ETV Bharat / sports

'టీ-20 సిరీస్​కు ముందు గెలుపు ఉత్సాహాన్నిచ్చింది'

author img

By

Published : Dec 2, 2020, 7:30 PM IST

Updated : Dec 2, 2020, 8:41 PM IST

టీమ్​ఇండియాలో ఆటగాళ్ల మార్పు కొత్త ఉత్సాహాన్నిచ్చిందని కెప్టెన్​ విరాట్​ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. పిచ్​ అనుకూలంగా ఉండటం వల్ల బౌలింగ్​లో రాణించి ఆస్ట్రేలియాపై గెలుపొందామని తెలిపాడు. సిరీస్​ చేజారినా చివరి వన్డేలో గెలుపు.. టీ20 సిరీస్​కు ముందు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని మ్యాచ్​ అనంతరం అన్నాడు.

Virat Kohli Comments
'జట్టులో మార్పు.. చివరి వన్డే గెలుపు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి'

ఆస్ట్రేలియాతో చివరి వన్డేలో​ గెలుపొందడం సహా జట్టులో చేసిన మార్పులు తమకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టాయని టీమ్​ఇండియా కెప్టెన్​ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. సిరీస్​ చేజారినా ఆఖరి మ్యాచ్​లో విజయం సాధించడం పట్ల విరాట్​ హర్షం వ్యక్తం చేశాడు.

"మ్యాచ్​ ముగిసేంత వరకు కాస్త ఒత్తిడిని ఎదుర్కొన్నాం. శుభమన్​ గిల్, ఇతర ఆటగాళ్ల రాకతో జట్టుకు కొత్తదనం వచ్చింది. జట్టులో ఇలాంటి కొత్తదనం అవసరం. బౌలింగ్​ వేయడానికి పిచ్​ అనుకూలంగా ఉంది. సిడ్నీ గ్రౌండ్స్​తో పోలిస్తే కాన్​బెర్రా మైదానం ఎంతో ఉత్తమం. బౌలింగ్​, ఫీల్డింగ్​ మెరుగ్గా చేయడం వల్లే ఈ మ్యాచ్​లో గెలిచాం. పాండ్య, జడేజా బ్యాటింగ్​ తీరు హర్షనీయం".

- విరాట్ కోహ్లీ, భారత జట్టు సారథి.

Virat Kohli Comments
చివరి వన్డేలో గెలిచిన భారత్

'మేం బాగానే పోరాడాం'

తమ జట్టు ఉత్తమంగానే రాణించిందని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్​ ఫించ్​ అభిప్రాయపడ్డాడు.

"మేం బాగానే ఆడామని అనుకుంటున్నా. బౌలింగ్, బ్యాటింగ్​లో కామెరూన్ గ్రీన్​ ఉత్తమంగా రాణించాడు. హార్దిక్​, జడేజా భాగస్వామ్యం అద్భుతం. వీరిద్దరిలో ఒక్కరిని పెవిలియన్​కు చేర్చినా ఈ మ్యాచ్​ మేమే గెలిచేవాళ్లం. అగర్​ బౌలింగ్​ చక్కగా చేశాడు. టాప్​ ఆర్డర్​ బ్యాట్స్​మెన్​ కూడా బాగా ఆడారు".

-ఆరోన్ ఫించ్, ఆస్ట్రేలియా కెప్టెన్.

Virat Kohli Comments
ఫించ్​ వికెట్​ తీసిన ఆనందంలో జడేజా

చివరి వన్డే మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఛేదనలో ఆసీస్ దీటుగా ఆడినప్పటికీ వరుసగా వికెట్లు కోల్పోవడం వల్ల 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఇదీ చదవండి:వరుసగా ఎనిమిదో ఏడాది రోహిత్.. తొలిసారి కోహ్లీ!

ఆస్ట్రేలియాతో చివరి వన్డేలో​ గెలుపొందడం సహా జట్టులో చేసిన మార్పులు తమకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టాయని టీమ్​ఇండియా కెప్టెన్​ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. సిరీస్​ చేజారినా ఆఖరి మ్యాచ్​లో విజయం సాధించడం పట్ల విరాట్​ హర్షం వ్యక్తం చేశాడు.

"మ్యాచ్​ ముగిసేంత వరకు కాస్త ఒత్తిడిని ఎదుర్కొన్నాం. శుభమన్​ గిల్, ఇతర ఆటగాళ్ల రాకతో జట్టుకు కొత్తదనం వచ్చింది. జట్టులో ఇలాంటి కొత్తదనం అవసరం. బౌలింగ్​ వేయడానికి పిచ్​ అనుకూలంగా ఉంది. సిడ్నీ గ్రౌండ్స్​తో పోలిస్తే కాన్​బెర్రా మైదానం ఎంతో ఉత్తమం. బౌలింగ్​, ఫీల్డింగ్​ మెరుగ్గా చేయడం వల్లే ఈ మ్యాచ్​లో గెలిచాం. పాండ్య, జడేజా బ్యాటింగ్​ తీరు హర్షనీయం".

- విరాట్ కోహ్లీ, భారత జట్టు సారథి.

Virat Kohli Comments
చివరి వన్డేలో గెలిచిన భారత్

'మేం బాగానే పోరాడాం'

తమ జట్టు ఉత్తమంగానే రాణించిందని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్​ ఫించ్​ అభిప్రాయపడ్డాడు.

"మేం బాగానే ఆడామని అనుకుంటున్నా. బౌలింగ్, బ్యాటింగ్​లో కామెరూన్ గ్రీన్​ ఉత్తమంగా రాణించాడు. హార్దిక్​, జడేజా భాగస్వామ్యం అద్భుతం. వీరిద్దరిలో ఒక్కరిని పెవిలియన్​కు చేర్చినా ఈ మ్యాచ్​ మేమే గెలిచేవాళ్లం. అగర్​ బౌలింగ్​ చక్కగా చేశాడు. టాప్​ ఆర్డర్​ బ్యాట్స్​మెన్​ కూడా బాగా ఆడారు".

-ఆరోన్ ఫించ్, ఆస్ట్రేలియా కెప్టెన్.

Virat Kohli Comments
ఫించ్​ వికెట్​ తీసిన ఆనందంలో జడేజా

చివరి వన్డే మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఛేదనలో ఆసీస్ దీటుగా ఆడినప్పటికీ వరుసగా వికెట్లు కోల్పోవడం వల్ల 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఇదీ చదవండి:వరుసగా ఎనిమిదో ఏడాది రోహిత్.. తొలిసారి కోహ్లీ!

Last Updated : Dec 2, 2020, 8:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.