ETV Bharat / sports

ఆ మాటలు నన్ను చాలా బాధించాయి: అశ్విన్​

author img

By

Published : Jan 2, 2022, 7:26 AM IST

Ravichandran Ashwin international career: తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి తెలిపాడు టీమ్​ఇండియా రవిచంద్రన్ అశ్విన్​. తన పని అయిపోయిందని గతంలో చాలామంది హేళన చేశారని గుర్తుచేసుకున్నాడు. అవి తనను ఎంతో బాధించాయని అన్నాడు.

రవిచంద్రన్​ అశ్విన్​, ravichandran ashwin
రవిచంద్రన్​ అశ్విన్​

Ravichandran Ashwin international career: టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టుకు రవిచంద్రన్ అశ్విన్ కీలకమైన బౌలర్‌. తన స్పిన్‌ మాయజాలంతో ఎన్నో మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియాకు విజయాలనందించాడు. 35 ఏళ్ల ఈ ఆఫ్ స్పిన్నర్ టీమ్‌ఇండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు (429) తీసిన 3వ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అయితే, కొన్నాళ్ల క్రితం తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి అశ్విన్‌ తాజాగా బయటపెట్టాడు. తన పని అయిపోయిందని అప్పట్లో చాలామంది హేళన చేశారని పేర్కొన్నాడు. చెన్నైకు వెళ్లి క్లబ్ గేమ్స్ ఆడినప్పుడల్లా, తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్ ముగిసిందని ప్రజలు మాట్లాడుకోవడం ప్రత్యక్షంగా విన్నానని అశ్విన్ వెల్లడించాడు.

"ఒక క్రీడాకారుడిగా చెబుతున్నా.. మనపై ఎన్నో విమర్శలు వస్తాయి. వాటిని పట్టించుకోవద్దు. నన్ను కూడా చాలామంది విమర్శించారు. బౌలర్‌గా మరిన్ని మెళకువలు నేర్చుకునేందుకు నేను చెన్నైలో క్లబ్ గేమ్‌లు ఆడేందుకు వెళ్లేవాడిని. అప్పుడు నా గురించి చాలామంది గుసగుసలాడేవారు. 'అశ్విన్‌ అంతర్జాతీయ కెరీర్‌ ముగిసింది. అందుకే ఇక్కడి వచ్చి ఆడుతున్నాడు' అని ప్రజలు మాట్లాడుకోవడం విన్నాను. ఇలా చాలాసార్లు జరిగింది. ఇలా జరిగినప్పుడు కొన్నిసార్లు తేలికగా తీసుకుని నవ్వాను. మరి కొన్నిసార్లు బాధ కలిగింది" అని అశ్విన్ బ్యాక్‌స్టేజ్ విత్ బోరియా షోలో అన్నాడు.

కరోనా మహమ్మారి సమయంలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకున్నానని అశ్విన్‌ పేర్కొన్నాడు. ప్రజలు తన గురించి ఏమనుకున్నా పట్టించుకోనని చెప్పాడు. "కరోనా/లాక్‌డౌన్‌ సమయంలో మానసికంగా దృఢంగా అయ్యా. ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారనే విషయాన్ని పట్టించుకోవడం లేదు. క్రికెటర్‌గా నేను చేయాల్సింది ఏదో మిగిలుంది. ఇది ఒక కఠినమైన యుద్ధం. కొంతమంది పోషకాహార నిపుణులను సంప్రదించా. ఇప్పుడు నేను బాగా తింటున్నా. మెరుగ్గా శిక్షణ పొందుతున్నా. నా మానసికంగా చాలా సానుకూల దృక్పథంతో ఉన్నా" అని రవిచంద్రన్ అశ్విన్ ముగించాడు.

ఇదీ చూడండి: ఇటలీ టెన్నిస్ భామ.. పరువాల పుత్తడిబొమ్మ

Ravichandran Ashwin international career: టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టుకు రవిచంద్రన్ అశ్విన్ కీలకమైన బౌలర్‌. తన స్పిన్‌ మాయజాలంతో ఎన్నో మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియాకు విజయాలనందించాడు. 35 ఏళ్ల ఈ ఆఫ్ స్పిన్నర్ టీమ్‌ఇండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు (429) తీసిన 3వ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అయితే, కొన్నాళ్ల క్రితం తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి అశ్విన్‌ తాజాగా బయటపెట్టాడు. తన పని అయిపోయిందని అప్పట్లో చాలామంది హేళన చేశారని పేర్కొన్నాడు. చెన్నైకు వెళ్లి క్లబ్ గేమ్స్ ఆడినప్పుడల్లా, తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్ ముగిసిందని ప్రజలు మాట్లాడుకోవడం ప్రత్యక్షంగా విన్నానని అశ్విన్ వెల్లడించాడు.

"ఒక క్రీడాకారుడిగా చెబుతున్నా.. మనపై ఎన్నో విమర్శలు వస్తాయి. వాటిని పట్టించుకోవద్దు. నన్ను కూడా చాలామంది విమర్శించారు. బౌలర్‌గా మరిన్ని మెళకువలు నేర్చుకునేందుకు నేను చెన్నైలో క్లబ్ గేమ్‌లు ఆడేందుకు వెళ్లేవాడిని. అప్పుడు నా గురించి చాలామంది గుసగుసలాడేవారు. 'అశ్విన్‌ అంతర్జాతీయ కెరీర్‌ ముగిసింది. అందుకే ఇక్కడి వచ్చి ఆడుతున్నాడు' అని ప్రజలు మాట్లాడుకోవడం విన్నాను. ఇలా చాలాసార్లు జరిగింది. ఇలా జరిగినప్పుడు కొన్నిసార్లు తేలికగా తీసుకుని నవ్వాను. మరి కొన్నిసార్లు బాధ కలిగింది" అని అశ్విన్ బ్యాక్‌స్టేజ్ విత్ బోరియా షోలో అన్నాడు.

కరోనా మహమ్మారి సమయంలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకున్నానని అశ్విన్‌ పేర్కొన్నాడు. ప్రజలు తన గురించి ఏమనుకున్నా పట్టించుకోనని చెప్పాడు. "కరోనా/లాక్‌డౌన్‌ సమయంలో మానసికంగా దృఢంగా అయ్యా. ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారనే విషయాన్ని పట్టించుకోవడం లేదు. క్రికెటర్‌గా నేను చేయాల్సింది ఏదో మిగిలుంది. ఇది ఒక కఠినమైన యుద్ధం. కొంతమంది పోషకాహార నిపుణులను సంప్రదించా. ఇప్పుడు నేను బాగా తింటున్నా. మెరుగ్గా శిక్షణ పొందుతున్నా. నా మానసికంగా చాలా సానుకూల దృక్పథంతో ఉన్నా" అని రవిచంద్రన్ అశ్విన్ ముగించాడు.

ఇదీ చూడండి: ఇటలీ టెన్నిస్ భామ.. పరువాల పుత్తడిబొమ్మ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.