బంగ్లాదేశ్తో ఈ నెలలో జరగబోయే సిరీస్ కోసం జట్టులో కీలక మార్పులు చేసింది శ్రీలంక. అనంతరం టీమ్ను ప్రకటించింది. ప్రస్తుతం వన్డే జట్టుకు సారథిగా ఉన్న దిముత్ కరుణరత్నెను తప్పించి కుశాల్ పెరీరాను కొత్త సారథిగా, కుశాల్ మెండీస్ను వైస్ కెప్టెన్గా నియమించారు. వెస్టిండీస్తో పరిమిత ఓవర్ల సిరీస్లో ఓడిన నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెరీరా ఇప్పటివరకు 101 వన్డేలు, 22టెస్టులు, 47టీ20లు ఆడాడు.
కరుణరత్నెతో పాటు ఆల్రౌండర్ మాథ్యూస్, వికెట్ కీపర్ దినేశ్ చండిమల్, టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ లహిరు తిరమన్నేను పక్కన పెట్టింది. పేసర్ చమిక కరుణరత్నె, బ్యాట్స్మన్ షిరాన్ ఫెర్నాండొ, స్పీడ్స్టర్ బినురా ఫెర్నాండొ(ఇప్పటికే 2 టీ20లు ఆడాడు) పరిమిత ఓవర్ల సిరీస్ అరంగేట్రం చేయనున్నారు.
బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను(మే 23-28) ఢాకాలో ఆడనుంది శ్రీలంక. ఇందుకోసం మే 16న వీరు బయలుదేరనున్నారు.
జట్టు:
కుశాల్ పెరీరా(సారథి), కుశాల్ మెండిస్(వైస్ కెప్టెన్), ధనుష్క గుణతిలక, ధనంజయ డి సిల్వా, నిస్సాంక, షనక, అషెన్ బందారా, వనిందు హసరంగ, ఇసురు ఉదానా, అకిల ధనంజయ, నిరోషన్ దిక్వెల్లా, దుష్మంతా చమీరా, రమేశ్ మెండిస్, అషితా ఫెర్నాండొ, లక్షన్ సండకన్, చమికా కరుణారత్నె, బినురా ఫెర్నాండొ, షిరన్ ఫెర్నాండొ
ఇదీ చూడండి: అంతర్జాతీయ క్రికెట్కు తిసారా పెరీరా వీడ్కోలు