఆల్​రౌండర్.

Sneh rana
స్నేహ్ రాణా

ఒకవైపు బౌలింగ్​లో నాలుగు వికెట్లు తీయడం సహా బ్యాటింగ్​లోనూ అజేయ అర్ధసెంచరీతో సత్తాచాటింది స్నేహ్. 2014లోనే వన్డే, టీ20 జట్టులోకి వచ్చిన ఈమెకు ఇన్నాళ్లకు తొలి టెస్టు ఆడే అవకాశం దక్కింది. అది కూడా ఆమె తండ్రి భగవాన్ సింగ్ రాణా చనిపోయిన రెండు నెలలకు. తనను క్రికెటర్​గా మార్చిన నాన్నకు నివాళిగా మళ్లీ మైదానంలోకి వచ్చింది.

ఆల్​రౌండ్ ప్రదర్శన

మొదట ఆఫ్ స్పిన్​తో ప్రత్యర్థిని కట్టడి చేసిన రాణా.. తర్వాత ఫాలో ఆన్​లో జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి ఓటమి అంచున ఉన్న నిలిచిన సమయంలో బ్యాట్​తో ఆదుకుంది. పదో నెంబర్ బ్యాట్స్​మన్ తానియా భాటియా తోడుగా జట్టును పరాజయం నుంచి బయటపడేసింది. ఈ క్రమంలో అరంగేట్ర టెస్టులో కనీసం నాలుగు వికెట్లు తీసి, 50 ప్లస్ స్కోర్ సాధించిన తొలి మహిళా క్రికెటర్​గా రికార్డు సృష్టించింది.

Sneh rana
స్నేహ్ రాణా

"ఇవి ఉద్వేగభరిత క్షణాలు. తిరిగి భారత్​కు ఆడాలని నాన్న కోరుకున్నారు. ఆయన కోరుకున్నట్లే జట్టులోకి రావడమే కాక.. టెస్టు అరంగేట్రంలోనే రాణించా. ఈ ప్రదర్శన నాన్నకే అంకితం. నేను భవిష్యత్​లో ఏ మ్యాచ్​ ఆడినా అది ఆయన కోసమే" అని మ్యాచ్ అనంతరం 27 ఏల్ల స్నేహ్ ఉద్వేగంగా చెప్పింది. ఈ టెస్టు కాకుండా ఇప్పటివరకు టీమ్ఇండియా తరఫున ఏడు వన్డేలు, ఐదు టీ20లు ఆడింది రాణా.

ఇవీ చూడండి: 'నాథన్​​కు ఇచ్చి.. నాకెందుకు ఇవ్వలేదు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.