ETV Bharat / sports

రాహుల్​కు అంపైర్ వార్నింగ్.. ఏం జరిగిందంటే?

author img

By

Published : Jan 3, 2022, 6:27 PM IST

IND vs SA 2nd Test: దక్షిణాఫ్రికాతో జరగుతున్న రెండో టెస్టులో స్టాండ్​బై కెప్టెన్ కేఎల్ రాహుల్​ను మందలించాడు ఫీల్డ్ అంపైర్ మరైస్ ఎరస్మస్. అసలేం జరిగిందంటే?

Umpire warns KL Rahul, KL Rahul latest news, రాహుల్​కు అంపైర్ వార్నింగ్, రాహుల్ లేటెస్ట్ న్యూస్
KL Rahul

IND vs SA 2nd Test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుకు గాయం కారణంగా దూరమయ్యాడు విరాట్ కోహ్లీ. దీంతో కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్​లో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అయితే రాహుల్ చేసిన ఓ పని ఫీల్డ్ అంపైర్ మరైస్ ఎరస్మస్​కు కోపం తెప్పించింది. దీంతో అతడిని మందలించాడు.

ఏం జరిగిందంటే?

ఈ మ్యాచ్​లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్​కు ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ ఐదో ఓవర్​ను రబాడ వేశాడు. అయితే ఇతడు బంతి వేసే సమయంలోనే రాహుల్ తాను సిద్ధంగా లేనంటూ క్రీజు నుంచి పక్కకు జరిగాడు. అనంతరం రబాడకు క్షమాపణ కూడా చెప్పాడు. అయితే ఆలస్యంగా యాక్షన్​ను ఆపేయడంపై రాహుల్​ను మందలించాడు అంపైర్ ఎరస్మస్. 'కాస్త తొందరగా ప్రయత్నించూ' అంటూ అతడికి సూచించాడు. మైదానంలో ప్రేక్షకులు లేకపోవడం వల్ల వారి మాటలు స్టంప్ మైక్​లో స్పష్టంగా వినిపించాయి. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది.

టీ బ్రేక్

ఇక ఈ మ్యాచ్​లో టీ బ్రేక్ సమయానికి 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది టీమ్ఇండియా. పుజారా (3), రహానే (0) దారుణంగా విఫలమయ్యారు. రాహుల్ (50) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత జాన్సెన్ బౌలింగ్​లో ఔటయ్యాడు. విహారి (20) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ప్రస్తుతం పంత్ (13), అశ్విన్ (24) క్రీజులో ఉన్నారు.

ఇవీ చూడండి: సనా మిర్.. ఆ ఘనత సాధించిన తొలి మహిళా బౌలర్​!

IND vs SA 2nd Test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుకు గాయం కారణంగా దూరమయ్యాడు విరాట్ కోహ్లీ. దీంతో కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్​లో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అయితే రాహుల్ చేసిన ఓ పని ఫీల్డ్ అంపైర్ మరైస్ ఎరస్మస్​కు కోపం తెప్పించింది. దీంతో అతడిని మందలించాడు.

ఏం జరిగిందంటే?

ఈ మ్యాచ్​లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్​కు ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ ఐదో ఓవర్​ను రబాడ వేశాడు. అయితే ఇతడు బంతి వేసే సమయంలోనే రాహుల్ తాను సిద్ధంగా లేనంటూ క్రీజు నుంచి పక్కకు జరిగాడు. అనంతరం రబాడకు క్షమాపణ కూడా చెప్పాడు. అయితే ఆలస్యంగా యాక్షన్​ను ఆపేయడంపై రాహుల్​ను మందలించాడు అంపైర్ ఎరస్మస్. 'కాస్త తొందరగా ప్రయత్నించూ' అంటూ అతడికి సూచించాడు. మైదానంలో ప్రేక్షకులు లేకపోవడం వల్ల వారి మాటలు స్టంప్ మైక్​లో స్పష్టంగా వినిపించాయి. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది.

టీ బ్రేక్

ఇక ఈ మ్యాచ్​లో టీ బ్రేక్ సమయానికి 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది టీమ్ఇండియా. పుజారా (3), రహానే (0) దారుణంగా విఫలమయ్యారు. రాహుల్ (50) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత జాన్సెన్ బౌలింగ్​లో ఔటయ్యాడు. విహారి (20) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ప్రస్తుతం పంత్ (13), అశ్విన్ (24) క్రీజులో ఉన్నారు.

ఇవీ చూడండి: సనా మిర్.. ఆ ఘనత సాధించిన తొలి మహిళా బౌలర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.