ETV Bharat / sports

చాలా బాధగా ఉంది.. అందరం బాధ్యతారాహిత్యంగా ఆడాం: రోహిత్

author img

By

Published : Apr 25, 2022, 9:49 AM IST

Updated : Apr 25, 2022, 10:06 AM IST

Rohit Sharma: లఖ్​నవూ సూపర్​జెయింట్స్​ చేతిలో ఓడిపోయి ఐపీఎల్ 2022 సీజన్​ నుంచి నిష్క్రమించింది ముంబయి ఇండియన్స్​! ఐదు సార్లు ఛాంపియన్​గా నిలిచిన ఆ జట్టుకు ఇది ఘోర పరాభవమే. ఈ నేపథ్యంలో తీవ్ర నిరాశకు గురైన కెప్టెన్ రోహిత్​ శర్మ.. తమ జట్టు వరుస ఓటములకు గల కారణాలను తెలిపాడు. మిడిలార్డర్​ పెద్ద సమస్యగా మారిందని చెప్పాడు.

Rohit Sharma
ipl 2022

Rohit Sharma: ఐపీఎల్​ 2022లో వరుసగా ఎనిమిదో ఓటమిని మూటగట్టుకోవడంపై ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ తీవ్ర నిరాశకు గురయ్యాడు. దారుణమైన బ్యాటింగ్​ వల్లే తమ జట్టు విఫలమైందని అంగీకరించాడు హిట్​మ్యాన్. ఆదివారం లఖ్​నవూ సూపర్​జెయింట్స్​ చేతిలో 36 పరుగుల తేడాతో ఓడిపోయిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాడు.

" ఈ గేమ్‌లో మేము బాగానే బౌలింగ్‌ చేసినా బ్యాటింగ్‌లో విఫలమయ్యాం. బ్యాటింగ్‌ చేసేందుకు ఈ పిచ్‌ బాగుంది. 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సింది. కానీ, అందుకు తగ్గట్టు ఆడలేకపోయాం. పూర్తిగా విఫలమయ్యాం. స్కోర్‌ బోర్డుపై ఆ మాత్రం లక్ష్యం ఉంటే మంచి భాగస్వామ్యాలు కావాలి. మేం వాటిని నిర్మించలేకపోయాం. నాతో సహా పలువురు బ్యాట్స్‌మెన్‌ బాధ్యతారాహిత్యమైన షాట్లు ఆడారు. ఈ సీజన్‌లో మేం సరిగ్గా బ్యాటింగ్‌ చేయలేకపోతున్నాం. ఇతర జట్ల ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు. ఆ విషయం మమ్మల్ని మరింత బాధించింది. నాకు జట్టులో పెద్దగా మార్పులు చేయడం ఇష్టం ఉండదు. తుది జట్టులో ఎవరికి అవకాశం ఇచ్చినా బాగా ఆడాలనే అనుకుంటాం."

-రోహిత్ శర్మ, ముంబయి ఇండియన్స్ కెప్టెన్

కాగా, ఆదివారం లఖ్‌నవూతో ఆడిన మ్యాచ్‌లో ముంబయి జట్టు 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. చివరికి 132/8 పరుగులకే పరిమితమై 36 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఓపెనర్‌ రోహిత్‌ (39), తిలక్‌ వర్మ (38) టాప్‌స్కోరర్లుగా నిలిచారు. మిగిలిన బ్యాట్స్‌మెన్‌ మొత్తం చేతులెత్తేశారు. ఈ ఓటమితో ముంబయి ప్లేఆఫ్స్‌ అవకాశాలు మొత్తం మూసుకుపోయినట్లే.

ఇదీ చూడండి: రాతమారని ముంబయి.. ఎనిమిదో ఓటమితో టోర్నీ నుంచి ఔట్

Rohit Sharma: ఐపీఎల్​ 2022లో వరుసగా ఎనిమిదో ఓటమిని మూటగట్టుకోవడంపై ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ తీవ్ర నిరాశకు గురయ్యాడు. దారుణమైన బ్యాటింగ్​ వల్లే తమ జట్టు విఫలమైందని అంగీకరించాడు హిట్​మ్యాన్. ఆదివారం లఖ్​నవూ సూపర్​జెయింట్స్​ చేతిలో 36 పరుగుల తేడాతో ఓడిపోయిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాడు.

" ఈ గేమ్‌లో మేము బాగానే బౌలింగ్‌ చేసినా బ్యాటింగ్‌లో విఫలమయ్యాం. బ్యాటింగ్‌ చేసేందుకు ఈ పిచ్‌ బాగుంది. 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సింది. కానీ, అందుకు తగ్గట్టు ఆడలేకపోయాం. పూర్తిగా విఫలమయ్యాం. స్కోర్‌ బోర్డుపై ఆ మాత్రం లక్ష్యం ఉంటే మంచి భాగస్వామ్యాలు కావాలి. మేం వాటిని నిర్మించలేకపోయాం. నాతో సహా పలువురు బ్యాట్స్‌మెన్‌ బాధ్యతారాహిత్యమైన షాట్లు ఆడారు. ఈ సీజన్‌లో మేం సరిగ్గా బ్యాటింగ్‌ చేయలేకపోతున్నాం. ఇతర జట్ల ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు. ఆ విషయం మమ్మల్ని మరింత బాధించింది. నాకు జట్టులో పెద్దగా మార్పులు చేయడం ఇష్టం ఉండదు. తుది జట్టులో ఎవరికి అవకాశం ఇచ్చినా బాగా ఆడాలనే అనుకుంటాం."

-రోహిత్ శర్మ, ముంబయి ఇండియన్స్ కెప్టెన్

కాగా, ఆదివారం లఖ్‌నవూతో ఆడిన మ్యాచ్‌లో ముంబయి జట్టు 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. చివరికి 132/8 పరుగులకే పరిమితమై 36 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఓపెనర్‌ రోహిత్‌ (39), తిలక్‌ వర్మ (38) టాప్‌స్కోరర్లుగా నిలిచారు. మిగిలిన బ్యాట్స్‌మెన్‌ మొత్తం చేతులెత్తేశారు. ఈ ఓటమితో ముంబయి ప్లేఆఫ్స్‌ అవకాశాలు మొత్తం మూసుకుపోయినట్లే.

ఇదీ చూడండి: రాతమారని ముంబయి.. ఎనిమిదో ఓటమితో టోర్నీ నుంచి ఔట్

Last Updated : Apr 25, 2022, 10:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.