ETV Bharat / sports

ఆసీస్ కెప్టెన్​ పైన్​ 'రనౌట్'​పై రచ్చ రచ్చ!

author img

By

Published : Dec 26, 2020, 4:38 PM IST

బాక్సింగ్​ డే టెస్టులో ఆసీస్ కెప్టెన్​ రనౌట్​ నుంచి తప్పించుకోవడం వివాదాస్పదంగా మారింది. పైన్​ ఔట్ అయ్యాడని మాజీ క్రికెటర్లతో పాటు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

IND VS AUS 2ND TEST: Controversy erupts over Paine's run-out decision
'టిమ్​ పైన్​ రనౌట్​ అయ్యాడు!'

మెల్​బోర్న్​లో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్​ టిమ్ ​పైన్​ 'రనౌట్​' విషయమై షేన్​ వార్న్​ సహ పలువురు మాజీలు తప్పుపడుతున్నారు. తొలిరోజు ఆటలో​ క్రీజులైన్​పై పైన్​ బ్యాట్​ పెట్టడం, భారత కీపర్ పంత్​ వికెట్లను గ్లౌజ్​తో తాకడం దాదాపు ఒకేసారి జరిగాయి. బ్యాట్​ క్రీజులైన్​ లోపల ఉందని భావించిన థర్డ్​ అంపైర్ పైన్​​ నాటౌట్​ అని ప్రకటించాడు. అయితే ఈ నిర్ణయంతో షాకయ్యానని ఆసీస్​ దిగ్గజ స్పిన్నర్ షేన్​ వార్న్ చెప్పాడు.

"సమీక్షలో టిమ్​ పైన్​ను రనౌట్​గా ప్రకటించకపోవడం ఆశ్చర్యకరం. నేను చాలా క్షుణ్ణంగా పరిశీలించాను. క్రీజ్​ లైన్​ను బ్యాట్​ దాటలేదనే అనుకుంటున్నా. నా ఉద్దేశంలో అతడు ఔట్​"

-- షేన్ వార్న్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు

పైన్​ను ఔట్​ ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు భారత మాజీ ఆటగాడు, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.

"అది ఔట్. జేసన్​ హోల్డర్​ చెప్పింది నిజమే. బయటి వ్యక్తులతో కలవకుండా ఆటగాళ్లు ఎలాగైతే బయో బబుల్​లో ఉంటున్నారో.. అంపైర్లు కూడా అలానే ఉండాలి"

--ఆకాశ్ చోప్రా, వ్యాఖ్యాత

అంపైర్​ నిర్ణయం తర్వాత స్క్వేర్​ లెగ్​ అంపైర్​తో మాట్లాడాడు భారత సారథి రహానె. రనౌట్​ నుంచి తప్పించుకున్నప్పటికీ, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు పైన్. కొద్దిసేపటికే​ అశ్విన్ అతడిని పెవిలియన్​కు పంపించాడు. తొలిరోజు భారత బౌలర్ల కట్టుదిట్ట బౌలింగ్​తో ఆసీస్​ 195 పరుగులకే పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 36/1తో నిలిచింది. క్రీజులో పుజారా, గిల్ ఉన్నారు.

ఇదీ చూడండి: కోహ్లీ, రోహిత్​ శర్మను అధిగమించిన బుమ్రా

మెల్​బోర్న్​లో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్​ టిమ్ ​పైన్​ 'రనౌట్​' విషయమై షేన్​ వార్న్​ సహ పలువురు మాజీలు తప్పుపడుతున్నారు. తొలిరోజు ఆటలో​ క్రీజులైన్​పై పైన్​ బ్యాట్​ పెట్టడం, భారత కీపర్ పంత్​ వికెట్లను గ్లౌజ్​తో తాకడం దాదాపు ఒకేసారి జరిగాయి. బ్యాట్​ క్రీజులైన్​ లోపల ఉందని భావించిన థర్డ్​ అంపైర్ పైన్​​ నాటౌట్​ అని ప్రకటించాడు. అయితే ఈ నిర్ణయంతో షాకయ్యానని ఆసీస్​ దిగ్గజ స్పిన్నర్ షేన్​ వార్న్ చెప్పాడు.

"సమీక్షలో టిమ్​ పైన్​ను రనౌట్​గా ప్రకటించకపోవడం ఆశ్చర్యకరం. నేను చాలా క్షుణ్ణంగా పరిశీలించాను. క్రీజ్​ లైన్​ను బ్యాట్​ దాటలేదనే అనుకుంటున్నా. నా ఉద్దేశంలో అతడు ఔట్​"

-- షేన్ వార్న్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు

పైన్​ను ఔట్​ ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు భారత మాజీ ఆటగాడు, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.

"అది ఔట్. జేసన్​ హోల్డర్​ చెప్పింది నిజమే. బయటి వ్యక్తులతో కలవకుండా ఆటగాళ్లు ఎలాగైతే బయో బబుల్​లో ఉంటున్నారో.. అంపైర్లు కూడా అలానే ఉండాలి"

--ఆకాశ్ చోప్రా, వ్యాఖ్యాత

అంపైర్​ నిర్ణయం తర్వాత స్క్వేర్​ లెగ్​ అంపైర్​తో మాట్లాడాడు భారత సారథి రహానె. రనౌట్​ నుంచి తప్పించుకున్నప్పటికీ, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు పైన్. కొద్దిసేపటికే​ అశ్విన్ అతడిని పెవిలియన్​కు పంపించాడు. తొలిరోజు భారత బౌలర్ల కట్టుదిట్ట బౌలింగ్​తో ఆసీస్​ 195 పరుగులకే పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 36/1తో నిలిచింది. క్రీజులో పుజారా, గిల్ ఉన్నారు.

ఇదీ చూడండి: కోహ్లీ, రోహిత్​ శర్మను అధిగమించిన బుమ్రా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.