ETV Bharat / sports

IND vs SA Series: రోహిత్​కు టెస్టు వైస్ కెప్టెన్సీ పగ్గాలు! - భారత్-దక్షిణాఫ్రికా టూర్

IND vs SA Series: త్వరలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది టీమ్ఇండియా. ఈ పర్యటనలో టెస్టు సిరీస్​కు రోహిత్ శర్మను వైస్ కెప్టెన్​గా ఎంపిక చేయాలని భావిస్తోందట బీసీసీఐ. కొంతకాలంగా రహానే దారుణంగా విఫలమవుతుండటం వల్ల ఇతడి స్థానంలో రోహిత్​కు డిప్యూటీ హోదా ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

Rohit Sharma voice captaincy, Rohit Sharma latest news, రోహిత్ శర్మ లేటెస్ట్ న్యూస్, రోహిత్ శర్మ వైస్ కెప్టెన్సీ
Rohit Sharma
author img

By

Published : Dec 4, 2021, 10:08 AM IST

IND vs SA Series: ఇటీవలే టీమ్ఇండియా టీ20 కెప్టెన్​గా బాధ్యతలు స్వీకరించి మొదటి సిరీస్​లోనే సారథిగా ఆకట్టుకున్నాడు రోహిత్ శర్మ. ఇప్పుడు టెస్టు వైస్ కెప్టెన్​గానూ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. త్వరలో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్​లోని టెస్టు సిరీస్​కు హిట్​మ్యాన్​ను వైస్ కెప్టెన్​గా ఎంపిక చేస్తారని తెలుస్తోంది.

Rohit Sharma Captaincy: టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానే కొంతకాలంగా బ్యాటింగ్​లో దారుణంగా విఫలమవుతున్నాడు. గతేడాది మెల్​బోర్న్​లో సెంచరీ మినహా ఇప్పటివరకు చెప్పుకోదగిన ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. న్యూజిలాండ్​తో జరిగిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్​లో కలిపి కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు. గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. అయితే రహానేకు గాయమని చెప్పి బీసీసీఐ ఇతడిని గౌరవంగా తప్పించిందని అందరూ అంటున్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా పర్యటనకూ ఇతడు ఎంపికయ్యేది అనుమానంగా మారింది. దీంతో రోహిత్​కు వైస్ కెప్టెన్సీ ఇవ్వడం దాదాపు ఖాయమే.

ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తున్న దృష్ట్యా భారత్​తో సిరీస్ అనుమానంగా మారింది. కానీ బీసీసీఐ మాత్రం అక్కడికి వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేస్తోంది. కాకపోతే సిరీస్​ను ఒక వారం వాయిదా వేయాలని కోరుతోంది. న్యూజిలాండ్​తో రెండో టెస్టు ముగిశాక సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది టీమ్ఇండియా. అందుకోసం త్వరలోనే జట్టును ప్రకటించనున్నారు. టీ20 సిరీస్​కు రోహిత్ కెప్టెన్​గా చేయనుండగా, వన్డేల్లోనూ హిట్​మ్యాన్​కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని చూస్తోంది బీసీసీఐ.

ఇవీ చూడండి: గావస్కర్ చెప్పిన సలహాతో బ్యాటింగ్​ మెరుగైంది: మయాంక్

IND vs SA Series: ఇటీవలే టీమ్ఇండియా టీ20 కెప్టెన్​గా బాధ్యతలు స్వీకరించి మొదటి సిరీస్​లోనే సారథిగా ఆకట్టుకున్నాడు రోహిత్ శర్మ. ఇప్పుడు టెస్టు వైస్ కెప్టెన్​గానూ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. త్వరలో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్​లోని టెస్టు సిరీస్​కు హిట్​మ్యాన్​ను వైస్ కెప్టెన్​గా ఎంపిక చేస్తారని తెలుస్తోంది.

Rohit Sharma Captaincy: టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానే కొంతకాలంగా బ్యాటింగ్​లో దారుణంగా విఫలమవుతున్నాడు. గతేడాది మెల్​బోర్న్​లో సెంచరీ మినహా ఇప్పటివరకు చెప్పుకోదగిన ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. న్యూజిలాండ్​తో జరిగిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్​లో కలిపి కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు. గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. అయితే రహానేకు గాయమని చెప్పి బీసీసీఐ ఇతడిని గౌరవంగా తప్పించిందని అందరూ అంటున్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా పర్యటనకూ ఇతడు ఎంపికయ్యేది అనుమానంగా మారింది. దీంతో రోహిత్​కు వైస్ కెప్టెన్సీ ఇవ్వడం దాదాపు ఖాయమే.

ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తున్న దృష్ట్యా భారత్​తో సిరీస్ అనుమానంగా మారింది. కానీ బీసీసీఐ మాత్రం అక్కడికి వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేస్తోంది. కాకపోతే సిరీస్​ను ఒక వారం వాయిదా వేయాలని కోరుతోంది. న్యూజిలాండ్​తో రెండో టెస్టు ముగిశాక సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది టీమ్ఇండియా. అందుకోసం త్వరలోనే జట్టును ప్రకటించనున్నారు. టీ20 సిరీస్​కు రోహిత్ కెప్టెన్​గా చేయనుండగా, వన్డేల్లోనూ హిట్​మ్యాన్​కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని చూస్తోంది బీసీసీఐ.

ఇవీ చూడండి: గావస్కర్ చెప్పిన సలహాతో బ్యాటింగ్​ మెరుగైంది: మయాంక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.