ETV Bharat / sports

ఆర్సీబీలో ఉన్నప్పుడు రిటైర్ అవుతా: చాహల్​ - చాహల్​ రిటైర్మెంట్​

క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించే సమయంలో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగుళూరు జట్టులో ఉండాలని కోరుకుంటున్నట్లు స్పిన్నర్​ యుజ్వేంద్ర చాహల్​ చెప్పాడు. 2014 ఐపీఎల్​లో ఆర్సీబీ తరఫున ప్రాతినిధ్యం వహించిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని చెప్పాడు.

IPL 2021: I want my retirement to be with RCB, Says Yuzvendra Chahal
రిటైర్మెంట్​పై యుజ్వేంద్ర చాహల్​ సంచలన వ్యాఖ్యలు
author img

By

Published : Sep 13, 2021, 5:30 AM IST

అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​పై టీమ్ఇండియా స్పిన్నర్​ యుజ్వేంద్ర చాహల్​ తన మనసులోని మాట బయటపెట్టాడు. ఆటకు వీడ్కోలు పలికే వరకు ఐపీఎల్​లో రాయల్ ఛాలెంజర్స్​ బెంగుళూరు జట్టు తరఫున ఆడాలనేది తన కోరిక అని అంటున్నాడు. 2014లో ఆర్సీబీ జట్టులో చేరిన తర్వాత తనకు గుర్తింపుతో తన జీవితం పూర్తిగా మారిపోయిందని చెప్పాడు. ఐపీఎల్​లో వచ్చే ఏడాది జరగనున్న మెగా ఐపీఎల్​ నేపథ్యంలో చాహల్​ మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

"నేను క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించే సమయంలో.. నేను ఐపీఎల్​ జట్టు ఆర్సీబీలో ఉండాలని కోరుకుంటున్నా. ఈ జట్టులో చేరిన తర్వాతే నా జీవితం పూర్తిగా మారిపోయింది. 2014లో ఆర్సీబీ జట్టులో భాగమైన తర్వాత నేను అంటూ ఒకడిని ఉన్నానని ప్రేక్షకులకు తెలియదు. ఎందుకంటే అమిత్​ మిశ్రా, జయంత్​ యాదవ్​ లాగా నేను రంజీ ట్రోఫీల్లో ఆడకపోవడమే కారణం. కానీ, ఆ సంవత్సరంతో నా జీవితం మారిపోయింది. అందువల్ల నేను ఆర్సీబీలో ఉన్నప్పుడే రిటైర్ అవ్వాలనేది నా కోరిక. నేను ఐపీఎల్​ ఆడుతున్నానంటే అది ఆర్సీబీ జట్టు వల్లే!".

- యుజ్వేంద్ర చాహల్​, టీమ్ఇండియా స్పిన్నర్​

అయితే 2013లో జరిగిన వేలంలో ముంబయి ఇండియన్స్​ జట్టు తొలిసారి చాహల్​ను సొంతం చేసుకుంది. అదే ఏడాది ఐపీఎల్​లో అరంగేట్రం చేశాడు. 2014లో ఆర్సీబీ చేరిన తర్వాత తొలిసారి టోర్నీ మొత్తం మ్యాచ్​ల్లో భాగమయ్యాడు. అప్పటినుంచి ఆర్సీబీ ఆడిన ప్రతి మ్యాచ్​లో ప్రాతినిధ్యం వహించి.. 23 సగటుతో 126 వికెట్లను పడగొట్టాడు.

ఇదీ చూడండి.. IND Vs ENG: 'ఆఖరి టెస్టు రద్దు.. వారికి క్షమాపణలు చెబుతున్నా'

అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​పై టీమ్ఇండియా స్పిన్నర్​ యుజ్వేంద్ర చాహల్​ తన మనసులోని మాట బయటపెట్టాడు. ఆటకు వీడ్కోలు పలికే వరకు ఐపీఎల్​లో రాయల్ ఛాలెంజర్స్​ బెంగుళూరు జట్టు తరఫున ఆడాలనేది తన కోరిక అని అంటున్నాడు. 2014లో ఆర్సీబీ జట్టులో చేరిన తర్వాత తనకు గుర్తింపుతో తన జీవితం పూర్తిగా మారిపోయిందని చెప్పాడు. ఐపీఎల్​లో వచ్చే ఏడాది జరగనున్న మెగా ఐపీఎల్​ నేపథ్యంలో చాహల్​ మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

"నేను క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించే సమయంలో.. నేను ఐపీఎల్​ జట్టు ఆర్సీబీలో ఉండాలని కోరుకుంటున్నా. ఈ జట్టులో చేరిన తర్వాతే నా జీవితం పూర్తిగా మారిపోయింది. 2014లో ఆర్సీబీ జట్టులో భాగమైన తర్వాత నేను అంటూ ఒకడిని ఉన్నానని ప్రేక్షకులకు తెలియదు. ఎందుకంటే అమిత్​ మిశ్రా, జయంత్​ యాదవ్​ లాగా నేను రంజీ ట్రోఫీల్లో ఆడకపోవడమే కారణం. కానీ, ఆ సంవత్సరంతో నా జీవితం మారిపోయింది. అందువల్ల నేను ఆర్సీబీలో ఉన్నప్పుడే రిటైర్ అవ్వాలనేది నా కోరిక. నేను ఐపీఎల్​ ఆడుతున్నానంటే అది ఆర్సీబీ జట్టు వల్లే!".

- యుజ్వేంద్ర చాహల్​, టీమ్ఇండియా స్పిన్నర్​

అయితే 2013లో జరిగిన వేలంలో ముంబయి ఇండియన్స్​ జట్టు తొలిసారి చాహల్​ను సొంతం చేసుకుంది. అదే ఏడాది ఐపీఎల్​లో అరంగేట్రం చేశాడు. 2014లో ఆర్సీబీ చేరిన తర్వాత తొలిసారి టోర్నీ మొత్తం మ్యాచ్​ల్లో భాగమయ్యాడు. అప్పటినుంచి ఆర్సీబీ ఆడిన ప్రతి మ్యాచ్​లో ప్రాతినిధ్యం వహించి.. 23 సగటుతో 126 వికెట్లను పడగొట్టాడు.

ఇదీ చూడండి.. IND Vs ENG: 'ఆఖరి టెస్టు రద్దు.. వారికి క్షమాపణలు చెబుతున్నా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.