మహిళల మినీ ఐపీఎల్ ఛాలెంజర్ సిరీస్ను నవంబరు 4 నుంచి 9 వరకు యూఏఈలో నిర్వహించే అవకాశముంది. మూడు జట్లతో నాలుగు మ్యాచ్ల సిరీస్ జరపాలని బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఐపీఎల్ వర్గాలు పేర్కొన్నాయి.
"ఛాలెంజర్ సిరీస్లో భాగంగా ట్రయల్బ్లేజర్స్, వెలాసిటీ, సూపర్నోవాస్ జట్ల మధ్య ఓ రౌండ్ రాబిన్ లీగ్ నిర్వహిస్తారు. ఫైనల్తో సహా మొత్తం 4 మ్యాచ్లు జరుగుతాయి. నవంబరు 9న ఫైనల్ నిర్వహిస్తాం" అని ఐపీఎల్ అధికారి తెలిపారు.