భారత్ వేదికగా 2011లో జరిగిన ప్రపంచకప్ అనంతరం జరిగిన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు దక్షిణాఫ్రికా క్రికెటర్ డుప్లెసిస్. ఆ టోర్నీ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడింది ప్రోటీస్ జట్టు.
''వరల్డ్కప్ నుంచి నిష్క్రమించిన తర్వాత నాతో పాటు నా భార్యకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మమ్మల్ని అంతమొందిస్తామంటూ చాలా మంది ఫోన్లు చేశారు. సామాజిక మాధ్యమాల్లో మాకు ఇబ్బందులు ఎదురయ్యాయి.'' అని డుప్లెసిస్ నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు.
ఢాకాలోని షేర్ ఏ బంగ్లా స్టేడియంలో కివీస్తో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా 49 పరుగుల తేడాతో ఓడిపోయింది. వెటోరి నాయకత్వంలోని న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ప్రోటీస్ పూర్తిగా తడబాటుకు గురైంది. 172 పరుగులకే ఆలౌటైంది.
ఇదీ చదవండి: 'వీడ్కోలు విషయంలో ఏబీ గత నిర్ణయమే ఫైనల్'