ETV Bharat / sports

IPL 2022: ప్లేఆఫ్స్​కు ముంబయి.. 2014 సీన్​ రిపీట్ అవుతుందా?

author img

By

Published : Apr 14, 2022, 5:26 PM IST

Mumbai Indians: ముంబయి ఇండియన్స్​కు వరుసగా ఐదు ఓటములు ఎదురైన నేపథ్యంలో.. ఐపీఎల్ 2014 సీన్​ రిపీట్​ అవుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఆ సీజన్​లోనూ ఇలాగే వరుసగా ఐదు మ్యాచ్​ల్లో ఓడి ప్లేఆఫ్స్​కు చేరింది రోహిత్ సేన. అయితే అలా జరిగేందుకు మళ్లీ అవకాశం ఉందా?

Mumbai Indians
IPL 2022

Mumbai Indians: ఐపీఎల్​ 2022లో వరుసగా ఐదు మ్యాచ్​ల్లో ఓటమిపాలై అభిమానులను నిరాశ పరిచింది ముంబయి ఇండియన్స్​. అయితే 2014లోనూ ఇలానే వరుసగా ఐదు మ్యాచ్‌లను ఓడింది.. ఇంకేం పుంజుకొంటుందిలే అనుకుని ప్రత్యర్థి జట్లు కాస్త రిలాక్స్‌ అయ్యాయి.. ఇదే అదనుగా చెన్నై, కోల్‌కతా మినహా ఇతర జట్లపై వరుసపెట్టి విజయాలను నమోదు చేసి ప్లేఆఫ్స్‌ చేరుకుంది రోహిత్ సేన. ఇప్పుడు కూడా మరోసారి ముంబయికి అదే పరిస్థితి ఎదురైంది. మరి ఈసారి ఎలా రాణిస్తుందో వేచి చూడాలి. ఈలోగా అప్పుడేం జరిగింది.. ఎలా రాణించింది.. ఇప్పుడు ఇలా కావడానికి కారణాలేంటో ఓసారి విశ్లేషిద్దాం..

వరుసగా ఓడినా.. టాప్‌-4లోకి: ఏ జట్టైనా వరుసగా రెండో మూడో మ్యాచ్‌లను ఓడితేనే డీలాపడతాయి. అలాంటిది ముంబయి ఏకధాటిగా ఐదు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైనా టాప్‌4లో స్థానం పదిలం చేసుకొంది. 2014 టీ20 సీజన్‌లో ఈ అరుదైన ఫీట్‌ను సాధించింది. అయితే, ఎలిమినేటర్ మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓటమిపాలై ఇంటిముఖం పట్టినా సరే ఆ పోరాట పటిమను ఎప్పటికీ మరువలేం. చెన్నై, కోల్‌కతా జట్లపై మాత్రమే ఓడిన ముంబయి రెండో రౌండ్‌లో మిగతా టీమ్‌లపై విజయం సాధించడం విశేషం.

ఏడు విజయాలు.. ఏడు ఓటములు: అప్పుడు ఎనిమిది జట్లు మాత్రమే పాల్గొన్న లీగ్‌లో ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే కనీసం ఏడు విజయాలను నమోదు చేయాలి. అప్పటికీ మెరుగైన రన్‌రేట్‌ను కలిగి ఉండాలి. అప్పటికే వరుసగా ఐదు మ్యాచ్‌లను ఓడిన ముంబయికి అవకాశం లభించదని అభిమానులు నిరాశ పడ్డారు. అయితే, వారి అంచనాలను తప్పని రుజువు చేస్తూ తన ఆరో మ్యాచ్‌ నుంచి చివరి మ్యాచ్‌ వరకు మొత్తం తొమ్మిదింట ఏడు విజయాలు, రెండు అపజయాలతో 14 పాయింట్లు సాధించి నాలుగో స్థానానికి ఎగబాకింది. రాజస్థాన్‌ రాయల్స్‌కు కూడా సరిగ్గా పద్నాలుగే ఉన్నప్పటికీ మెరుగైన రన్‌రేట్‌తో ముంబయి ప్లేఆఫ్స్‌కు చేరుకొంది. సరిగ్గా ఇలానే 2022వ ఏడాది సీజన్‌లోనూ ముంబయి రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Mumbai Indians
కృనాల్-హార్దిక్

మెగా వేలమే కారణమా...?: ఇక ఈ సీజన్‌ విషయానికొస్తే.. విజయం ముంగిట బోల్తా పడటం ముంబయికి పరిపాటిగా మారింది. దీనింతటికి కారణం మెగా వేలం అని చెప్పుకోవాలేమో. గత సీజన్‌ వరకు ముంబయి జట్టును తీసుకుంటే భయంకరంగా ఉండేది. కానీ, మెగా వేలంలో యువ క్రికెటర్లకు పెద్దపీట వేసి విదేశీ సీనియర్లను కొనుగోలు చేయలేదు. అయితే, ఇదంతా సంధి కాలమని పైకి చెప్పుకుంటున్నా వారులేని లోటు బ్యాటింగ్, బౌలింగ్‌లో వైఫల్యంతో స్పష్టంగా కనిపిస్తోంది. మొన్నటి వరకు పాండ్య బ్రదర్స్‌ ఆదుకునేవారు. ఈసారి వారితో పాటు ఓపెనర్ డికాక్‌, కీలక బౌలర్‌ ట్రెంట్ బౌల్ట్‌, స్పిన్నర్‌ రాహుల్ చాహర్ వంటి ఆటగాళ్లు లేకపోవడం వల్ల జట్టు బలహీనంగా మారింది.

Mumbai Indians
తిలక్ వర్మ-బ్రెవిస్

ఫామ్‌ను అందుకోని హిట్టర్‌..: ఓపెనింగ్‌ శుభారంభం దక్కితే వెనుక వచ్చే బ్యాటర్లు సులువుగా హిట్టింగ్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే, ముంబయి ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్‌ కిషన్‌లలో ఒకరు మాత్రమే రాణించడం.. తొలి వికెట్‌కు మంచి భాగస్వామ్యాలు లభించకపోవడం వల్ల మిడిలార్డర్‌పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. అక్కడ తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, బ్రెవిస్‌ వంటి ఆటగాళ్లు పరుగులు రాబడుతున్నా.. కీలకమైన సమయంలో భారీ హిట్టర్‌ కీరన్‌ పొలార్డ్‌ చేతులేత్తేయడం ముంబయి ఓటములకు మరో కారణంగా కనిపిస్తోంది. లోయర్‌ ఆర్డర్‌లో హార్డ్‌ హిట్టర్‌గా పేరొందిన పొలార్డ్‌ కీలకమైన మ్యాచుల్లోనూ తేలిపోవడం ముంబయిని మరింత కలవర పెట్టే అంశం.

Mumbai Indians
బుమ్రా

ప్లే ఆఫ్స్‌లోకి వెళ్లాలంటే..?: ప్రస్తుత సీజన్‌లో మొత్తం పది జట్లు తలపడుతున్నాయి. ఒక్కో జట్టు పద్నాలుగేసి మ్యాచ్‌లను ఆడాల్సి ఉంటుంది. ముంబయి ఇప్పటికే ఐదు మ్యాచ్‌లను ఆడింది. అన్నింట్లోనూ ఓడింది. ఇక మిగిలింది తొమ్మిది. ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే కనీసం ఎనిమిది విజయాలనైనా సాధించాల్సిందే. కాస్త, ఆలస్యంగానైనా పాయింట్ల ఖాతాను తెరిచిన చెన్నైతో సహా ప్రతి జట్టూ బలమైందే. ఎప్పుడు ఎలా ఆడతారో తెలియని హైదరాబాద్‌ కూడా రెండు మ్యాచ్‌లను గెలిచింది. కాబట్టి ఏ జట్టునూ అలుసుగా తీసుకోకూడదు. ప్రతి మ్యాచ్‌లోనూ నెగ్గాలంటే ముంబయి బ్యాటింగ్‌, బౌలింగ్‌ సహా అన్ని విభాగాలపైనా దృష్టిపెట్టాలి. బౌలింగ్‌లో బుమ్రాకు తోడుగా యువ బౌలర్లు అండగా నిలవాల్సిన తరుణమిది. రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టుకు వెన్నెముకగా నిలిస్తే ఐదుసార్లు ఛాంపియన్‌కు విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.

ఇవీ చూడండి:

'రోహిత్ కెప్టెన్సీపై అలాంటి మాటలు.. బుమ్రా ఒక్కడే..'

జూలు విదిల్చిన 'బేబీ ఏబీ'.. ఈ ఐపీఎల్​లోనే భారీ సిక్స్​.. వీడియో వైరల్​

IPL 2022: ముంబయికి షాక్​.. రోహిత్​కు భారీ జరిమానా

Mumbai Indians: ఐపీఎల్​ 2022లో వరుసగా ఐదు మ్యాచ్​ల్లో ఓటమిపాలై అభిమానులను నిరాశ పరిచింది ముంబయి ఇండియన్స్​. అయితే 2014లోనూ ఇలానే వరుసగా ఐదు మ్యాచ్‌లను ఓడింది.. ఇంకేం పుంజుకొంటుందిలే అనుకుని ప్రత్యర్థి జట్లు కాస్త రిలాక్స్‌ అయ్యాయి.. ఇదే అదనుగా చెన్నై, కోల్‌కతా మినహా ఇతర జట్లపై వరుసపెట్టి విజయాలను నమోదు చేసి ప్లేఆఫ్స్‌ చేరుకుంది రోహిత్ సేన. ఇప్పుడు కూడా మరోసారి ముంబయికి అదే పరిస్థితి ఎదురైంది. మరి ఈసారి ఎలా రాణిస్తుందో వేచి చూడాలి. ఈలోగా అప్పుడేం జరిగింది.. ఎలా రాణించింది.. ఇప్పుడు ఇలా కావడానికి కారణాలేంటో ఓసారి విశ్లేషిద్దాం..

వరుసగా ఓడినా.. టాప్‌-4లోకి: ఏ జట్టైనా వరుసగా రెండో మూడో మ్యాచ్‌లను ఓడితేనే డీలాపడతాయి. అలాంటిది ముంబయి ఏకధాటిగా ఐదు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైనా టాప్‌4లో స్థానం పదిలం చేసుకొంది. 2014 టీ20 సీజన్‌లో ఈ అరుదైన ఫీట్‌ను సాధించింది. అయితే, ఎలిమినేటర్ మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓటమిపాలై ఇంటిముఖం పట్టినా సరే ఆ పోరాట పటిమను ఎప్పటికీ మరువలేం. చెన్నై, కోల్‌కతా జట్లపై మాత్రమే ఓడిన ముంబయి రెండో రౌండ్‌లో మిగతా టీమ్‌లపై విజయం సాధించడం విశేషం.

ఏడు విజయాలు.. ఏడు ఓటములు: అప్పుడు ఎనిమిది జట్లు మాత్రమే పాల్గొన్న లీగ్‌లో ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే కనీసం ఏడు విజయాలను నమోదు చేయాలి. అప్పటికీ మెరుగైన రన్‌రేట్‌ను కలిగి ఉండాలి. అప్పటికే వరుసగా ఐదు మ్యాచ్‌లను ఓడిన ముంబయికి అవకాశం లభించదని అభిమానులు నిరాశ పడ్డారు. అయితే, వారి అంచనాలను తప్పని రుజువు చేస్తూ తన ఆరో మ్యాచ్‌ నుంచి చివరి మ్యాచ్‌ వరకు మొత్తం తొమ్మిదింట ఏడు విజయాలు, రెండు అపజయాలతో 14 పాయింట్లు సాధించి నాలుగో స్థానానికి ఎగబాకింది. రాజస్థాన్‌ రాయల్స్‌కు కూడా సరిగ్గా పద్నాలుగే ఉన్నప్పటికీ మెరుగైన రన్‌రేట్‌తో ముంబయి ప్లేఆఫ్స్‌కు చేరుకొంది. సరిగ్గా ఇలానే 2022వ ఏడాది సీజన్‌లోనూ ముంబయి రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Mumbai Indians
కృనాల్-హార్దిక్

మెగా వేలమే కారణమా...?: ఇక ఈ సీజన్‌ విషయానికొస్తే.. విజయం ముంగిట బోల్తా పడటం ముంబయికి పరిపాటిగా మారింది. దీనింతటికి కారణం మెగా వేలం అని చెప్పుకోవాలేమో. గత సీజన్‌ వరకు ముంబయి జట్టును తీసుకుంటే భయంకరంగా ఉండేది. కానీ, మెగా వేలంలో యువ క్రికెటర్లకు పెద్దపీట వేసి విదేశీ సీనియర్లను కొనుగోలు చేయలేదు. అయితే, ఇదంతా సంధి కాలమని పైకి చెప్పుకుంటున్నా వారులేని లోటు బ్యాటింగ్, బౌలింగ్‌లో వైఫల్యంతో స్పష్టంగా కనిపిస్తోంది. మొన్నటి వరకు పాండ్య బ్రదర్స్‌ ఆదుకునేవారు. ఈసారి వారితో పాటు ఓపెనర్ డికాక్‌, కీలక బౌలర్‌ ట్రెంట్ బౌల్ట్‌, స్పిన్నర్‌ రాహుల్ చాహర్ వంటి ఆటగాళ్లు లేకపోవడం వల్ల జట్టు బలహీనంగా మారింది.

Mumbai Indians
తిలక్ వర్మ-బ్రెవిస్

ఫామ్‌ను అందుకోని హిట్టర్‌..: ఓపెనింగ్‌ శుభారంభం దక్కితే వెనుక వచ్చే బ్యాటర్లు సులువుగా హిట్టింగ్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే, ముంబయి ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్‌ కిషన్‌లలో ఒకరు మాత్రమే రాణించడం.. తొలి వికెట్‌కు మంచి భాగస్వామ్యాలు లభించకపోవడం వల్ల మిడిలార్డర్‌పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. అక్కడ తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, బ్రెవిస్‌ వంటి ఆటగాళ్లు పరుగులు రాబడుతున్నా.. కీలకమైన సమయంలో భారీ హిట్టర్‌ కీరన్‌ పొలార్డ్‌ చేతులేత్తేయడం ముంబయి ఓటములకు మరో కారణంగా కనిపిస్తోంది. లోయర్‌ ఆర్డర్‌లో హార్డ్‌ హిట్టర్‌గా పేరొందిన పొలార్డ్‌ కీలకమైన మ్యాచుల్లోనూ తేలిపోవడం ముంబయిని మరింత కలవర పెట్టే అంశం.

Mumbai Indians
బుమ్రా

ప్లే ఆఫ్స్‌లోకి వెళ్లాలంటే..?: ప్రస్తుత సీజన్‌లో మొత్తం పది జట్లు తలపడుతున్నాయి. ఒక్కో జట్టు పద్నాలుగేసి మ్యాచ్‌లను ఆడాల్సి ఉంటుంది. ముంబయి ఇప్పటికే ఐదు మ్యాచ్‌లను ఆడింది. అన్నింట్లోనూ ఓడింది. ఇక మిగిలింది తొమ్మిది. ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే కనీసం ఎనిమిది విజయాలనైనా సాధించాల్సిందే. కాస్త, ఆలస్యంగానైనా పాయింట్ల ఖాతాను తెరిచిన చెన్నైతో సహా ప్రతి జట్టూ బలమైందే. ఎప్పుడు ఎలా ఆడతారో తెలియని హైదరాబాద్‌ కూడా రెండు మ్యాచ్‌లను గెలిచింది. కాబట్టి ఏ జట్టునూ అలుసుగా తీసుకోకూడదు. ప్రతి మ్యాచ్‌లోనూ నెగ్గాలంటే ముంబయి బ్యాటింగ్‌, బౌలింగ్‌ సహా అన్ని విభాగాలపైనా దృష్టిపెట్టాలి. బౌలింగ్‌లో బుమ్రాకు తోడుగా యువ బౌలర్లు అండగా నిలవాల్సిన తరుణమిది. రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టుకు వెన్నెముకగా నిలిస్తే ఐదుసార్లు ఛాంపియన్‌కు విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.

ఇవీ చూడండి:

'రోహిత్ కెప్టెన్సీపై అలాంటి మాటలు.. బుమ్రా ఒక్కడే..'

జూలు విదిల్చిన 'బేబీ ఏబీ'.. ఈ ఐపీఎల్​లోనే భారీ సిక్స్​.. వీడియో వైరల్​

IPL 2022: ముంబయికి షాక్​.. రోహిత్​కు భారీ జరిమానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.