ETV Bharat / sports

'అవసరమైతే వరల్డ్​కప్​పై మళ్లీ కాళ్లు పెడతా'- మిచెల్ మార్ష్​ సంచలన వ్యాఖ్యలు!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2023, 4:20 PM IST

Updated : Dec 1, 2023, 5:38 PM IST

Mitchell Marsh World Cup : ప్రపంచకప్​పై కాళ్లు పెట్టి బీర్​ తాగుతూ ఉన్న ఫొటోపై, అందుకు గానూ వచ్చిన కామెంట్స్​పై స్పందించాడు ఆసీస్​ ఆటగాడు మిచెల్​ మార్ష్​. ఈ చర్యను సమర్థించుకోవడమే కాకుండా అవసరమైతే మరోసారి ట్రోఫీపై కాళ్లు పెడతానని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Mitchell Marsh Finally Speaks Up On Legs On World Cup Trophy
Mitchell Marsh World Cup

Mitchell Marsh World Cup : ఈ ఏడాది భారత్​ వేదికగా జరిగిన ప్రపంచకప్​ పోరులో ఆసీస్​ జట్టు ఛాంపియన్​గా నిలిచింది. అయితే విక్టరీ అనంతరం రెస్ట్​ రూమ్​లో ఆ జట్టు ఆటగాడు మిచెల్​ మార్ష్​.. వరల్డ్​కప్ ట్రోఫీ​పై కాళ్లు పెట్టిన ఫొటో నెట్టింట పెద్ద ఎత్తున వైరల్​ అయింది. దీంతో అతడిపై తీవ్ర స్థాయిలో ఫైర్​ అయ్యారు నెటిజెన్స్​. అంతేకాకుండా కొందరు మాజీ ఆటగాళ్లు సైతం మార్ష్​ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వీటిన్నింటిపై స్పందించాడు ఈ కంగారూ ప్లేయర్​.

క్రికెట్​ను అభిమానించే వాళ్లే కాకుండా ఆ ఆట విలువ తెలిసిన ప్రతిఒక్కరూ ఎంతో గౌరవంగా భావించే ప్రపంచకప్​ ట్రోఫీపై మార్ష్​ కాళ్లు పెట్టడం ఇటీవలే తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే నెటిజెన్స్ కామెంట్స్​తో పాటు ఇతరుల వ్యాఖ్యలకు కౌంటర్​ ఇచ్చాడు మార్ష్​. తాను చేసిన ఈ చర్యను సమర్థించుకోవడమే గాక కావాలంటే ఇంకోసారి కూడా ట్రోఫీపై కాళ్లు పెడతానని సెన్సేషనల్​ కామెంట్స్​ చేశాడు. ఆ ఫొటోలో ట్రోఫీని అగౌరపరిచినట్లు ముమ్మాటికీ ఏం లేదని చెప్పాడు. దీంతోపాటు దీనిపై తాను అంతగా ఆలోచించలేదని అన్నాడు. చాలా మంది తనకు చెప్పారని.. కానీ తాను సోషల్ మీడియాలో చూడలేదని చెప్పుకొచ్చాడు. దీనికి తోడు అందులో ఏమీ లేదని.. ఇక మళ్లీ అలా చేస్తావా అని అడిగితే.. కచ్చితంగా చేస్తాను సమాధానం ఇచ్చాడు.

ఇదీ జరిగింది..
నవంబర్​ 19న అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్​-ఆసీస్​ మధ్య జరిగిన ప్రపంచకప్​ పైనల్​ పోరులో కంగారూలు 6 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తేలిసిందే. ఈ విజయంతో ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. అయితే మ్యాచ్​ ముగిసిన తర్వాత కప్పును అందుకున్న ఆసీస్​ టీమ్.. దానిని తీసుకొని డ్రెస్సింగ్​ రూమ్​లోకి వెళ్లింది. అనంతరం ట్రోఫీ గెలిచిన ఆనందంలో ఒక్కొక్కరు కప్పుతో ఫొటోలు దిగారు. ఈ క్రమంలోనే మిచెల్​ మార్ష్​ కూడా కాస్త భిన్నంగా వరల్డ్​కప్​తో ఫొటో దిగాడు. ఏకంగా తన రెండు కాళ్లను టైటిల్​పై వేసి సోఫాపై కూర్చున్నాడు. పైగా చేతిలో ఓ మందు సీసా పట్టుకొని కనిపించాడు. దీనికి సంబంధించిన ఫొటోలను కెప్టెన్​ పాట్​ కమిన్స్​ తన ఇన్​స్టాగ్రామ్​ హ్యాండిల్​లో పోస్ట్​ చేశాడు. దీంతో ఈ అంశంపై క్రికెట్​ లోకమంతా తీవ్ర స్థాయిలో మండిపడింది.

మార్ష్​పై కేసు..
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే వరల్డ్​కప్​పై​ మిచెల్ మార్ష్​ కాళ్లు పెట్టడాన్ని ప్రతిఒక్కరూ ఖండించారు. ఈ విషయంలో అతడిపై సర్వత్రా విమర్శలు వెలువత్తాయి. అంతేకాకుండా మార్ష్​పై దిల్లీ గేట్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు సమర్పించారు అలీగఢ్​కు చెందిన పండిట్ కేశవ్​ అనే ఆర్‌టిఐ కార్యకర్త. భారతీయుల మనోభావాలను మిచెల్​ మార్ష్​ దెబ్బతీశాడంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అతడిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

దక్షిణాఫ్రికా టీ20 టూర్​కు హార్దిక్​ దూరం- రోహిత్​కు కెప్టెన్సీ ఇచ్చే ఛాన్స్​!

ఉమ్రాన్​ను పక్కకు పెట్టడంపై మాజీ ఆల్​రౌండర్​ అసంతృప్తి - 'అతడి విషయంలో నా అంచనాలు తప్పాయి'

Mitchell Marsh World Cup : ఈ ఏడాది భారత్​ వేదికగా జరిగిన ప్రపంచకప్​ పోరులో ఆసీస్​ జట్టు ఛాంపియన్​గా నిలిచింది. అయితే విక్టరీ అనంతరం రెస్ట్​ రూమ్​లో ఆ జట్టు ఆటగాడు మిచెల్​ మార్ష్​.. వరల్డ్​కప్ ట్రోఫీ​పై కాళ్లు పెట్టిన ఫొటో నెట్టింట పెద్ద ఎత్తున వైరల్​ అయింది. దీంతో అతడిపై తీవ్ర స్థాయిలో ఫైర్​ అయ్యారు నెటిజెన్స్​. అంతేకాకుండా కొందరు మాజీ ఆటగాళ్లు సైతం మార్ష్​ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వీటిన్నింటిపై స్పందించాడు ఈ కంగారూ ప్లేయర్​.

క్రికెట్​ను అభిమానించే వాళ్లే కాకుండా ఆ ఆట విలువ తెలిసిన ప్రతిఒక్కరూ ఎంతో గౌరవంగా భావించే ప్రపంచకప్​ ట్రోఫీపై మార్ష్​ కాళ్లు పెట్టడం ఇటీవలే తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే నెటిజెన్స్ కామెంట్స్​తో పాటు ఇతరుల వ్యాఖ్యలకు కౌంటర్​ ఇచ్చాడు మార్ష్​. తాను చేసిన ఈ చర్యను సమర్థించుకోవడమే గాక కావాలంటే ఇంకోసారి కూడా ట్రోఫీపై కాళ్లు పెడతానని సెన్సేషనల్​ కామెంట్స్​ చేశాడు. ఆ ఫొటోలో ట్రోఫీని అగౌరపరిచినట్లు ముమ్మాటికీ ఏం లేదని చెప్పాడు. దీంతోపాటు దీనిపై తాను అంతగా ఆలోచించలేదని అన్నాడు. చాలా మంది తనకు చెప్పారని.. కానీ తాను సోషల్ మీడియాలో చూడలేదని చెప్పుకొచ్చాడు. దీనికి తోడు అందులో ఏమీ లేదని.. ఇక మళ్లీ అలా చేస్తావా అని అడిగితే.. కచ్చితంగా చేస్తాను సమాధానం ఇచ్చాడు.

ఇదీ జరిగింది..
నవంబర్​ 19న అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్​-ఆసీస్​ మధ్య జరిగిన ప్రపంచకప్​ పైనల్​ పోరులో కంగారూలు 6 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తేలిసిందే. ఈ విజయంతో ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. అయితే మ్యాచ్​ ముగిసిన తర్వాత కప్పును అందుకున్న ఆసీస్​ టీమ్.. దానిని తీసుకొని డ్రెస్సింగ్​ రూమ్​లోకి వెళ్లింది. అనంతరం ట్రోఫీ గెలిచిన ఆనందంలో ఒక్కొక్కరు కప్పుతో ఫొటోలు దిగారు. ఈ క్రమంలోనే మిచెల్​ మార్ష్​ కూడా కాస్త భిన్నంగా వరల్డ్​కప్​తో ఫొటో దిగాడు. ఏకంగా తన రెండు కాళ్లను టైటిల్​పై వేసి సోఫాపై కూర్చున్నాడు. పైగా చేతిలో ఓ మందు సీసా పట్టుకొని కనిపించాడు. దీనికి సంబంధించిన ఫొటోలను కెప్టెన్​ పాట్​ కమిన్స్​ తన ఇన్​స్టాగ్రామ్​ హ్యాండిల్​లో పోస్ట్​ చేశాడు. దీంతో ఈ అంశంపై క్రికెట్​ లోకమంతా తీవ్ర స్థాయిలో మండిపడింది.

మార్ష్​పై కేసు..
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే వరల్డ్​కప్​పై​ మిచెల్ మార్ష్​ కాళ్లు పెట్టడాన్ని ప్రతిఒక్కరూ ఖండించారు. ఈ విషయంలో అతడిపై సర్వత్రా విమర్శలు వెలువత్తాయి. అంతేకాకుండా మార్ష్​పై దిల్లీ గేట్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు సమర్పించారు అలీగఢ్​కు చెందిన పండిట్ కేశవ్​ అనే ఆర్‌టిఐ కార్యకర్త. భారతీయుల మనోభావాలను మిచెల్​ మార్ష్​ దెబ్బతీశాడంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అతడిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

దక్షిణాఫ్రికా టీ20 టూర్​కు హార్దిక్​ దూరం- రోహిత్​కు కెప్టెన్సీ ఇచ్చే ఛాన్స్​!

ఉమ్రాన్​ను పక్కకు పెట్టడంపై మాజీ ఆల్​రౌండర్​ అసంతృప్తి - 'అతడి విషయంలో నా అంచనాలు తప్పాయి'

Last Updated : Dec 1, 2023, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.