ETV Bharat / sports

పంజాబ్ కింగ్స్​పై చెన్నై ఘనవిజయం

author img

By

Published : Apr 16, 2021, 10:42 PM IST

పంజాబ్ కింగ్స్​తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్​లో ఘనవిజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. 107 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి చేధించి సునాయాస విజయం సొంతం చేసుకుంది.

ALI
అలీ

పంజాబ్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో ఘనవిజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. 107 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో ఛేదించి 6 వికెట్ల తేడాతో సునాయాస విజయం సొంతం చేసుకుంది. మొయిన్ అలీ (46), డుప్లెసిస్ (36) ఆకట్టుకునే ప్రదర్శన చేసి జట్టుకు విజయాన్ని అందించారు.

లక్ష్య ఛేదనలో ఓపెనర్ రుతురాజ్ (5) వికెట్​ను తొందరగానే కోల్పోయింది చెన్నై. కానీ తర్వాత డుప్లెసిస్​తో కలిసి మూడో వికెట్​కు 90 పరుగులు జోడించి విజయాన్ని సునాయాసం చేశాడు మొయిన్ అలీ. 31 బంతుల్లో 46 పరుగులు చేసి ఇతడు ఔటైన తర్వాత ఇన్నింగ్స్​ కాస్త నెమ్మదించింది. 8 పరుగులు చేస్తే విజయం వరిస్తుందనగా వరుస బంతుల్లో రైనా (8), రాయుడు (0) వికెట్లను కోల్పోయింది సీఎస్కే. కానీ చివర్లో సామ్ కరన్ ఫోర్​తో జట్టుకు విజయాన్నందించాడు.

తడబడిన పంజాబ్

టాస్ ఓడి మొదట బ్యాటింగ్​కు దిగిన పంజాబ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే మయాంక్ అగర్వాల్​(1)​ వికెట్ కోల్పోయింది. అద్భుత ఔట్​ స్వింగర్​తో ఇతడిని బోల్తా కొట్టించాడు దీపక్ చాహర్. తర్వాత కెప్టెన్ రాహుల్​ (5) రనౌట్​గా వెనుదిరిగాడు. గేల్, రాహుల్ వికెట్ల మధ్య సమన్వయ లోపంతో తడబడగా వికెట్లను నేరుగా గిరాటేసి అద్భుత ఫీల్డింగ్​తో రాహుల్​ను పెవిలియన్ చేర్చాడు జడేజా. తర్వాత దీపక్ బౌలింగ్​లో గేల్​ (10) జడేజా అద్భుత క్యాచ్​తో వెనుదిరిగాడు. అనంతరం అదే ఓవర్లో నికోలస్​ పూరన్​ (0)ను కూడా ఔట్ చేసిన దీపక్, మరో ఓవర్లో దీపక్ హుడా (10)ను పెవిలియన్ చేర్చి సీఎస్కే శిబిరంలో ఆనందంనింపాడు.

ప్రధాన బ్యాట్స్​మెన్ ఔటైనా కూడా షారుఖ్ ఖాన్​ (47) అద్భుత బ్యాటింగ్​తో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్ని పంజాబ్ గౌరవప్రదమైన స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. చివరి ఓవర్లో భారీ షాట్​కు ప్రయత్నించి సామ్ కరన్ బౌలింగ్​లో క్యాచ్​ ఔట్​గా వెనుదిరిగాడు. ఫలితంగా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది పంజాబ్.

పంజాబ్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో ఘనవిజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. 107 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో ఛేదించి 6 వికెట్ల తేడాతో సునాయాస విజయం సొంతం చేసుకుంది. మొయిన్ అలీ (46), డుప్లెసిస్ (36) ఆకట్టుకునే ప్రదర్శన చేసి జట్టుకు విజయాన్ని అందించారు.

లక్ష్య ఛేదనలో ఓపెనర్ రుతురాజ్ (5) వికెట్​ను తొందరగానే కోల్పోయింది చెన్నై. కానీ తర్వాత డుప్లెసిస్​తో కలిసి మూడో వికెట్​కు 90 పరుగులు జోడించి విజయాన్ని సునాయాసం చేశాడు మొయిన్ అలీ. 31 బంతుల్లో 46 పరుగులు చేసి ఇతడు ఔటైన తర్వాత ఇన్నింగ్స్​ కాస్త నెమ్మదించింది. 8 పరుగులు చేస్తే విజయం వరిస్తుందనగా వరుస బంతుల్లో రైనా (8), రాయుడు (0) వికెట్లను కోల్పోయింది సీఎస్కే. కానీ చివర్లో సామ్ కరన్ ఫోర్​తో జట్టుకు విజయాన్నందించాడు.

తడబడిన పంజాబ్

టాస్ ఓడి మొదట బ్యాటింగ్​కు దిగిన పంజాబ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే మయాంక్ అగర్వాల్​(1)​ వికెట్ కోల్పోయింది. అద్భుత ఔట్​ స్వింగర్​తో ఇతడిని బోల్తా కొట్టించాడు దీపక్ చాహర్. తర్వాత కెప్టెన్ రాహుల్​ (5) రనౌట్​గా వెనుదిరిగాడు. గేల్, రాహుల్ వికెట్ల మధ్య సమన్వయ లోపంతో తడబడగా వికెట్లను నేరుగా గిరాటేసి అద్భుత ఫీల్డింగ్​తో రాహుల్​ను పెవిలియన్ చేర్చాడు జడేజా. తర్వాత దీపక్ బౌలింగ్​లో గేల్​ (10) జడేజా అద్భుత క్యాచ్​తో వెనుదిరిగాడు. అనంతరం అదే ఓవర్లో నికోలస్​ పూరన్​ (0)ను కూడా ఔట్ చేసిన దీపక్, మరో ఓవర్లో దీపక్ హుడా (10)ను పెవిలియన్ చేర్చి సీఎస్కే శిబిరంలో ఆనందంనింపాడు.

ప్రధాన బ్యాట్స్​మెన్ ఔటైనా కూడా షారుఖ్ ఖాన్​ (47) అద్భుత బ్యాటింగ్​తో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్ని పంజాబ్ గౌరవప్రదమైన స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. చివరి ఓవర్లో భారీ షాట్​కు ప్రయత్నించి సామ్ కరన్ బౌలింగ్​లో క్యాచ్​ ఔట్​గా వెనుదిరిగాడు. ఫలితంగా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది పంజాబ్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.