ETV Bharat / sports

బోర్డుతో ముదురుతున్న ఆటగాళ్ల కాంట్రాక్ట్​ వివాదం!

శ్రీలంక క్రికెట్ బోర్డుతో సీనియర్ క్రికెటర్లకు వివాదం ముదురుతోంది. బోర్డు ప్రతిపాదించిన కాంట్రాక్ట్​పై సంతకాలు చేయడానికి వారు నిరాకరిస్తున్నారు. ఇతర బోర్డులతో పోల్చితే తమకిచ్చే మొత్తం చాలా తక్కువని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

author img

By

Published : May 22, 2021, 6:35 PM IST

dimuth karunaratne, srilanka test captain
దిముత్​ కరుణరత్నే, శ్రీలంక టెస్ట్​ కెప్టెన్

శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రతిపాదించిన సెంట్రల్ కాంట్రాక్టుపై సంతకాలు చేయడానికి ఆ దేశ సీనియర్ క్రికెటర్లు నిరాకరించారు. ఇతర దేశాల క్రికెట్ బోర్డులతో పోల్చితే తమకిచ్చే మొత్తం చాలా తక్కువని వారు సంయుక్త ప్రకటన చేశారు. తాజా వివాదం పరిష్కారం కాకపోతే వచ్చే నెల ఇండియాతో జరిగే సిరీస్​పై ప్రభావం పడనుంది.

టెస్ట్ కెప్టెన్ దిముత్​ కరుణరత్నే సహా దినేష్ చండిమాల్, మాథ్యూస్​కు ఈ కాంట్రాక్ట్​పై సంతకాలు చేయడానికి.. జూన్​ 3వ తేదీని డెడ్​లైన్​గా ప్రకటించింది బోర్డు. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్​ క్రికెట్ అసోసియేషన్ ప్రకారం.. ఇతర దేశాలతో పోల్చితే వీరికిచ్చే వేతనాలు మూడో వంతు అని వీరి తరఫున న్యాయ ప్రతినిధి వెల్లడించారు.

ఇదీ చదవండి: ఇకపై రెండేళ్లకోసారి ఫిఫా ప్రపంచకప్​!

మొత్తం 24 మంది ప్లేయర్లను నాలుగు కేటగిరీలుగా విడగొట్టారు. ఏ-కేటగిరీలో ఆరుగురు క్రికెటర్లను చేర్చారు. వీరికి ఏడాదికి రూ.51 లక్షల నుంచి దాదాపు రూ.73 లక్షలుగా నిర్ణయించారు. సీ-కేటగిరీ(చిట్టచివరి) భారత క్రికెటర్లు ఏడాదికి కోటి రూపాయలు అందుకుంటున్నారు. దీనితో పోల్చితే లంక ఏ-కేటగిరీ ఆటగాళ్లు అందుకునేది తక్కువే.

శ్రీలంక క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయానికి తాము దిగ్భ్రాంతికి లోనయ్యామని సీనియర్ క్రికెటర్లు సంయుక్తంగా ప్రకటించారు. వారి గత ప్రదర్శనల ఆధారంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని క్రికెట్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు అరవింద డిసిల్వా చెప్పడం గమనార్హం.

ఇదీ చదవండి: 'అసలు మాకు కరోనా ఎలా అంటుకుందో'

శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రతిపాదించిన సెంట్రల్ కాంట్రాక్టుపై సంతకాలు చేయడానికి ఆ దేశ సీనియర్ క్రికెటర్లు నిరాకరించారు. ఇతర దేశాల క్రికెట్ బోర్డులతో పోల్చితే తమకిచ్చే మొత్తం చాలా తక్కువని వారు సంయుక్త ప్రకటన చేశారు. తాజా వివాదం పరిష్కారం కాకపోతే వచ్చే నెల ఇండియాతో జరిగే సిరీస్​పై ప్రభావం పడనుంది.

టెస్ట్ కెప్టెన్ దిముత్​ కరుణరత్నే సహా దినేష్ చండిమాల్, మాథ్యూస్​కు ఈ కాంట్రాక్ట్​పై సంతకాలు చేయడానికి.. జూన్​ 3వ తేదీని డెడ్​లైన్​గా ప్రకటించింది బోర్డు. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్​ క్రికెట్ అసోసియేషన్ ప్రకారం.. ఇతర దేశాలతో పోల్చితే వీరికిచ్చే వేతనాలు మూడో వంతు అని వీరి తరఫున న్యాయ ప్రతినిధి వెల్లడించారు.

ఇదీ చదవండి: ఇకపై రెండేళ్లకోసారి ఫిఫా ప్రపంచకప్​!

మొత్తం 24 మంది ప్లేయర్లను నాలుగు కేటగిరీలుగా విడగొట్టారు. ఏ-కేటగిరీలో ఆరుగురు క్రికెటర్లను చేర్చారు. వీరికి ఏడాదికి రూ.51 లక్షల నుంచి దాదాపు రూ.73 లక్షలుగా నిర్ణయించారు. సీ-కేటగిరీ(చిట్టచివరి) భారత క్రికెటర్లు ఏడాదికి కోటి రూపాయలు అందుకుంటున్నారు. దీనితో పోల్చితే లంక ఏ-కేటగిరీ ఆటగాళ్లు అందుకునేది తక్కువే.

శ్రీలంక క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయానికి తాము దిగ్భ్రాంతికి లోనయ్యామని సీనియర్ క్రికెటర్లు సంయుక్తంగా ప్రకటించారు. వారి గత ప్రదర్శనల ఆధారంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని క్రికెట్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు అరవింద డిసిల్వా చెప్పడం గమనార్హం.

ఇదీ చదవండి: 'అసలు మాకు కరోనా ఎలా అంటుకుందో'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.