ETV Bharat / sports

IPL 2022: రసెల్ విధ్వంసం.. పంజాబ్​పై కోల్​కతా ఘనవిజయం

author img

By

Published : Apr 1, 2022, 10:43 PM IST

Updated : Apr 1, 2022, 10:58 PM IST

IPL 2022: వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్​లో పంజాబ్​పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది కోల్​కతా నైట్​రైడర్స్. ఆండ్రీ రసెల్​ (70*) మెరుపు అర్ధశతకం చేశాడు.

ipl 2022
kkr vs pbks

IPL 2022: వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది కోల్​కతా నైట్​రైడర్స్​. పంజాబ్​ నిర్దేశించిన 138 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని 14.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆండ్రీ రసెల్​ (70*) మెరుపు ఇన్నింగ్స్​ ఆడాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (26) ఫర్వాలేదనిపించాడు. రహానె (12), వెంకటేశ్ అయ్యర్ (3), నితీశ్ రాణా (0) నిరాశపరిచారు. సామ్ బిల్లింగ్స్​ (24) నాటౌట్​గా నిలిచాడు. పంజాబ్​ బౌలర్లలో రాహుల్ చాహర్ రెండు, ఓడియన్ స్మిత్, రబాడ, చెరో వికెట్ పడగొట్టారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన పంజాబ్​ను పటిష్ఠమైన బౌలింగ్​తో కట్టడి చేశారు కోల్​కతా బౌలర్లు. పంజాబ్​ బ్యాటర్లలో భనుక రాజపక్స (9 బంతుల్లోనే 31) మెరిశాడు. లియామ్ లివింగ్​స్టోన్ (19), ఓపెనర్ శిఖర్ ధావన్ (16), హర్​ప్రీత్ బ్రార్​ (14), రాజ్​ బవా (11) పరుగులు చేశారు. కెప్టెన్ మయాంక్​ సహా మిగిలినవారు విఫలమయ్యారు. దీంతో 18.2 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. కోల్​కతా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 4, టిమ్ సౌథీ 2, శివం మావి, నరైన్, రసెల్ తలో వికెట్ తీశారు.

ఇదీ చూడండి: కోహ్లీ, రోహిత్​ను ఢీకొనాలి.. వారికి అది నచ్చదు: అశ్విన్

IPL 2022: వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది కోల్​కతా నైట్​రైడర్స్​. పంజాబ్​ నిర్దేశించిన 138 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని 14.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆండ్రీ రసెల్​ (70*) మెరుపు ఇన్నింగ్స్​ ఆడాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (26) ఫర్వాలేదనిపించాడు. రహానె (12), వెంకటేశ్ అయ్యర్ (3), నితీశ్ రాణా (0) నిరాశపరిచారు. సామ్ బిల్లింగ్స్​ (24) నాటౌట్​గా నిలిచాడు. పంజాబ్​ బౌలర్లలో రాహుల్ చాహర్ రెండు, ఓడియన్ స్మిత్, రబాడ, చెరో వికెట్ పడగొట్టారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన పంజాబ్​ను పటిష్ఠమైన బౌలింగ్​తో కట్టడి చేశారు కోల్​కతా బౌలర్లు. పంజాబ్​ బ్యాటర్లలో భనుక రాజపక్స (9 బంతుల్లోనే 31) మెరిశాడు. లియామ్ లివింగ్​స్టోన్ (19), ఓపెనర్ శిఖర్ ధావన్ (16), హర్​ప్రీత్ బ్రార్​ (14), రాజ్​ బవా (11) పరుగులు చేశారు. కెప్టెన్ మయాంక్​ సహా మిగిలినవారు విఫలమయ్యారు. దీంతో 18.2 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. కోల్​కతా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 4, టిమ్ సౌథీ 2, శివం మావి, నరైన్, రసెల్ తలో వికెట్ తీశారు.

ఇదీ చూడండి: కోహ్లీ, రోహిత్​ను ఢీకొనాలి.. వారికి అది నచ్చదు: అశ్విన్

Last Updated : Apr 1, 2022, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.