ETV Bharat / sports

దిల్లీకి మరో షాక్​.. టోర్నీ నుంచి ఇషాంత్​ ఔట్​

author img

By

Published : Oct 12, 2020, 9:37 PM IST

ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. గాయం కారణంగా ఇప్పటికే అమిత్​ మిశ్రా టోర్నీ నుంచి నిష్క్రమించగా.. తాజాగా పేసర్​ ఇషాంత్ శర్మ వైదొలిగాడు.

IPL 2020: Ishant Sharma Ruled Out Of IPL Due To Rib Injury
దిల్లీకి మరో షాక్​.. టోర్నీ నుంచి వైదొలగిన ఇషాంత్​

ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఇటీవలే స్పిన్నర్​ అమిత్​ మిశ్రా టోర్నీ నుంచి తప్పుకోగా.. తాజాగా అదే జట్టుకు చెందిన పేసర్​ ఇషాంత్​ శర్మ నిష్క్రమిస్తున్నట్లు ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుత సీజన్​లో ఇప్పటివరకు ఒక మ్యాచ్​ ఆడిన ఇషాంత్​.. ఈ నెల 7న ప్రాక్టీసు సెషన్​లో గాయపడ్డాడు. ఎడమ పక్కటెముక నొప్పి కలిగిందని.. అది ఇప్పుడు తీవ్రమవ్వడం వల్ల ఇషాంత్​ ఐపీఎల్​ నుంచి వైదొలగుతున్నట్లు స్పష్టం చేశారు.

మరోవైపు దిల్లీ క్యాపిటల్స్​ జట్టు వికెట్​ కీపర్​ రిషబ్​ పంత్​ కూడా గాయపడ్డాడు. దీని వల్ల వారం కంటే ఎక్కువ రోజుల పాటు జట్టు మ్యాచ్​లు ఆడకుండా విశ్రాంతి తీసుకోనున్నట్లు సమాచారం. పంత్​ స్థానంలో అలెక్స్​ కారీ వికెట్​ కీపర్​గా వ్యవహరించనున్నాడు.

ఐపీఎల్​లో వరుస విజయాలతో దిల్లీ జట్టు దూసుకుపోతోంది. ఏడు మ్యాచులాడి ఐదు గెలిచి 10 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం రెండో స్థానంలో నిలిచింది. మరో మూడు మ్యాచులు గెలిస్తే 16 పాయింట్లతో ఆ జట్టు ప్లేఆఫ్ బెర్త్‌ ఖాయం చేసుకుంటుంది.

ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఇటీవలే స్పిన్నర్​ అమిత్​ మిశ్రా టోర్నీ నుంచి తప్పుకోగా.. తాజాగా అదే జట్టుకు చెందిన పేసర్​ ఇషాంత్​ శర్మ నిష్క్రమిస్తున్నట్లు ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుత సీజన్​లో ఇప్పటివరకు ఒక మ్యాచ్​ ఆడిన ఇషాంత్​.. ఈ నెల 7న ప్రాక్టీసు సెషన్​లో గాయపడ్డాడు. ఎడమ పక్కటెముక నొప్పి కలిగిందని.. అది ఇప్పుడు తీవ్రమవ్వడం వల్ల ఇషాంత్​ ఐపీఎల్​ నుంచి వైదొలగుతున్నట్లు స్పష్టం చేశారు.

మరోవైపు దిల్లీ క్యాపిటల్స్​ జట్టు వికెట్​ కీపర్​ రిషబ్​ పంత్​ కూడా గాయపడ్డాడు. దీని వల్ల వారం కంటే ఎక్కువ రోజుల పాటు జట్టు మ్యాచ్​లు ఆడకుండా విశ్రాంతి తీసుకోనున్నట్లు సమాచారం. పంత్​ స్థానంలో అలెక్స్​ కారీ వికెట్​ కీపర్​గా వ్యవహరించనున్నాడు.

ఐపీఎల్​లో వరుస విజయాలతో దిల్లీ జట్టు దూసుకుపోతోంది. ఏడు మ్యాచులాడి ఐదు గెలిచి 10 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం రెండో స్థానంలో నిలిచింది. మరో మూడు మ్యాచులు గెలిస్తే 16 పాయింట్లతో ఆ జట్టు ప్లేఆఫ్ బెర్త్‌ ఖాయం చేసుకుంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.