భారత్ నుంచి ఆస్ట్రేలియాకు విమాన రాకపోకలు నిలిపివేయడంపై ఆస్ట్రేలియన్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ టెడ్ గ్రీన్బెర్గ్ స్పందించారు. ఐపీఎల్ అనంతరం ఆసీస్ క్రికెటర్లు స్వదేశానికి తీసుకొచ్చే విషయంపై క్రికెట్ ఆస్ట్రేలియాతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.
"ఐపీఎల్లో ఆడుతున్న మన ఆటగాళ్లు దేనిపై ఆశలు, అంచనాలు పెట్టుకోలేదు. వాళ్లు కోరుకునేది కేవలం సరైన సమాచారం. లీగ్ అనంతరం ఛార్టర్డ్ విమానాల్లో తీసుకెళ్తారా? లేదా? అనేది వారు తెలుసుకోవాలనుకుంటున్నారు. దాన్ని బట్టి వారు ఈ లీగ్కు ప్రణాళిక వేసుకుంటారు. ఇందుకు సంబంధించి ఇటు క్రికెట్ ఆస్ట్రేలియాతో పాటు ఐపీఎల్ నిర్వాహకులతోనూ చర్చలు జరుపుతున్నాం" అని గ్రీన్బర్గ్ తెలిపారు.
ఇదీ చదవండి: 'ప్రత్యేక ఏర్పాట్లు చేయండి- అదేం కుదరదు'
స్వదేశానికి ఎలా వెళ్లాలనే విషయంపై ఆందోళన చెందుతున్న విదేశీ క్రికెటర్లకు ఐపీఎల్ సీఓఓ హేమంగ్ అమిన్ స్పష్టత ఇచ్చారు. సజావుగా ఇళ్లను చేర్చడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు.
ఇదీ చదవండి: 'మీరు సజావుగా వెళ్లాకే.. లీగ్ ముగిసినట్లు భావిస్తాం'