ETV Bharat / sports

IPL 2022: షా వన్​మ్యాన్​ షో.. లఖ్​నవూ లక్ష్యం ఎంతంటే?

author img

By

Published : Apr 7, 2022, 9:15 PM IST

IPL 2022: లఖ్​నవూతో మ్యాచ్​ సందర్భంగా దిల్లీ ఓపెనర్ పృథ్వీ షా హాఫ్​ సెంచరీతో చెలరేగిపోయాడు. దీంతో లఖ్​నవూ ముందు 150 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది పంత్​సేన.

IPL 2022
dc vs lucknow

IPL 2022: లఖ్​నవూతో మ్యాచ్​తో సుడిగాలి ఇన్నింగ్స్​ ఆడాడు దిల్లీ ఓపెనర్ పృథ్వీ షా. 34 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. దీంతో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది దిల్లీ. 8వ ఓవర్లోనే షా ఔట్ అవడం వల్ల దిల్లీ ఇన్నింగ్స్ ఒక్కసారిగా నెమ్మదించింది. డేవిడ్ వార్నర్ (4), రోవ్​మన్ పొవెల్ (3) విఫలమయ్యారు. దీంతో నిలకడగా బ్యాటింగ్​ చేసిన కెప్టెన్ రిషభ్ పంత్ (39*), సర్ఫరాజ్ ఖాన్ (36*)​ జోడీ.. ఇన్నింగ్స్​ను నిలబెట్టింది. లఖ్​నవూకు 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

లఖ్​నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్ 2, కృష్ణప్ప గౌతమ్ ఒక వికెట్ పడగొట్టారు.

IPL 2022: లఖ్​నవూతో మ్యాచ్​తో సుడిగాలి ఇన్నింగ్స్​ ఆడాడు దిల్లీ ఓపెనర్ పృథ్వీ షా. 34 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. దీంతో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది దిల్లీ. 8వ ఓవర్లోనే షా ఔట్ అవడం వల్ల దిల్లీ ఇన్నింగ్స్ ఒక్కసారిగా నెమ్మదించింది. డేవిడ్ వార్నర్ (4), రోవ్​మన్ పొవెల్ (3) విఫలమయ్యారు. దీంతో నిలకడగా బ్యాటింగ్​ చేసిన కెప్టెన్ రిషభ్ పంత్ (39*), సర్ఫరాజ్ ఖాన్ (36*)​ జోడీ.. ఇన్నింగ్స్​ను నిలబెట్టింది. లఖ్​నవూకు 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

లఖ్​నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్ 2, కృష్ణప్ప గౌతమ్ ఒక వికెట్ పడగొట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.