ETV Bharat / sports

వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్​ వేదికలు ఖరారు

author img

By

Published : Nov 16, 2021, 10:18 AM IST

Updated : Nov 16, 2021, 12:35 PM IST

టీ20 ప్రపంచకప్ ​2022 నిర్వహణ కోసం(T20 worldcup 2022) వేదికలు ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ మెగాటోర్నీ మ్యాచ్​లను ఆతిథ్య దేశంలోని ఏడు నగరాల్లో నిర్వహించనున్నారు.

t20
టీ20

వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్​కు(T20 worldcup 2022) వేదికలు ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ మెగాటోర్నీ మ్యాచ్​లను ఆస్ట్రేలియాలోని ఏడు నగరాల్లో నిర్వహించనున్నారు. వీటిలో మెల్​బోర్న్​, సిడ్నీ, బ్రిస్బేన్​, పెర్త్​, అడిలైడ్, గీలాంగ్​, హోబర్ట్​​ ఉన్నాయి(T20 worldcup venues). 45 మ్యాచ్​లతో కూడిన ఈ మెగాటోర్నీ అక్టోబర్​ 16 నుంచి నవంబరు 13వరకు జరగనుంది(T20 worldcup schedule). నవంబరు 9, 10 తేదీల్లో జరగనున్న సెమీఫైనల్​ మ్యాచ్​లను సిడ్నీ, అడిలైడ్​ వేదికగా జరగుతాయి. ఫైనల్​ మ్యాచ్​ను​ మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​లో నిర్వహించనున్నారు.

ఇటీవల ముగిసిన 2021 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్​లో తలపడిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లు నేరుగా సూపర్‌-12లో అడుగుపెడతాయి. మరోవైపు అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, భారత్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ జట్లు టాప్‌-8 ర్యాంకుల్లో ఉన్నందున ఇవి కూడా సూపర్‌-12కు నేరుగా చేరుకుంటాయి. శ్రీలంక, వెస్టిండీస్‌ జట్లు మాత్రం మిగతా చిన్న జట్లతో అర్హత పోటీల్లో తలపడతాయి. ఈ అర్హత పోటీలను రెండు దశల్లో నిర్వహిస్తుండగా.. తొలుత ఫిబ్రవరిలో ఒమన్‌లో ఒక టోర్నీ.. తర్వాత జూన్‌లో జింబాబ్వేలో మరో టోర్నీ నిర్వహించనున్నారు.

వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్​కు(T20 worldcup 2022) వేదికలు ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ మెగాటోర్నీ మ్యాచ్​లను ఆస్ట్రేలియాలోని ఏడు నగరాల్లో నిర్వహించనున్నారు. వీటిలో మెల్​బోర్న్​, సిడ్నీ, బ్రిస్బేన్​, పెర్త్​, అడిలైడ్, గీలాంగ్​, హోబర్ట్​​ ఉన్నాయి(T20 worldcup venues). 45 మ్యాచ్​లతో కూడిన ఈ మెగాటోర్నీ అక్టోబర్​ 16 నుంచి నవంబరు 13వరకు జరగనుంది(T20 worldcup schedule). నవంబరు 9, 10 తేదీల్లో జరగనున్న సెమీఫైనల్​ మ్యాచ్​లను సిడ్నీ, అడిలైడ్​ వేదికగా జరగుతాయి. ఫైనల్​ మ్యాచ్​ను​ మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​లో నిర్వహించనున్నారు.

ఇటీవల ముగిసిన 2021 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్​లో తలపడిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లు నేరుగా సూపర్‌-12లో అడుగుపెడతాయి. మరోవైపు అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, భారత్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ జట్లు టాప్‌-8 ర్యాంకుల్లో ఉన్నందున ఇవి కూడా సూపర్‌-12కు నేరుగా చేరుకుంటాయి. శ్రీలంక, వెస్టిండీస్‌ జట్లు మాత్రం మిగతా చిన్న జట్లతో అర్హత పోటీల్లో తలపడతాయి. ఈ అర్హత పోటీలను రెండు దశల్లో నిర్వహిస్తుండగా.. తొలుత ఫిబ్రవరిలో ఒమన్‌లో ఒక టోర్నీ.. తర్వాత జూన్‌లో జింబాబ్వేలో మరో టోర్నీ నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి: 'కేన్ మామ.. వార్నర్ కాకా'.. రషీద్​ ట్వీట్​ వైరల్​

Last Updated : Nov 16, 2021, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.