ETV Bharat / sports

Arshdeep singh bowling : ఏం స్పీడ్​రా బాబోయ్​.. రెండు బంతుల్లో రెండు వికెట్లను విరగొట్టావుగా!

author img

By

Published : Apr 23, 2023, 10:16 AM IST

Updated : Apr 23, 2023, 12:00 PM IST

తాజాగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్​లో ముంబయికి ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరమవ్వగా.. పంజాబ్ ప్లేయర్​ అర్ష్‌దీప్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. అతడి దెబ్బకు రెండు సార్లు రెండు వికెట్లు ముక్కలైపోయాయి.

IPL 2023   Arshdeep Singh breaks middle stump
Arshdeep singh bowling : ఏం స్పీడ్​రా బాబోయ్​.. రెండు బంతుల్లో రెండు వికెట్లను విరగొట్టావుగా!

సామ్‌ కరన్‌ (55) విధ్వంసక బ్యాటింగ్‌కు అర్ష్‌దీప్‌ (4/29) సూపర్​ బౌలింగ్‌తో తోడవడం వల్ల.. ఆసక్తికరంగా సాగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. అయితే వాస్తవానికి ముంబయికి ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరమయ్యాయి. అది మరీ అసాధ్యమేమీ కాదు. కానీ అర్ష్‌దీప్‌.. ప్రత్యర్థి జట్టుకు ఏమాత్రం అవకాశమివ్వలేదు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కేవలం రెండే పరుగులిచ్చి రెండు వికెట్లను పడగొట్టాడు. తిలక్‌, వధేరాలను బౌల్డ్‌ చేశాడు. అతడి దెబ్బకు ఈ రెండు సందర్భాల్లోనూ స్టంప్‌ రెండు ముక్కలుగా విరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో వైరల్ అవుతోంది.

ఎలా అంటే.. 215 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబయి జట్టులో రోహిత్ (44), కామెరూన్ గ్రీన్ (67), సూర్యకుమార్ యాదవ్ (57)ల విధ్వంసకర ఇన్నింగ్స్​తో.. ఆ టీమ్​ విజయానికి దగ్గరగా వెళ్లింది. అయితే చివరి ఓవర్లో ముంబయికి.. విజయానికి మరో 16 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలోనే క్రీజులో ఉన్నవధేరా, తిలక్ వర్మకు బంతులను సంధించాడు అర్ష్​దీప్​. మొదటి బంతికి ఒక పరుగే వచ్చింది. సెకండ్​ది డాట్ బాల్. మూడో బాల్​ యార్కర్ సంధించాడు. అయితే వేగంగా దూసుకొచ్చిన బాల్​ను అంచనా వేయడంలో తిలక్ వర్మ కాస్త గతి తప్పాడు. దీంతో బాల్.. మిడిల్ స్టంప్ రెండు ముక్కలైంది. ఇక నాలుగో బంతికి కూడా మళ్లీ అదే సీన్​ రిపీట్​ అయింది. వధేరా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో వికెట్ కూడా గాల్లోకి ఎగిరి రెండు ముక్కలైంది.

విలువ ఎంతో తెలుసా..? చివరి ఓవర్లో అర్ష్‌దీప్ అద్భుతమైన యార్కర్లు సంధించాడు. బంతి వేగానికి మిడిల్​ స్టంప్ రెండుసార్లు విరిగి నేలకొరిగింది. మరి విరిగిన వికెట్ ధర ఎంత.. అనేది సోషల్​మీడియాలో చక్కర్లు కొట్టింది. అవి ఎల్‌ఈడీ స్టంప్​లు. వాటి పైన ఉండే బెయిల్స్ కూడా ఎల్‌ఈడీవే. ఈ స్టంప్స్​ బెయిల్స్ లో సెన్సార్​ ఉంటుంది. దీని వల్ల బంతి.. స్టంప్స్​, బెయిల్స్​ను తాకిన వెంటనే అవి వెలుగుతాయి. 2014 టీ20 ప్రపంచకప్​లో మొదటిసారి ఈ ఎల్​ఈడీ స్టంప్స్​, బెయిల్స్​ను ఉపయోగించారు. అప్పటినుంచి వైట్​ బాల్ క్రికెట్​లో ఈ స్టంప్స్​ను వాడుతున్నారు. అయితే ఈ ఐపీఎల్ సీజన్​ కోసం వినియోగిస్తున్న ఒక్కో ఎల్‌ఈడీ స్టంప్స్, దానిపై ఉండే బెయిల్స్ సెట్ ధర రూ. 40 వేల డాలర్లు అని తెలిసింది. అంటే దాదాపు రూ. 30 లక్షలు అన్న మాట. కేవలం స్టంప్స్ సెట్ ధర రూ. 24 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. కాగా, వాంఖడే వేదికగా ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్​లో పంజాబ్ కింగ్స్ 13 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఇదీ చూడండి: IPL 2023 PBKS VS MI : పంజాబ్‌ 'కింగ్‌' అర్ష్‌దీప్‌.. ప్లేయర్స్ విన్యాసాలు చూశారా?

సామ్‌ కరన్‌ (55) విధ్వంసక బ్యాటింగ్‌కు అర్ష్‌దీప్‌ (4/29) సూపర్​ బౌలింగ్‌తో తోడవడం వల్ల.. ఆసక్తికరంగా సాగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. అయితే వాస్తవానికి ముంబయికి ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరమయ్యాయి. అది మరీ అసాధ్యమేమీ కాదు. కానీ అర్ష్‌దీప్‌.. ప్రత్యర్థి జట్టుకు ఏమాత్రం అవకాశమివ్వలేదు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కేవలం రెండే పరుగులిచ్చి రెండు వికెట్లను పడగొట్టాడు. తిలక్‌, వధేరాలను బౌల్డ్‌ చేశాడు. అతడి దెబ్బకు ఈ రెండు సందర్భాల్లోనూ స్టంప్‌ రెండు ముక్కలుగా విరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో వైరల్ అవుతోంది.

ఎలా అంటే.. 215 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబయి జట్టులో రోహిత్ (44), కామెరూన్ గ్రీన్ (67), సూర్యకుమార్ యాదవ్ (57)ల విధ్వంసకర ఇన్నింగ్స్​తో.. ఆ టీమ్​ విజయానికి దగ్గరగా వెళ్లింది. అయితే చివరి ఓవర్లో ముంబయికి.. విజయానికి మరో 16 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలోనే క్రీజులో ఉన్నవధేరా, తిలక్ వర్మకు బంతులను సంధించాడు అర్ష్​దీప్​. మొదటి బంతికి ఒక పరుగే వచ్చింది. సెకండ్​ది డాట్ బాల్. మూడో బాల్​ యార్కర్ సంధించాడు. అయితే వేగంగా దూసుకొచ్చిన బాల్​ను అంచనా వేయడంలో తిలక్ వర్మ కాస్త గతి తప్పాడు. దీంతో బాల్.. మిడిల్ స్టంప్ రెండు ముక్కలైంది. ఇక నాలుగో బంతికి కూడా మళ్లీ అదే సీన్​ రిపీట్​ అయింది. వధేరా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో వికెట్ కూడా గాల్లోకి ఎగిరి రెండు ముక్కలైంది.

విలువ ఎంతో తెలుసా..? చివరి ఓవర్లో అర్ష్‌దీప్ అద్భుతమైన యార్కర్లు సంధించాడు. బంతి వేగానికి మిడిల్​ స్టంప్ రెండుసార్లు విరిగి నేలకొరిగింది. మరి విరిగిన వికెట్ ధర ఎంత.. అనేది సోషల్​మీడియాలో చక్కర్లు కొట్టింది. అవి ఎల్‌ఈడీ స్టంప్​లు. వాటి పైన ఉండే బెయిల్స్ కూడా ఎల్‌ఈడీవే. ఈ స్టంప్స్​ బెయిల్స్ లో సెన్సార్​ ఉంటుంది. దీని వల్ల బంతి.. స్టంప్స్​, బెయిల్స్​ను తాకిన వెంటనే అవి వెలుగుతాయి. 2014 టీ20 ప్రపంచకప్​లో మొదటిసారి ఈ ఎల్​ఈడీ స్టంప్స్​, బెయిల్స్​ను ఉపయోగించారు. అప్పటినుంచి వైట్​ బాల్ క్రికెట్​లో ఈ స్టంప్స్​ను వాడుతున్నారు. అయితే ఈ ఐపీఎల్ సీజన్​ కోసం వినియోగిస్తున్న ఒక్కో ఎల్‌ఈడీ స్టంప్స్, దానిపై ఉండే బెయిల్స్ సెట్ ధర రూ. 40 వేల డాలర్లు అని తెలిసింది. అంటే దాదాపు రూ. 30 లక్షలు అన్న మాట. కేవలం స్టంప్స్ సెట్ ధర రూ. 24 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. కాగా, వాంఖడే వేదికగా ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్​లో పంజాబ్ కింగ్స్ 13 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఇదీ చూడండి: IPL 2023 PBKS VS MI : పంజాబ్‌ 'కింగ్‌' అర్ష్‌దీప్‌.. ప్లేయర్స్ విన్యాసాలు చూశారా?

Last Updated : Apr 23, 2023, 12:00 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.