ETV Bharat / sports

IND VS SA: ధోనీ-రైనా రికార్డు బ్రేక్​ చేసిన కోహ్లీ- ధావన్​

author img

By

Published : Jan 24, 2022, 7:07 AM IST

IND VS SA: దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో విరాట్ కోహ్లీ- శిఖర్ ధావన్ జోడీ రికార్డు నెలకొల్పింది. గతంలో ధోనీ- రైనా జోడీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్​ చేసింది.

kohli
కోహ్లీ

IND VS SA: దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ- శిఖర్ ధావన్ జోడీ మరో అరుదైన ఘనత నెలకొల్పింది. గతంలో ధోనీ- రైనా జోడీ సృష్టించిన రికార్డును అధిగమించింది.

ధావన్​- కోహ్లీ జోడీ ఇప్పటివరకు 28 సార్లు హాఫ్​ సెంచరీలు చేసింది. ధోనీ- రైనాల జోడీ 27 అర్ధశతకాలు నమోదు చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్​లో ఈ రికార్డును సృష్టించింది ధావన్- కోహ్లీ జోడీ. ఈ జాబితాలో భారత దిగ్గజాలు గంగూలీ- సచిన్​ జోడీ 55కు పైగా అర్ధశతకాల భాగస్వామ్యంతో మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ- ధావన్ జోడీ(32 అర్ధసెంచరీల భాగస్వామ్యం) ఉంది.

దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో శిఖర్ ధావన్​ 35వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 73బంతుల్లో 61 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సఫారీలు 287 పరుగులకు ఆలౌటయ్యారు. అనంతరం లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా 49.2 ఓవర్లలో 283 పరుగులకే పరిమితమైంది. విరాట్ కోహ్లీ (65), శిఖర్ ధావన్ (61), దీపక్ చాహర్ (54) అర్ధశతకాలు సాధించినా ఓటమి తప్పలేదు. దీంతో 0-3 తేడాతో భారత్ వైట్​వాష్ అయింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇది చూడండి: IND VS SA: ఉత్కంఠపోరులో భారత్‌ ఓటమి.. క్లీన్‌స్వీప్‌ చేసిన సఫారీలు

IND VS SA: దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ- శిఖర్ ధావన్ జోడీ మరో అరుదైన ఘనత నెలకొల్పింది. గతంలో ధోనీ- రైనా జోడీ సృష్టించిన రికార్డును అధిగమించింది.

ధావన్​- కోహ్లీ జోడీ ఇప్పటివరకు 28 సార్లు హాఫ్​ సెంచరీలు చేసింది. ధోనీ- రైనాల జోడీ 27 అర్ధశతకాలు నమోదు చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్​లో ఈ రికార్డును సృష్టించింది ధావన్- కోహ్లీ జోడీ. ఈ జాబితాలో భారత దిగ్గజాలు గంగూలీ- సచిన్​ జోడీ 55కు పైగా అర్ధశతకాల భాగస్వామ్యంతో మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ- ధావన్ జోడీ(32 అర్ధసెంచరీల భాగస్వామ్యం) ఉంది.

దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో శిఖర్ ధావన్​ 35వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 73బంతుల్లో 61 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సఫారీలు 287 పరుగులకు ఆలౌటయ్యారు. అనంతరం లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా 49.2 ఓవర్లలో 283 పరుగులకే పరిమితమైంది. విరాట్ కోహ్లీ (65), శిఖర్ ధావన్ (61), దీపక్ చాహర్ (54) అర్ధశతకాలు సాధించినా ఓటమి తప్పలేదు. దీంతో 0-3 తేడాతో భారత్ వైట్​వాష్ అయింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇది చూడండి: IND VS SA: ఉత్కంఠపోరులో భారత్‌ ఓటమి.. క్లీన్‌స్వీప్‌ చేసిన సఫారీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.