ETV Bharat / sports

'నేనెప్పుడూ బెత్తం పట్టుకుని మావాళ్లను తరమలేదు'

author img

By

Published : Nov 11, 2020, 5:11 AM IST

ఐపీఎల్​ మహాసంగ్రామానికి తెరపడింది. ట్రోఫీని మరోసారి ముంబయి జట్టు కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో తమ విజయంపై హర్షం వ్యక్తం చేశాడు ముంబయి సారథి రోహిత్​ శర్మ. సీజన్​ ప్రారంభం కంటే చాలా ముందు నుంచే తాము శ్రమించామని తెలిపాడు. మరోవైపు.. వచ్చే ఏడాది తాము కప్​ను సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు దిల్లీ జట్టు కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​.

ipl 2020 winner mumbai indians skipper rohith sharma and delhi capitals captain shreyas ayyar comments
'నేనెప్పుడూ బెత్తం పట్టుకుని మావాళ్లను తరమలేదు'

ఐపీఎల్​ పదమూడో సీజన్‌ లీగ్‌ విజేతగా నిలిచింది ముంబయి ఇండియన్స్​ జట్టు. దుబాయ్‌ వేదికగా జరిగిన ఫైనల్లో దిల్లీని చిత్తు చేసి ట్రోఫీని కైవసం చేసుకుంది. మ్యాచ్​ అనంతరం మాట్లాడిన ముంబయి సారథి రోహిత్​ శర్మ.. తమ గెలుపుపై సంతోషం వ్యక్తం చేశాడు. కెప్టెన్​గా తమ ఆటగాళ్లపై ఏరోజూ ఒత్తిడి తేలేదని చెప్పాడు. వచ్చే ఏడాది మనదగ్గరే ఐపీఎల్​ జరగాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

"మా పై పెట్టిన ప్రతీ పైసాకు న్యాయం చేసేలా మొదటి బంతి దగ్గరి నుంచి శ్రమించాం. మా విజయానికి తెరవెనుక ఉన్నవాళ్లకు ఈ ఘనత దక్కతుంది. ఐపీఎల్​ ప్రారంభం కంటే ముందు నుంచే మేం కృషి చేశాం. నేను ఏరోజూ బెత్తం చేతపుచ్చుకుని మా ఆటగాళ్ల వెంట ఉండి వారిని ఆడాలని ఒత్తిడి చేయలేదు. దురదృష్టవశాత్తు ఈసారి అభిమానుల సమక్షంలో ఆడలేకపోయాం. వాంఖడే స్టేడియం​లో ఆడిన రోజులను చాలా మిస్​ అయ్యాం. వచ్చే ఏడాది అక్కడే ఐపీఎల్​ జరుగుతుందని ఆశిస్తున్నాను."

--రోహిత్​ శర్మ, ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​.

కప్​ గెలిస్తే బాగుండేది..

ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్-13​ ట్రోఫీ ఆశలను త్రుటిలో చేజార్చుకుంది దిల్లీ జట్టు. కానీ, తాము ఓడిపోయినా తమ ప్రదర్శనతో అభిమానుల మనసు గెలిచామని పేర్కొన్నాడు సారథి శ్రేయస్​ అయ్యర్​. తమ కోచ్​ రికీ పాంటింగ్​ తమలో అనునిత్యం స్ఫూర్తి నింపాడని కొనియాడాడు.

"రికీ పాంటింగ్​ మాకు ఇచ్చిన స్వేచ్ఛ అముూల్యమైనది. ఆయన మా జట్టుతో జరిపిన సమావేశాలు, చెప్పిన మాటలు మాకు చాలా ప్రోత్సాహాన్ని అందించాయి. ఈ ఐపీఎల్​ అత్యంత కఠినమైన పరిస్థితుల మధ్య జరిగింది. ఇందులో నేనూ ఓ భాగమైనందుకు సంతోషంగా ఉంది. మా జట్టు సభ్యులు మేం గర్వపడేలా ఆడారు. వారి వల్లే మేం ఫైనల్​కు చేరుకోగలిగాం. అభిమానుల మనసుల్ని గెలుచుకున్నాం. కప్​ గెలిచి ఉంటే చాలా బాగుండేది. కానీ, వచ్చే సంవత్సరం ట్రోఫీని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తాం."

--శ్రేయస్​ అయ్యర్​, దిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్​.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ముంబయి 18.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఇదీ చూడండి:ఐపీఎల్​: మురిసిన ముంబయి.. ఐదో టైటిల్ కైవసం

ఐపీఎల్​ పదమూడో సీజన్‌ లీగ్‌ విజేతగా నిలిచింది ముంబయి ఇండియన్స్​ జట్టు. దుబాయ్‌ వేదికగా జరిగిన ఫైనల్లో దిల్లీని చిత్తు చేసి ట్రోఫీని కైవసం చేసుకుంది. మ్యాచ్​ అనంతరం మాట్లాడిన ముంబయి సారథి రోహిత్​ శర్మ.. తమ గెలుపుపై సంతోషం వ్యక్తం చేశాడు. కెప్టెన్​గా తమ ఆటగాళ్లపై ఏరోజూ ఒత్తిడి తేలేదని చెప్పాడు. వచ్చే ఏడాది మనదగ్గరే ఐపీఎల్​ జరగాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

"మా పై పెట్టిన ప్రతీ పైసాకు న్యాయం చేసేలా మొదటి బంతి దగ్గరి నుంచి శ్రమించాం. మా విజయానికి తెరవెనుక ఉన్నవాళ్లకు ఈ ఘనత దక్కతుంది. ఐపీఎల్​ ప్రారంభం కంటే ముందు నుంచే మేం కృషి చేశాం. నేను ఏరోజూ బెత్తం చేతపుచ్చుకుని మా ఆటగాళ్ల వెంట ఉండి వారిని ఆడాలని ఒత్తిడి చేయలేదు. దురదృష్టవశాత్తు ఈసారి అభిమానుల సమక్షంలో ఆడలేకపోయాం. వాంఖడే స్టేడియం​లో ఆడిన రోజులను చాలా మిస్​ అయ్యాం. వచ్చే ఏడాది అక్కడే ఐపీఎల్​ జరుగుతుందని ఆశిస్తున్నాను."

--రోహిత్​ శర్మ, ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​.

కప్​ గెలిస్తే బాగుండేది..

ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్-13​ ట్రోఫీ ఆశలను త్రుటిలో చేజార్చుకుంది దిల్లీ జట్టు. కానీ, తాము ఓడిపోయినా తమ ప్రదర్శనతో అభిమానుల మనసు గెలిచామని పేర్కొన్నాడు సారథి శ్రేయస్​ అయ్యర్​. తమ కోచ్​ రికీ పాంటింగ్​ తమలో అనునిత్యం స్ఫూర్తి నింపాడని కొనియాడాడు.

"రికీ పాంటింగ్​ మాకు ఇచ్చిన స్వేచ్ఛ అముూల్యమైనది. ఆయన మా జట్టుతో జరిపిన సమావేశాలు, చెప్పిన మాటలు మాకు చాలా ప్రోత్సాహాన్ని అందించాయి. ఈ ఐపీఎల్​ అత్యంత కఠినమైన పరిస్థితుల మధ్య జరిగింది. ఇందులో నేనూ ఓ భాగమైనందుకు సంతోషంగా ఉంది. మా జట్టు సభ్యులు మేం గర్వపడేలా ఆడారు. వారి వల్లే మేం ఫైనల్​కు చేరుకోగలిగాం. అభిమానుల మనసుల్ని గెలుచుకున్నాం. కప్​ గెలిచి ఉంటే చాలా బాగుండేది. కానీ, వచ్చే సంవత్సరం ట్రోఫీని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తాం."

--శ్రేయస్​ అయ్యర్​, దిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్​.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ముంబయి 18.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఇదీ చూడండి:ఐపీఎల్​: మురిసిన ముంబయి.. ఐదో టైటిల్ కైవసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.