ETV Bharat / sports

ఇక పంత్​కు మిగిలింది ఆ ఒక్క ఛాన్సేనా

వచ్చే ఏడాది లంకతో జరగబోయే సిరీస్​కు పంత్​ను ఎంపిక చేయకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వివరాలు..

author img

By

Published : Dec 28, 2022, 4:02 PM IST

rishab pant in t20
rishab pant

శ్రీలంకతో స్వదేశంలో సిరీస్‌ నేపథ్యంలో టీమ్​ఇండియా యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌కు జట్టులో చోటుదక్కలేదు. ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ను పక్కనపెట్టిన సెలక్టర్లు ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌కు అవకాశం ఇచ్చారు. దీంతో పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో పంత్ కెరీర్​కు ఎండ్​ కార్డ్​ పడే అవకాశాలున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పేలవ ప్రదర్శన.. పొట్టి ఫార్మాట్​లో.. కెరీర్ ఆరంభం నుంచి పంత్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఇప్పుటి వరకు 60కి పైగా మ్యాచుల్లో ఆడినప్పటికీ అతడి యావరేజ్​, స్ట్రైక్ రేటు కూడా అంతగా చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. అంతే కాకుండా ఇటీవలి కాలంలో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి యువ ఆటగాళ్లు మైదానంలో విజృంభిస్తున్నప్పటికీ వాళ్లను పక్కన పెట్టి మరీ పంత్‌ వైపు మొగ్గు చూపుతూ వచ్చారు సెలక్టర్స్​. కానీ పంత్​ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. చివరి ఐదు టీ20 మ్యాచుల్లో 27, 3, 6, 6, 11 స్కోర్​ మాత్రమే సాధించాడు.

వన్డేల్లో కూడా సోసోగానే.. వన్డేల్లో సైతం అతడి పెర్ఫార్మెన్స్​ అంతంత మాత్రంగానే ఉంది. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్​పై సెంచరీ తప్ప ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్కోర్​ చేయలేదు. మొత్తం పది ఇన్నింగ్స్​లోనూ 336 పరుగులు మాత్రమే చేశాడు. వీటిలో ఇంగ్లాండ్​పై సాధించిన సెంచరీ మినహా.. మిగతా 9 ఇన్నింగ్స్​ కలిపితే అతడు చేసిన స్కోర్​ 200. అందుకే ఈ కారణంగా శ్రీలంక సిరీస్‌కు అతడిని పక్కన పెట్టారు సెలెక్టర్లు. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పంత్ కెరీర్ ముగిసిందని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి వచ్చే ఏడాది జట్టులో అతడికి త్వరగా స్థానం దక్కించుకోవాలంటే.. ఐపీఎల్‌లో ఫామ్​ను చూపించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి:

శ్రీలంకతో స్వదేశంలో సిరీస్‌ నేపథ్యంలో టీమ్​ఇండియా యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌కు జట్టులో చోటుదక్కలేదు. ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ను పక్కనపెట్టిన సెలక్టర్లు ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌కు అవకాశం ఇచ్చారు. దీంతో పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో పంత్ కెరీర్​కు ఎండ్​ కార్డ్​ పడే అవకాశాలున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పేలవ ప్రదర్శన.. పొట్టి ఫార్మాట్​లో.. కెరీర్ ఆరంభం నుంచి పంత్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఇప్పుటి వరకు 60కి పైగా మ్యాచుల్లో ఆడినప్పటికీ అతడి యావరేజ్​, స్ట్రైక్ రేటు కూడా అంతగా చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. అంతే కాకుండా ఇటీవలి కాలంలో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి యువ ఆటగాళ్లు మైదానంలో విజృంభిస్తున్నప్పటికీ వాళ్లను పక్కన పెట్టి మరీ పంత్‌ వైపు మొగ్గు చూపుతూ వచ్చారు సెలక్టర్స్​. కానీ పంత్​ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. చివరి ఐదు టీ20 మ్యాచుల్లో 27, 3, 6, 6, 11 స్కోర్​ మాత్రమే సాధించాడు.

వన్డేల్లో కూడా సోసోగానే.. వన్డేల్లో సైతం అతడి పెర్ఫార్మెన్స్​ అంతంత మాత్రంగానే ఉంది. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్​పై సెంచరీ తప్ప ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్కోర్​ చేయలేదు. మొత్తం పది ఇన్నింగ్స్​లోనూ 336 పరుగులు మాత్రమే చేశాడు. వీటిలో ఇంగ్లాండ్​పై సాధించిన సెంచరీ మినహా.. మిగతా 9 ఇన్నింగ్స్​ కలిపితే అతడు చేసిన స్కోర్​ 200. అందుకే ఈ కారణంగా శ్రీలంక సిరీస్‌కు అతడిని పక్కన పెట్టారు సెలెక్టర్లు. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పంత్ కెరీర్ ముగిసిందని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి వచ్చే ఏడాది జట్టులో అతడికి త్వరగా స్థానం దక్కించుకోవాలంటే.. ఐపీఎల్‌లో ఫామ్​ను చూపించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.