ETV Bharat / sports

ఆ ముగ్గురు మళ్లీ క్రికెట్ ఆడొచ్చు.. నిషేధం ఎత్తివేత

author img

By

Published : Jan 7, 2022, 10:45 PM IST

SLC lifts Suspension: ఇంగ్లాండ్ పర్యటనలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా గతేడాది ముగ్గురు ఆటగాళ్లపై నిషేధం విధించింది శ్రీలంక క్రికెట్ బోర్డు. ప్రస్తుతం ఆ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

slc
శ్రీలంక క్రికెట్ బోర్డు

SLC lifts Suspension: శ్రీలంక క్రికెటర్లు ధనుష్క గుణతిలక, కుశాల్ మెండిస్, నీరోషన్ డిక్వెల్లాపై ఏడాదిపాటు విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఆ దేశ క్రికెట్ బోర్డు. శుక్రవారం నుంచి వారు అన్ని ఫార్మాట్లలో ఆటను కొనసాగించొచ్చని పేర్కొంది. లంక ప్రీమియర్​ లీగ్ ముగిసిన నేపథ్యంలో ముగ్గురు ఆటగాళ్ల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది.

"సస్పెన్షన్ సమయంలో ముగ్గురు ఆటగాళ్లకు కౌన్సిలింగ్ ఇప్పించాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ డాక్టర్​ను కూడా నియమించాం. అనంతరం డాక్టర్ సమర్పించిన నివేదిక ఆధారంగా వారిపై నిషేధం ఎత్తివేయాలని నిర్ణయించున్నాం." అని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.

ఏం జరిగిందంటే..

గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా.. ఆ దేశ జట్టుతో జరిగిన టీ20 టోర్నీలో 3-0తో ఓడిపోయింది లంక జట్టు. అయితే.. కరోనా కారణంగా ఆటగాళ్లు ఏ పర్యటనలో అయినా బయోబుడగలో ఉండాల్సిందే అనే నియమం ఉంది. కానీ, లంక క్రికెటర్లు ముగ్గురు మాత్రం బయట తిరుగుతూ కనిపించడం చర్చనీయాంశమైంది.

ఇంగ్లాండ్​లోని ఓ మార్కెట్​లో లంక వైస్ కెప్టెన్ కుశాల్ మెండిస్, వికెట్ కీపర్ నీరోషన్ డిక్వెల్లా తిరుగుతూ కనిపించారు. వీరితో పాటు ధనుష్క గుణతిలక కూడా ఉన్నాడు. ఈ ఫొటోలు, వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. వారు మాస్క్​ కూడా పెట్టుకోకపోవడం చర్చకు దారితీసింది. దానిపై స్పందించిన నెటిజన్లు బయోబబుల్​లో ఉండాల్సిన ఆటగాళ్లు బయటకు ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. దీంతో ఆ దేశ బోర్డు విచారణకు ఆదేశించింది. చివరికి వారిని సస్పెండ్​ చేసింది.

SLC lifts Suspension: శ్రీలంక క్రికెటర్లు ధనుష్క గుణతిలక, కుశాల్ మెండిస్, నీరోషన్ డిక్వెల్లాపై ఏడాదిపాటు విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఆ దేశ క్రికెట్ బోర్డు. శుక్రవారం నుంచి వారు అన్ని ఫార్మాట్లలో ఆటను కొనసాగించొచ్చని పేర్కొంది. లంక ప్రీమియర్​ లీగ్ ముగిసిన నేపథ్యంలో ముగ్గురు ఆటగాళ్ల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది.

"సస్పెన్షన్ సమయంలో ముగ్గురు ఆటగాళ్లకు కౌన్సిలింగ్ ఇప్పించాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ డాక్టర్​ను కూడా నియమించాం. అనంతరం డాక్టర్ సమర్పించిన నివేదిక ఆధారంగా వారిపై నిషేధం ఎత్తివేయాలని నిర్ణయించున్నాం." అని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.

ఏం జరిగిందంటే..

గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా.. ఆ దేశ జట్టుతో జరిగిన టీ20 టోర్నీలో 3-0తో ఓడిపోయింది లంక జట్టు. అయితే.. కరోనా కారణంగా ఆటగాళ్లు ఏ పర్యటనలో అయినా బయోబుడగలో ఉండాల్సిందే అనే నియమం ఉంది. కానీ, లంక క్రికెటర్లు ముగ్గురు మాత్రం బయట తిరుగుతూ కనిపించడం చర్చనీయాంశమైంది.

ఇంగ్లాండ్​లోని ఓ మార్కెట్​లో లంక వైస్ కెప్టెన్ కుశాల్ మెండిస్, వికెట్ కీపర్ నీరోషన్ డిక్వెల్లా తిరుగుతూ కనిపించారు. వీరితో పాటు ధనుష్క గుణతిలక కూడా ఉన్నాడు. ఈ ఫొటోలు, వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. వారు మాస్క్​ కూడా పెట్టుకోకపోవడం చర్చకు దారితీసింది. దానిపై స్పందించిన నెటిజన్లు బయోబబుల్​లో ఉండాల్సిన ఆటగాళ్లు బయటకు ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. దీంతో ఆ దేశ బోర్డు విచారణకు ఆదేశించింది. చివరికి వారిని సస్పెండ్​ చేసింది.

ఇదీ చదవండి:

Jayasuriya: 'లంక జట్టు పరిస్థితి దారుణం'

శ్రీలంక ఆటగాళ్లపై మురళీధరన్‌ ఫైర్‌

అంతర్జాతీయ క్రికెట్​కు మలింగ గుడ్​బై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.