ETV Bharat / sports

అహ్మదాబాద్​లో కివీస్​తో భారత్​ పోరుకు వాతావరణం అనుకూలిస్తుందా ?

author img

By

Published : Feb 1, 2023, 11:10 AM IST

Updated : Feb 1, 2023, 11:39 AM IST

న్యూజిలాండ్-భారత్ మధ్య మూడో టీ20 బుధవారం జరగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే అహ్మదబాద్​కు చేరుకున్న ఇరు జట్లు మైదానంలో పోరుకు సిద్ధమయ్యాయి. అయితే అక్కడి వాతావరణం మ్యాచ్​కు అనుకూలిస్తుందా లేదా అన్న అనుమానం అభిమానుల్లో తలెత్తింది.

india vs newzealand 3rd t20i
india vs newzealand 3rd t20i

న్యూజిలాండ్‌తో జరగనున్న మూడో టీ20 కోసం భారత్ సంసిద్ధమయ్యింది. అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమంగా ఉండటంతో ఈ గేమ్‌పై మరింత ఉత్కంఠ పెరిగింది. తొలి మ్యాచ్‌లో ఓడిన టీమ్​ ఇండియా రెండో టీ20లో జోరందుకుని మ్యాచ్​ కైవసంచే సుకుంది. దీంతో ఈ మ్యాచ్​ గెలుపు రెండు టీమ్​లకు కీలకం కానుంది.

అయితే ఈ మ్యాచ్​కు వాతావరణం అనుకూలంగా ఉంటుందా లేదా అన్న అనుమానం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. కాగా బుధవారం ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు వాతావరణం అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాలిలో ఉండాల్సిన తేమ శాతం కూడా 35 నుంచి 45 శాతంగా ఉన్నట్లు సమాచారం. దీంతో వాన పడే అవకాశాలు చాలా తక్కువ. మరో వైపు మ్యచ్​ వేదికైన నరేంద్రమోదీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇప్పటి వరకు దాదాపు ఆరు మ్యాచ్‌లు జరగ్గా అందులో టీమ్​ ఇండియా నాలుగు మ్యాచ్​లు గెలిచింది. కివీస్​ రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గింది. దీంతో ఇక గెలుపు టీమ్​ ఇండియాదే అంటూ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

న్యూజిలాండ్‌తో జరగనున్న మూడో టీ20 కోసం భారత్ సంసిద్ధమయ్యింది. అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమంగా ఉండటంతో ఈ గేమ్‌పై మరింత ఉత్కంఠ పెరిగింది. తొలి మ్యాచ్‌లో ఓడిన టీమ్​ ఇండియా రెండో టీ20లో జోరందుకుని మ్యాచ్​ కైవసంచే సుకుంది. దీంతో ఈ మ్యాచ్​ గెలుపు రెండు టీమ్​లకు కీలకం కానుంది.

అయితే ఈ మ్యాచ్​కు వాతావరణం అనుకూలంగా ఉంటుందా లేదా అన్న అనుమానం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. కాగా బుధవారం ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు వాతావరణం అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాలిలో ఉండాల్సిన తేమ శాతం కూడా 35 నుంచి 45 శాతంగా ఉన్నట్లు సమాచారం. దీంతో వాన పడే అవకాశాలు చాలా తక్కువ. మరో వైపు మ్యచ్​ వేదికైన నరేంద్రమోదీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇప్పటి వరకు దాదాపు ఆరు మ్యాచ్‌లు జరగ్గా అందులో టీమ్​ ఇండియా నాలుగు మ్యాచ్​లు గెలిచింది. కివీస్​ రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గింది. దీంతో ఇక గెలుపు టీమ్​ ఇండియాదే అంటూ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Last Updated : Feb 1, 2023, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.