ETV Bharat / sports

IND VS WI: విండీస్​పై టీమ్​ఇండియా విక్టరీ.. సిరీస్​ క్లీన్​స్వీప్​

author img

By

Published : Feb 11, 2022, 8:46 PM IST

Updated : Feb 11, 2022, 9:04 PM IST

IND VS WI third ODI: వెస్టిండీస్​తో జరిగిన మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్​ను క్లీన్​స్వీప్​ చేసింది టీమ్​ఇండియా. నేడు(శుక్రవారం) జరిగిన మూడో వన్డేలోనూ(చివరిది) 96పరుగులు తేడాతో గెలిచి 3-0తేడాతో సిరీస్​ కైవసం చేసుకుంది.

IND VS WI third ODI teamindia cleansweep the series
విండీస్​పై టీమ్​ఇండియా విక్టరీ

IND VS WI third ODI: అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియం​​ వేదికగా వెస్టిండీస్​తో జరిగిన మూడో వన్డేలోనూ టీమ్​ఇండియా విజయం సాధించింది టీమ్​ఇండియా. 96పరుగులు తేడాతో గెలుపొందింది. ఫలితంగా 3-0తేడాతో మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్​ను కైవసం చేసుకుంది. జట్టు సమిష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది.

266 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన విండీస్​ను టీమ్​ఇండియా బౌలర్ల చెమటలు పట్టించారు. వారిని ఏ దశలోనూ కోలుకోనివ్వకుండా చేశారు. దీంతో ప్రత్యర్థి జట్టు 37.1 ఓవర్లలో 169 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్​ అయింది. ఓపెనర్లు షాయ్​ హోప్​(5)- బ్రాండన్​ కింగ్​(14), డారెన్​ బ్రావో(19), షామార్హ్​ బ్రూక్స్​(0) తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. ఆ తర్వాత వచ్చిన నికోలస్​ పూరన్​(34) పర్వాలేదనిపించాడు. ​చివర్లో వచ్చిన ఒడియన్​ స్మిత్​(36), అల్జారీ జోసెఫ్​(29), హేడెన్​ వాష్​(13) కాసేపు మన బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. టీమ్​ఇండియా బౌలర్లలో మహ్మద్​ సిరాజ్​ 3, ప్రసిద్ధ కృష్ణ 3, కుల్దీప్​ యాదవ్​ 2, దీపక్​ చాహర్​ 2 వికెట్లను దక్కించుకున్నారు.

అంతకుముందు టాస్​ గెలిచి బ్యాటింగ్​కు దిగిన టీమ్​ఇండియా బ్యాటర్లు బాగా ఆడారు. అయితే మన జట్టుకు ఆదిలోనే షాక్​ తగిలింది. అల్​జెరీ జోసెఫ్​ వేసిన నాలుగో ఓవర్​ మూడో బంతికి ఓపెనర్​, కెప్టెన్​ రోహిత్​శర్మ(13) బౌల్డ్​ అవ్వగా తర్వాత ఐదో బంతికి వన్​డౌన్​ బ్యాటర్​ కోహ్లీ(0) కీపర్​కు క్యాచ్​ ఇచ్చి డకౌట్​గా వెనుదిరిగాడు. దీంతో భారత్​ 4 ఓవర్లకే 16/2తో కష్టాల్లో పడింది.

ఆ తర్వాత శిఖర్​ ధావన్(10).. ఒడెన్​ స్మిత్​ వేసిన 9.3 బంతికి హోల్డర్​ చేతికి చిక్కి మూడో వికెట్​గా వెనుదిరిగాడు. అనంతరం ధాటిగా ఆడుతున్న పంత్​(56)... హేడెన్​ వాల్ష్​ వేసిన 30వ ఓవర్​ ఆఖరు బంతికి కీపర్​కు చిక్కి పెవిలియన్​ చేరాడు. అతడు నాలుగో వికెట్​కు శ్రేయస్​ అయ్యర్​తో కలిసి 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం ధనాధన్​ ఇన్నింగ్స్​ ఆడిన శ్రేయస్​ అయ్యర్​(80), దీపక్​ చాహర్​(38), సూర్యకుమార్​ యాదవ్​(6), కుల్దీప్​ యాదవ్(5)​ ఇలా వికెట్లను పోగొట్టుకున్నారు. చివర్ల వచ్చిన వాషింగ్​టన్​ సుందర్​(33) స్కోరు బోర్డును పరుగులెత్తించాడు.

రికార్డులు

  • ద్వైపాక్షిక సిరీస్‌ల్లో వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ వైట్‌వాష్‌ చేసిన భారత తొలి సారథిగా హిట్‌మ్యాన్‌ రికార్డు నెలకొల్పాడు.
  • 2017లో టీమ్‌ఇండియా కోహ్లీ సారథ్యంలో చివరిసారి శ్రీలంకపై వన్డే సిరీస్‌ వైట్‌వాష్‌ చేసింది. ఆ తర్వాత ఇతర జట్లపై ఇలాంటి అవకాశం రాలేదు.
  • వన్డే సిరీస్‌లు వైట్‌వాష్‌ చేసిన టీమ్‌ఇండియా కెప్టెన్ల జాబితాలో హిట్‌మ్యాన్‌ ఏడో సారథిగా నిలిచాడు. అంతకుముందు కపిల్‌, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌, మహ్మద్‌ అజాహరుద్దీన్‌, గౌతమ్‌ గంభీర్‌, ధోనీ, కోహ్లీల సారథ్యంలో భారత జట్టు ఆ ఘనత సాధించింది.
  • ధోనీ, కోహ్లీ సారథ్యంలో టీమ్‌ఇండియా మాత్రమే మూడేసి సార్లు ప్రత్యర్థులపై వన్డేల్లో వైట్‌వాష్‌ చేసింది.

ఇదీ చూడండి: IND VS WI: శ్రేయస్​, పంత్​ అదరహో.. విండీస్​ లక్ష్యం ఎంతంటే?

IND VS WI third ODI: అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియం​​ వేదికగా వెస్టిండీస్​తో జరిగిన మూడో వన్డేలోనూ టీమ్​ఇండియా విజయం సాధించింది టీమ్​ఇండియా. 96పరుగులు తేడాతో గెలుపొందింది. ఫలితంగా 3-0తేడాతో మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్​ను కైవసం చేసుకుంది. జట్టు సమిష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది.

266 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన విండీస్​ను టీమ్​ఇండియా బౌలర్ల చెమటలు పట్టించారు. వారిని ఏ దశలోనూ కోలుకోనివ్వకుండా చేశారు. దీంతో ప్రత్యర్థి జట్టు 37.1 ఓవర్లలో 169 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్​ అయింది. ఓపెనర్లు షాయ్​ హోప్​(5)- బ్రాండన్​ కింగ్​(14), డారెన్​ బ్రావో(19), షామార్హ్​ బ్రూక్స్​(0) తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. ఆ తర్వాత వచ్చిన నికోలస్​ పూరన్​(34) పర్వాలేదనిపించాడు. ​చివర్లో వచ్చిన ఒడియన్​ స్మిత్​(36), అల్జారీ జోసెఫ్​(29), హేడెన్​ వాష్​(13) కాసేపు మన బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. టీమ్​ఇండియా బౌలర్లలో మహ్మద్​ సిరాజ్​ 3, ప్రసిద్ధ కృష్ణ 3, కుల్దీప్​ యాదవ్​ 2, దీపక్​ చాహర్​ 2 వికెట్లను దక్కించుకున్నారు.

అంతకుముందు టాస్​ గెలిచి బ్యాటింగ్​కు దిగిన టీమ్​ఇండియా బ్యాటర్లు బాగా ఆడారు. అయితే మన జట్టుకు ఆదిలోనే షాక్​ తగిలింది. అల్​జెరీ జోసెఫ్​ వేసిన నాలుగో ఓవర్​ మూడో బంతికి ఓపెనర్​, కెప్టెన్​ రోహిత్​శర్మ(13) బౌల్డ్​ అవ్వగా తర్వాత ఐదో బంతికి వన్​డౌన్​ బ్యాటర్​ కోహ్లీ(0) కీపర్​కు క్యాచ్​ ఇచ్చి డకౌట్​గా వెనుదిరిగాడు. దీంతో భారత్​ 4 ఓవర్లకే 16/2తో కష్టాల్లో పడింది.

ఆ తర్వాత శిఖర్​ ధావన్(10).. ఒడెన్​ స్మిత్​ వేసిన 9.3 బంతికి హోల్డర్​ చేతికి చిక్కి మూడో వికెట్​గా వెనుదిరిగాడు. అనంతరం ధాటిగా ఆడుతున్న పంత్​(56)... హేడెన్​ వాల్ష్​ వేసిన 30వ ఓవర్​ ఆఖరు బంతికి కీపర్​కు చిక్కి పెవిలియన్​ చేరాడు. అతడు నాలుగో వికెట్​కు శ్రేయస్​ అయ్యర్​తో కలిసి 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం ధనాధన్​ ఇన్నింగ్స్​ ఆడిన శ్రేయస్​ అయ్యర్​(80), దీపక్​ చాహర్​(38), సూర్యకుమార్​ యాదవ్​(6), కుల్దీప్​ యాదవ్(5)​ ఇలా వికెట్లను పోగొట్టుకున్నారు. చివర్ల వచ్చిన వాషింగ్​టన్​ సుందర్​(33) స్కోరు బోర్డును పరుగులెత్తించాడు.

రికార్డులు

  • ద్వైపాక్షిక సిరీస్‌ల్లో వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ వైట్‌వాష్‌ చేసిన భారత తొలి సారథిగా హిట్‌మ్యాన్‌ రికార్డు నెలకొల్పాడు.
  • 2017లో టీమ్‌ఇండియా కోహ్లీ సారథ్యంలో చివరిసారి శ్రీలంకపై వన్డే సిరీస్‌ వైట్‌వాష్‌ చేసింది. ఆ తర్వాత ఇతర జట్లపై ఇలాంటి అవకాశం రాలేదు.
  • వన్డే సిరీస్‌లు వైట్‌వాష్‌ చేసిన టీమ్‌ఇండియా కెప్టెన్ల జాబితాలో హిట్‌మ్యాన్‌ ఏడో సారథిగా నిలిచాడు. అంతకుముందు కపిల్‌, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌, మహ్మద్‌ అజాహరుద్దీన్‌, గౌతమ్‌ గంభీర్‌, ధోనీ, కోహ్లీల సారథ్యంలో భారత జట్టు ఆ ఘనత సాధించింది.
  • ధోనీ, కోహ్లీ సారథ్యంలో టీమ్‌ఇండియా మాత్రమే మూడేసి సార్లు ప్రత్యర్థులపై వన్డేల్లో వైట్‌వాష్‌ చేసింది.

ఇదీ చూడండి: IND VS WI: శ్రేయస్​, పంత్​ అదరహో.. విండీస్​ లక్ష్యం ఎంతంటే?

Last Updated : Feb 11, 2022, 9:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.