ETV Bharat / sports

చెలరేగిన ఇంగ్లాండ్​ బౌలర్లు.. లంచ్​కు భారత్​ 346/7

author img

By

Published : Aug 13, 2021, 5:40 PM IST

ఇంగ్లాండ్​తో రెండో టెస్టులో టీమ్​ ఇండియా భోజన విరామానికి 7 వికెట్లు కోల్పోయి 346 పరుగులు చేసింది. రాహుల్​ 129 పరుగులు చేసి పెవిలియన్​ చేరాడు. ఇంగ్లాండ్​ బౌలర్లలో అండర్సన్​ 3 వికెట్లు తీశాడు.

INDIA VS ENGLAND 2ND TEST
ఇండియా, ఇంగ్లాండ్​ రెండో టెస్టు, చెలరేగిన ఇంగ్లాండ్​ బౌలర్లు

లార్డ్స్​ టెస్టు రెండో రోజు తొలి సెషన్​లోనే భారత్​ 4 వికెట్లు కోల్పోయింది. లంచ్​ బ్రేక్​ సమయానికి 7 వికెట్లు కోల్పోయి 346 పరుగులు చేసింది టీమ్​ ఇండియా.

రెండో రోజు వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది కోహ్లీసేన. తొలి ఓవర్లోనే రాబిన్సన్​ వేసిన రెండో బంతికి సిబ్లే చేతికి చిక్కాడు సెంచరీ హీరో రాహుల్​(129). మరుసటి ఓవర్​ తొలి బంతికి.. అండర్సన్​ బౌలింగ్​లో క్యాచ్​ ఔట్​గా వెనుదిరిగాడు రహానె(1).

INDIA VS ENGLAND 2ND TEST
129 పరుగులు చేసి వెనుదిరిగిన కేఎల్​ రాహుల్​
INDIA VS ENGLAND 2ND TEST
వికెట్​ తీసిన ఆనందంలో రాబిన్సన్​

ఆ తర్వాత పంత్​ దూకుడు పెంచాడు. బౌలర్లను గౌరవిస్తూనే.. చెత్త బంతుల్ని బౌండరీలకు తరలించాడు. 37 పరుగులు చేసిన తర్వాత.. మార్క్​ వుడ్​ బౌలింగ్​లో కీపర్​కు క్యాచ్​ ఇచ్చి అవుటయ్యాడు.

INDIA VS ENGLAND 2ND TEST
పంత్​-జడేజా
INDIA VS ENGLAND 2ND TEST
కీపర్​కు క్యాచ్​ ఇచ్చి అవుటైన రిషభ్​ పంత్​

ప్రస్తుతం జడేజా(31), ఇషాంత్​ శర్మ (0) క్రీజులో ఉన్నారు.

INDIA VS ENGLAND 2ND TEST
రవీంద్ర జడేజా

ఇంగ్లాండ్​ బౌలర్లలో అండర్సన్​ 3, రాబిన్సన్​ 2 వికెట్లు, వుడ్​, మొయిన్​ అలీ ఒక్కో వికెట్​ చొప్పున పడగొట్టారు. ​

INDIA VS ENGLAND 2ND TEST
ఇంగ్లాండ్​ ఆటగాళ్లు

ఇదీ చూడండి: Vinesh Phogat: 'ఇంకా ఓటమి బాధలోనే.. ఇక రెజ్లింగ్ కష్టమే'

లార్డ్స్​ టెస్టు రెండో రోజు తొలి సెషన్​లోనే భారత్​ 4 వికెట్లు కోల్పోయింది. లంచ్​ బ్రేక్​ సమయానికి 7 వికెట్లు కోల్పోయి 346 పరుగులు చేసింది టీమ్​ ఇండియా.

రెండో రోజు వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది కోహ్లీసేన. తొలి ఓవర్లోనే రాబిన్సన్​ వేసిన రెండో బంతికి సిబ్లే చేతికి చిక్కాడు సెంచరీ హీరో రాహుల్​(129). మరుసటి ఓవర్​ తొలి బంతికి.. అండర్సన్​ బౌలింగ్​లో క్యాచ్​ ఔట్​గా వెనుదిరిగాడు రహానె(1).

INDIA VS ENGLAND 2ND TEST
129 పరుగులు చేసి వెనుదిరిగిన కేఎల్​ రాహుల్​
INDIA VS ENGLAND 2ND TEST
వికెట్​ తీసిన ఆనందంలో రాబిన్సన్​

ఆ తర్వాత పంత్​ దూకుడు పెంచాడు. బౌలర్లను గౌరవిస్తూనే.. చెత్త బంతుల్ని బౌండరీలకు తరలించాడు. 37 పరుగులు చేసిన తర్వాత.. మార్క్​ వుడ్​ బౌలింగ్​లో కీపర్​కు క్యాచ్​ ఇచ్చి అవుటయ్యాడు.

INDIA VS ENGLAND 2ND TEST
పంత్​-జడేజా
INDIA VS ENGLAND 2ND TEST
కీపర్​కు క్యాచ్​ ఇచ్చి అవుటైన రిషభ్​ పంత్​

ప్రస్తుతం జడేజా(31), ఇషాంత్​ శర్మ (0) క్రీజులో ఉన్నారు.

INDIA VS ENGLAND 2ND TEST
రవీంద్ర జడేజా

ఇంగ్లాండ్​ బౌలర్లలో అండర్సన్​ 3, రాబిన్సన్​ 2 వికెట్లు, వుడ్​, మొయిన్​ అలీ ఒక్కో వికెట్​ చొప్పున పడగొట్టారు. ​

INDIA VS ENGLAND 2ND TEST
ఇంగ్లాండ్​ ఆటగాళ్లు

ఇదీ చూడండి: Vinesh Phogat: 'ఇంకా ఓటమి బాధలోనే.. ఇక రెజ్లింగ్ కష్టమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.