ETV Bharat / sports

వీడ్కోలు తర్వాత రవిశాస్త్రి భావోద్వేగ పోస్ట్​

author img

By

Published : Nov 14, 2021, 8:49 AM IST

టీమ్ఇండియా ప్రధాన కోచ్​గా ఐదేళ్లపాటు సేవలందించిన రవిశాస్త్రి(ravi shastri coaching tenure).. వీడ్కోలు తర్వాత భావోద్వేగమైన పోస్ట్ పెట్టాడు. ఈ అసాధారణ ప్రయాణంలో తనకూ భాగం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు.

Ravi Shastri
రవిశాస్త్రి

టీమ్​ఇండియా హెడ్ కోచ్​గా పదవీ కాలం పూర్తయ్యాక శనివారం ఓ భావోద్వేగ పోస్ట్​ పెట్టాడు రవిశాస్త్రి(ravi shastri news). భారత జట్టు కెప్టెన్​ విరాట్​ కోహ్లీ, స్టార్ ఆటగాడు రోహిత్​ శర్మ, టెస్టు వైస్​ కెప్టెన్ అజింక్యా రహానేను ఇందులో ప్రస్తావించాడు. టీమ్​ఇండియా కోచ్​గా జ్ఞాపకాలు ఎప్పటికీ తనతోనే ఉంటాయని అన్నాడు.

  • Now that the penny has dropped…thank you so much for making me part of this incredible journey. Memories that I will cherish and a team that I will continue to back till the time I’m able to watch the sport #TeamIndia @imVkohli @ImRo45 @ajinkyarahane88 🇮🇳🙏🏻

    — Ravi Shastri (@RaviShastriOfc) November 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఈ అత్యద్భుత ప్రయాణంలో నాకూ చోటు కల్పించినందుకు అందరికీ కృతజ్ఞతలు. హెడ్​ కోచ్​గా ఈ జ్ఞాపకాలు నాతోనే ఉంటాయి. సమయం వచ్చినప్పుడు జట్టుకోసం మళ్లీ వస్తా.. అప్పటివరకు ఆటను చూస్తా."

-రవిశాస్త్రి, టీమ్​ఇండియా మాజీ కోచ్

హెడ్​కోచ్​గా రవిశాస్త్రి(ravi shastri coaching tenure) వైదొలగటంపై టీమ్​ఇండియా ఆటగాళ్లంతా భావోద్వేగమైన పోస్టులు పెట్టారు.

టీ20 ప్రపంచకప్​తో(T20 World Cup 2021) కోచ్​ రవిశాస్త్రి, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్​ల పదవీ కాలం ముగిసింది. టీమ్​ఇండియా జట్టుకు హెడ్​ కోచ్ కావడానికి ముందు రవిశాస్త్రి వ్యాఖ్యాతగా పనిచేశాడు. మరోసారి రవిశాస్త్రి వ్యాఖ్యాతగా రీఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

రవిశాస్త్రి(ravi shastri coaching tenure) అధ్వర్యంలో.. ఆస్ట్రేలియాను రెండు సార్లు ఓడించింది టీమ్​ఇండియా. శాస్త్రి కోచ్​గా ఉన్నప్పుడే భారతజట్టు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌​పై టీ20 సిరీస్​ను కైవసం చేసుకుంది. 2019లో ఐసీసీ వరల్డ్​కప్​ సెమీస్​కు చేరుకుంది టీమ్​ఇండియా. ఆతర్వాత ఐసీసీ టెస్ట్ ఛాంపియన్​షిప్​లో ఫైనల్​ వరకూ వెళ్లింది.

ప్రధాన కోచ్​గా ద్రవిడ్

టీ20 కెప్టెన్​గా విరాట్ కోహ్లీ(virat kohli news) శకం ముగిసినందువల్ల.. నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ(rohit sharma news)ను కొత్త కెప్టెన్​గా ఎంపిక చేసింది బీసీసీఐ. ఈ సిరీస్‌ నుంచే భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్(rahul dravid coach) బాధ్యతలు చేపట్టనున్నాడు.

ఇదీ చూడండి: హెడ్​కోచ్​గా ఐదేళ్లు.. రవిశాస్త్రి సాధించిన ఘనతలివే

టీమ్​ఇండియా హెడ్ కోచ్​గా పదవీ కాలం పూర్తయ్యాక శనివారం ఓ భావోద్వేగ పోస్ట్​ పెట్టాడు రవిశాస్త్రి(ravi shastri news). భారత జట్టు కెప్టెన్​ విరాట్​ కోహ్లీ, స్టార్ ఆటగాడు రోహిత్​ శర్మ, టెస్టు వైస్​ కెప్టెన్ అజింక్యా రహానేను ఇందులో ప్రస్తావించాడు. టీమ్​ఇండియా కోచ్​గా జ్ఞాపకాలు ఎప్పటికీ తనతోనే ఉంటాయని అన్నాడు.

  • Now that the penny has dropped…thank you so much for making me part of this incredible journey. Memories that I will cherish and a team that I will continue to back till the time I’m able to watch the sport #TeamIndia @imVkohli @ImRo45 @ajinkyarahane88 🇮🇳🙏🏻

    — Ravi Shastri (@RaviShastriOfc) November 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఈ అత్యద్భుత ప్రయాణంలో నాకూ చోటు కల్పించినందుకు అందరికీ కృతజ్ఞతలు. హెడ్​ కోచ్​గా ఈ జ్ఞాపకాలు నాతోనే ఉంటాయి. సమయం వచ్చినప్పుడు జట్టుకోసం మళ్లీ వస్తా.. అప్పటివరకు ఆటను చూస్తా."

-రవిశాస్త్రి, టీమ్​ఇండియా మాజీ కోచ్

హెడ్​కోచ్​గా రవిశాస్త్రి(ravi shastri coaching tenure) వైదొలగటంపై టీమ్​ఇండియా ఆటగాళ్లంతా భావోద్వేగమైన పోస్టులు పెట్టారు.

టీ20 ప్రపంచకప్​తో(T20 World Cup 2021) కోచ్​ రవిశాస్త్రి, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్​ల పదవీ కాలం ముగిసింది. టీమ్​ఇండియా జట్టుకు హెడ్​ కోచ్ కావడానికి ముందు రవిశాస్త్రి వ్యాఖ్యాతగా పనిచేశాడు. మరోసారి రవిశాస్త్రి వ్యాఖ్యాతగా రీఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

రవిశాస్త్రి(ravi shastri coaching tenure) అధ్వర్యంలో.. ఆస్ట్రేలియాను రెండు సార్లు ఓడించింది టీమ్​ఇండియా. శాస్త్రి కోచ్​గా ఉన్నప్పుడే భారతజట్టు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌​పై టీ20 సిరీస్​ను కైవసం చేసుకుంది. 2019లో ఐసీసీ వరల్డ్​కప్​ సెమీస్​కు చేరుకుంది టీమ్​ఇండియా. ఆతర్వాత ఐసీసీ టెస్ట్ ఛాంపియన్​షిప్​లో ఫైనల్​ వరకూ వెళ్లింది.

ప్రధాన కోచ్​గా ద్రవిడ్

టీ20 కెప్టెన్​గా విరాట్ కోహ్లీ(virat kohli news) శకం ముగిసినందువల్ల.. నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ(rohit sharma news)ను కొత్త కెప్టెన్​గా ఎంపిక చేసింది బీసీసీఐ. ఈ సిరీస్‌ నుంచే భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్(rahul dravid coach) బాధ్యతలు చేపట్టనున్నాడు.

ఇదీ చూడండి: హెడ్​కోచ్​గా ఐదేళ్లు.. రవిశాస్త్రి సాధించిన ఘనతలివే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.