ETV Bharat / sports

IPL 2023 : చితక్కొట్టిన వృద్ధిమాన్​, పాండ్య.. గుజరాత్​ ఘన విజయం

author img

By

Published : May 5, 2023, 10:25 PM IST

Updated : May 5, 2023, 11:03 PM IST

IPL 2023 : ఐపీఎల్​ 2023లో భాగంగా రాజస్థాన్​ రాయల్స్​, గుజరాత్​ జెయింట్స్​ మధ్య జరిగిన మ్యాచ్​లో 9 వికెట్ల తేడాతో గుజరాత్​ ఘన విజయం సాధించింది. గుజరాత్​ బ్యాటర్లు వృద్ధిమాన్ సాహా, హార్దిక్ పాండ్య అద్భుత ప్రదర్శన చేశారు. ​

match rajasthan royals vs gujarat titans
match rajasthan royals vs gujarat titans

IPL 2023 : ఐపీఎల్​ 2023లో భాగంగా రాజస్థాన్​ రాయల్స్​, గుజరాత్​ జెయింట్స్​ మధ్య జరిగిన మ్యాచ్​లో 9 వికెట్ల తేడాతో గుజరాత్​ ఘన విజయం సాధించింది. రాజస్థాన్​ నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్​.. ఆది నుంచే ఆధిపత్యం కనబర్చింది. రాజస్థాన్​ రాయల్స్​ జట్టు​కు ఏమాత్రం ఛాన్స్​ ఇవ్వకుండా సునాయాసంగా విజయం సాధించింది. శుభ్​మన్​ గిల్​ (38) పరుగులతో మెరిశాడు. ఓపెనర్​ వృద్ధిమాన్​ సాహా(41*), హార్ధిక్​ పాండ్య (39*) పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు నడిపించారు. రాజస్థాన్​ బౌలర్లు చాహల్​ ఒక వికెట్ తీశాడు.

అంతకుముందు.. టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న రాజస్థాన్​ జట్టు.. 17.5 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్ విభాగం పూర్తిగా కుప్పకూలింది. బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు వరుసగా పెవిలియన్​ బాట పట్టారు. దీంతో ఆ జట్టు తక్కువ స్కోరుకే రాజస్థాన్​ ఆలౌట్​ అయింది. ఇక ఫామ్​లో ఉన్న యశస్వి జైస్వాల్ (14) ఈ మ్యాచ్‌లో రన్ అవుట్ అయ్యాడు. అంతకుముందు రెండు బౌండరీలు బాది మంచి జోరు మీద కనిపించిన జోస్ బట్లర్ (8) ఆ మరుసటి బంతిని కట్ చేయబోయి ఔట్ అయ్యాడు. ఇక, సంజూ శాంసన్ (30) ఫర్వాలేదనిపించినా ఎక్కువ సేపు ఆడలేకపోయాడు. దేవదత్ పడిక్కల్ (12), అశ్విన్ (2) నిరాశపరిచారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి ఇంపాక్ట్​ చూపిస్తాడనుకున్న రియాన్ పరాగ్ (4) కూడా పేలవ ప్రదర్శన చేశాడు. హిట్​మయర్ (7), ధృవ్ జురెల్ (9), ట్రెంట్ బౌల్ట్ (15), చివర్లో ఆడమ్ జంపా (7) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఇక, గుజరాత్​ బౌలర్లలో రషీద్​ ఖాన్​ (3) వికెట్లు తీసి అదరగొట్టాడు. నూర్ అహ్మద్​ (2) వికెట్లు పడగొట్టాడు. మహ్మద్​ షమీ, హార్దిక్​ పాండ్య, జోషువా లిటిల్​ ఒక్కో వికెట్​ చొప్పున తీశారు.

వైఫల్యాల రియాన్​ పరాగ్​.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..
ఈ ఐపీఎళ్​ సీజన్​లో రాజస్థాన్​ రాయల్స్​కు చెందిన ఆటగాడు రియాన్​ పరాగ్​ వైఫల్యాలు కొనసాగుతున్నాయి. ఈ మ్యాచ్​లో కేవలం 6 పరుగులకే ఎల్​బీడబ్ల్యూ అయ్యాడు. ఈ సీజన్​లో 6 మ్యాచ్​లు ఆడిన పరాగ్​.. అన్నింట్లో 20 పరుగుల మార్క్​ను కూడా దాటలేకపోయాడు. హైదరాబద్​తో జరిగిన మ్యాచ్​ 6 బంతుల్లో 7 పరుగులు చేశాడు. పంజాబ్​పై 20 పరుగులు (12 బంతుల్లో), దిల్లీపై 7 (11), గుజరాత్​పై 5 (7), లఖ్​నవూపై 15* (12) పరుగులు చేశాడు. 'దీంతో ఆట తక్కువ ఓవరాక్షన్​ ఎక్కువ' అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

ఇవీ చదవండి : టీమ్​ఇండియాకు షాక్​ ​.. WTC ఫైనల్ ​నుంచి కేఎల్​ రాహుల్​ ఔట్

IPL 2023 : ఐపీఎల్​ 2023లో భాగంగా రాజస్థాన్​ రాయల్స్​, గుజరాత్​ జెయింట్స్​ మధ్య జరిగిన మ్యాచ్​లో 9 వికెట్ల తేడాతో గుజరాత్​ ఘన విజయం సాధించింది. రాజస్థాన్​ నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్​.. ఆది నుంచే ఆధిపత్యం కనబర్చింది. రాజస్థాన్​ రాయల్స్​ జట్టు​కు ఏమాత్రం ఛాన్స్​ ఇవ్వకుండా సునాయాసంగా విజయం సాధించింది. శుభ్​మన్​ గిల్​ (38) పరుగులతో మెరిశాడు. ఓపెనర్​ వృద్ధిమాన్​ సాహా(41*), హార్ధిక్​ పాండ్య (39*) పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు నడిపించారు. రాజస్థాన్​ బౌలర్లు చాహల్​ ఒక వికెట్ తీశాడు.

అంతకుముందు.. టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న రాజస్థాన్​ జట్టు.. 17.5 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్ విభాగం పూర్తిగా కుప్పకూలింది. బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు వరుసగా పెవిలియన్​ బాట పట్టారు. దీంతో ఆ జట్టు తక్కువ స్కోరుకే రాజస్థాన్​ ఆలౌట్​ అయింది. ఇక ఫామ్​లో ఉన్న యశస్వి జైస్వాల్ (14) ఈ మ్యాచ్‌లో రన్ అవుట్ అయ్యాడు. అంతకుముందు రెండు బౌండరీలు బాది మంచి జోరు మీద కనిపించిన జోస్ బట్లర్ (8) ఆ మరుసటి బంతిని కట్ చేయబోయి ఔట్ అయ్యాడు. ఇక, సంజూ శాంసన్ (30) ఫర్వాలేదనిపించినా ఎక్కువ సేపు ఆడలేకపోయాడు. దేవదత్ పడిక్కల్ (12), అశ్విన్ (2) నిరాశపరిచారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి ఇంపాక్ట్​ చూపిస్తాడనుకున్న రియాన్ పరాగ్ (4) కూడా పేలవ ప్రదర్శన చేశాడు. హిట్​మయర్ (7), ధృవ్ జురెల్ (9), ట్రెంట్ బౌల్ట్ (15), చివర్లో ఆడమ్ జంపా (7) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఇక, గుజరాత్​ బౌలర్లలో రషీద్​ ఖాన్​ (3) వికెట్లు తీసి అదరగొట్టాడు. నూర్ అహ్మద్​ (2) వికెట్లు పడగొట్టాడు. మహ్మద్​ షమీ, హార్దిక్​ పాండ్య, జోషువా లిటిల్​ ఒక్కో వికెట్​ చొప్పున తీశారు.

వైఫల్యాల రియాన్​ పరాగ్​.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..
ఈ ఐపీఎళ్​ సీజన్​లో రాజస్థాన్​ రాయల్స్​కు చెందిన ఆటగాడు రియాన్​ పరాగ్​ వైఫల్యాలు కొనసాగుతున్నాయి. ఈ మ్యాచ్​లో కేవలం 6 పరుగులకే ఎల్​బీడబ్ల్యూ అయ్యాడు. ఈ సీజన్​లో 6 మ్యాచ్​లు ఆడిన పరాగ్​.. అన్నింట్లో 20 పరుగుల మార్క్​ను కూడా దాటలేకపోయాడు. హైదరాబద్​తో జరిగిన మ్యాచ్​ 6 బంతుల్లో 7 పరుగులు చేశాడు. పంజాబ్​పై 20 పరుగులు (12 బంతుల్లో), దిల్లీపై 7 (11), గుజరాత్​పై 5 (7), లఖ్​నవూపై 15* (12) పరుగులు చేశాడు. 'దీంతో ఆట తక్కువ ఓవరాక్షన్​ ఎక్కువ' అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

ఇవీ చదవండి : టీమ్​ఇండియాకు షాక్​ ​.. WTC ఫైనల్ ​నుంచి కేఎల్​ రాహుల్​ ఔట్

Last Updated : May 5, 2023, 11:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.