ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సారథి కోహ్లీ, డివిలియర్స్ కలిసి ఇప్పటివరకు అనేక భారీ భాగస్వామ్యాలు నెలకొల్పారు. సోమవారం కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్తో మరో మైలురాయిని అందుకున్నారు. టోర్నీ చరిత్రలోనే పదో సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసిన తొలి జోడీగా రికార్డుకెక్కారు. ఇప్పటివరకు వీరిద్దరు కలిసి మూడువేల పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు.
రెండో స్థానంలో తొమ్మిది సెంచరీల భాగస్వామ్యంతో కోహ్లీ-క్రిస్గేల్ ఉండగా.. ఆరు సెంచరీల భాగస్వామ్యంతో శిఖర్ ధావన్-డేవిడ్ వార్నర్ జోడీ మూడో స్థానంలో నిలిచారు.
షార్జా వేదికగా కోల్కతాతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు 82 పరుగులు తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు రెండు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. డివిలియర్స్ (73), కోహ్లీ(33) విధ్వంసం సృష్టించారు. 46బంతుల్లో సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అనంతరం బరిలోకి దిగిన కోల్కతా తొమ్మిది వికెట్లు కోల్పోయి 112 పరుగులకే పరిమితమైంది. బెంగళూరు బౌలర్లు సమష్టిగా సత్తాచాటారు. కోహ్లీసేనకు ఇది ఐదో విజయం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.

ఇదీ చూసింది ఏడుగురు ఫుట్బాలర్స్కు కరోనా పాజిటివ్!