ఐపీఎల్-12వ సీజన్ను ఓటమితో ఆరంభించింది ముంబయి ఇండియన్స్. దిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 37 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఏ దశలోనూ విజయం దిశగా పయనించలేదు. ఒకానొక దశలో యువీ ఆశలు రేకెత్తించినా.. జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. దిల్లీ బౌలర్లు ఇశాంత్ శర్మ, రబాడాలు చెరో రెండు వికెట్లు తీశారు.
టాప్ ఆర్డర్ విఫలం
ముంబయి టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. రోహిత్ శర్మ(14) త్వరగా ఔటయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ 2 పరుగులే చేశాడు. 37/2 స్కోరు వద్దక్రీజులోకి అడుగుపెట్టిన యువీ.. తన వంతు పోరాటం చేశాడు. 35 బంతుల్లో 53 పరుగులు చేసి ఆఖర్లో ఔటయ్యాడు. కృనాల్ 32, పోలార్డ్ 21 పరుగులతో కొంత మేర ఆకట్టుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా రిషబ్పంత్ ఎంపికయ్యాడు.
పంత్ పరుగుల వరద...
![CRICKET](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/pant_2403newsroom_00606_682.jpg)
తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్లకు 213 పరుగులు చేసింది. యువ ఆటగాడు రిషబ్పంత్ ముంబయి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తనదైన శైలిలో రెచ్చిపోయిన ఈ హిట్టర్ 27 బంతుల్లో (ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లు) 78 పరుగులు చేశాడు. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడం విశేషం. శిఖర్ ధావన్ 43, కొలిన్ ఇన్గ్రామ్ 47 పరుగులతో రాణించారు. వీరిద్దరూ 83 పరుగులు జత చేయడంతో ఢిల్లీ గాడిలో పడింది.
బుమ్రా విఫలం...
పంత్ విజృంభణకు ముంబయి బౌలర్లు ఒక్కొక్కరు 10 రన్రేట్తో పరుగులు సమర్పించుకున్నారు. పంత్ ధాటికి ఆతిథ్య జట్టులోని బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. బుమ్రా ఓవర్లో కళ్లు చెదిరే సిక్సులతో పంత్ రెచ్చిపోయాడు. మెక్లెనగన్మూడు వికెట్లు సాధించగా, బుమ్రా, హార్దిక్ , బెన్ కట్టింగ్లు తలో వికెట్ తీశారు.