ETV Bharat / sports

ఐపీఎల్​లో​ బుకీ కలకలం.. దర్యాప్తు వేగవంతం

author img

By

Published : Oct 3, 2020, 9:27 PM IST

ఈ ఐపీఎల్​లో ఓ బుకీ ఆన్​లైన్​ ద్వారా ఓ ఆటగాడిని సంప్రదించినట్లు బీసీసీఐ అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు అతడిని పట్టుకునే పనిలో పడ్డారు.

IPL 13
ఐపీఎల్

ఐపీఎల్​లో బుకీల కలకలం రేగింది. ఆన్​లైన్​ ద్వారా ఓ ఆటగాడిని బుకీ సంప్రదించినట్లు బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ చీఫ్​ అజిత్​ సింగ్​ స్పష్టం చేశారు. దీనిపై దర్యాప్తు వేగవంతం చేసినట్లు తెలిపారు. అవినీతి జరగకుండా నిఘా మరింత పెంచినట్లు వెల్లడించారు.

"ఓ బుకీ తనను సంప్రదించినట్లు ఓ ఆటగాడు మాకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం అతడిని ట్రాక్ చేస్తున్నాం. పట్టుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. నిఘాను మరింత పటిష్ఠం చేశాం."

-అజిత్​ సింగ్​, బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ చీఫ్

ప్రొటోకాల్స్​ ప్రకారం సదరు ఆటగాడి వివరాలు బయటకు రాలేదు. ఐపీఎల్​ 13వ సీజన్ కరోనా కారణంగా పటిష్ఠమైన భద్రత కూడిన బయోసెక్యూర్​ వాతావరణంలో జరుగుతోంది.

ఇదీ చూడండి కోహ్లీ-పడిక్కల్ ధమాకా.. రాజస్థాన్​పై బెంగళూరు గెలుపు

ఐపీఎల్​లో బుకీల కలకలం రేగింది. ఆన్​లైన్​ ద్వారా ఓ ఆటగాడిని బుకీ సంప్రదించినట్లు బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ చీఫ్​ అజిత్​ సింగ్​ స్పష్టం చేశారు. దీనిపై దర్యాప్తు వేగవంతం చేసినట్లు తెలిపారు. అవినీతి జరగకుండా నిఘా మరింత పెంచినట్లు వెల్లడించారు.

"ఓ బుకీ తనను సంప్రదించినట్లు ఓ ఆటగాడు మాకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం అతడిని ట్రాక్ చేస్తున్నాం. పట్టుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. నిఘాను మరింత పటిష్ఠం చేశాం."

-అజిత్​ సింగ్​, బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ చీఫ్

ప్రొటోకాల్స్​ ప్రకారం సదరు ఆటగాడి వివరాలు బయటకు రాలేదు. ఐపీఎల్​ 13వ సీజన్ కరోనా కారణంగా పటిష్ఠమైన భద్రత కూడిన బయోసెక్యూర్​ వాతావరణంలో జరుగుతోంది.

ఇదీ చూడండి కోహ్లీ-పడిక్కల్ ధమాకా.. రాజస్థాన్​పై బెంగళూరు గెలుపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.