ETV Bharat / sports

WTC Final: లంచ్ విరామానికి టీమ్​ఇండియా స్కోరు 68/2 - మిల్కా సింగ్

డబ్ల్యూటీసీ ఫైనల్​ తొలి ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా లంచ్ సమయానికి 68/2తో నిలిచింది. క్రీజులో పుజారా(0), కెప్టెన్ విరాట్ కోహ్లీ(6) ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్, వాగ్నర్ తలో వికెట్ తీసుకున్నారు.

wtc final, ind vs nz
డబ్ల్యూటీసీ ఫైనల్, లంచ్ సమయానికి టీమ్ఇండియా
author img

By

Published : Jun 19, 2021, 5:14 PM IST

Updated : Jun 19, 2021, 5:33 PM IST

ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు​ ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో టీమ్​ఇండియా తొలి సెషన్​ ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 68 పరుగులతో నిలిచింది. క్రీజులో ఛెతేశ్వర్ పుజారా(0), విరాట్ కోహ్లీ(6) ఉన్నారు. కివీస్ బౌలర్లలో జేమీసన్, వాగ్నర్​ తలో వికెట్ తీసుకున్నారు.

శుభారంభం..

వర్షం కారణంగా తొలి రోజు తుడిచిపెట్టుకుపోగా.. రెండో రోజు ఆట ప్రారంభమైంది. టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన కోహ్లీసేన శుభారంభం చేసింది. తొలి వికెట్​కు ఓపెనర్లు రోహిత్ శర్మ(68 బంతుల్లో 34), శుభ్​మన్ గిల్(64 బంతుల్లో 28).. 62 పరుగులు జోడించారు. కుదురుకుంటున్నట్టే కనిపించిన ఈ జంటను జేమీసన్​ విడగొట్టాడు. రోహిత్​ను స్లిప్​లో దొరకబుచ్చుకున్నాడు. గిల్​ కూడా వికెట్​కీపర్​కు చిక్కాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది టీమ్ఇండియా.

నల్ల బ్యాండులతో..

అంతకుముందు జాతీయ గీతం పాడుతూ టీమ్ఇండియా ఆటగాళ్లు చేతులకు నల్ల బ్యాండులతో కనిపించారు. దిగ్గజ అథ్లెట్​ మిల్కా సింగ్ మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు నల్ల రిబ్బన్లను ధరించి, ఈ మ్యాచ్​ ఆడనున్నారు.

ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు​ ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో టీమ్​ఇండియా తొలి సెషన్​ ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 68 పరుగులతో నిలిచింది. క్రీజులో ఛెతేశ్వర్ పుజారా(0), విరాట్ కోహ్లీ(6) ఉన్నారు. కివీస్ బౌలర్లలో జేమీసన్, వాగ్నర్​ తలో వికెట్ తీసుకున్నారు.

శుభారంభం..

వర్షం కారణంగా తొలి రోజు తుడిచిపెట్టుకుపోగా.. రెండో రోజు ఆట ప్రారంభమైంది. టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన కోహ్లీసేన శుభారంభం చేసింది. తొలి వికెట్​కు ఓపెనర్లు రోహిత్ శర్మ(68 బంతుల్లో 34), శుభ్​మన్ గిల్(64 బంతుల్లో 28).. 62 పరుగులు జోడించారు. కుదురుకుంటున్నట్టే కనిపించిన ఈ జంటను జేమీసన్​ విడగొట్టాడు. రోహిత్​ను స్లిప్​లో దొరకబుచ్చుకున్నాడు. గిల్​ కూడా వికెట్​కీపర్​కు చిక్కాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది టీమ్ఇండియా.

నల్ల బ్యాండులతో..

అంతకుముందు జాతీయ గీతం పాడుతూ టీమ్ఇండియా ఆటగాళ్లు చేతులకు నల్ల బ్యాండులతో కనిపించారు. దిగ్గజ అథ్లెట్​ మిల్కా సింగ్ మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు నల్ల రిబ్బన్లను ధరించి, ఈ మ్యాచ్​ ఆడనున్నారు.

Last Updated : Jun 19, 2021, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.