ETV Bharat / sports

ICC కీలక నిర్ణయం.. ఇకపై పురుషులు, మహిళల జట్లకు ప్రైజ్ మనీ సేమ్​

author img

By

Published : Jul 13, 2023, 8:39 PM IST

Updated : Jul 13, 2023, 10:15 PM IST

ICC Prize Money : మహిళల క్రికెట్‌ జట్లకు ఐసీసీ గుడ్ న్యూస్‌ చెప్పింది. ఐసీసీ నిర్వహించే అన్ని ఈవెంట్లలో ప్రైజ్‌ మనీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ఐసీసీ నిర్వహించే ఈవెంట్లలో పురుష క్రికెట్‌ జట్లు, మహిళల క్రికెట్‌ జట్లకు సమానంగా ప్రైజ్‌ మనీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ICC Prize Money Announcement
వారితో సమానంగా మహిళల క్రికెట్‌ జట్లకు ప్రైజ్‌ మనీ.. ఐసీసీ కీలక నిర్ణయం..

ICC Announces Prize Money : మహిళల క్రికెట్‌ జట్లకు ఐసీసీ శుభవార్త చెప్పింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించే అన్ని ఈవెంట్లలో ప్రైజ్‌ మనీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఐసీసీ ఈవెంట్లలో పురుష క్రికెట్‌ జట్లు, మహిళల క్రికెట్‌ జట్లకు సమానంగా ప్రైజ్‌ మనీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా టెస్ట్‌ క్రికెట్‌లో విధించే ఓవర్‌ రేట్‌ ఆంక్షల్లో కూడా మార్పులు చేసినట్లు తెలిపింది. దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జరిగిన ఐసీసీ వార్షిక కాన్ఫరెన్స్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు నిర్వాహకులు.

ICC Equal Prize Money : క్రికెట్‌లో లింగ సమానత్వం కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ ఐసీసీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల యావత్​ ప్రపంచం హర్షం వ్యక్తం చేస్తోంది.

ఇప్పటికే బీసీసీఐ నిర్వహించే ప్రతి క్రికెట్‌ టోర్నీల్లోనూ పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా అందరికీ సమానంగా వేతనాలు అందిస్తున్నారు. ఈ సమానత్వం ఐసీసీ ఆధ్వర్యంలో జరిగే మెగా ఈవెంట్లల్లో కూడా కనిపించాలని బీసీసీఐ ఓ ప్రతిపాదనను ఐసీసీ పెద్దల ముందుంచుంది. దీనిని నిశితంగా పరిశీలించిన ఐసీసీ మేనేజ్​మెంట్​ సానుకూలంగా స్పందిస్తూ చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాన్ని తీసుకుంది.

ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు. 'ఈ మా చారిత్రక ప్రయత్నానికి సహకరించిన సహచర బోర్డు సభ్యులందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్​లో క్రికెట్​ కొనసాగింపునకు.. ప్రపంచవ్యాప్తంగా దీనిని విస్తరించేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దొహదపడుతుంది' అని జై షా తెలిపారు.

"క్రికెట్​లో లింగ సమానత్వం, మహిళా సాధికారత విషయంలో ఓ కొత్త సంప్రదాయానికి నాంది పలికాం. ఈ విషయంలో మరో అడుగు ముందుకు పడ్డదని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఇక నుంచి ఐసీసీ నిర్వహించే అన్ని మెగా ఈవెంట్లలో పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా అందరికీ సమానమైన ప్రైజ్​ మనీ అందుతుంది. అందరం కలిసి ఎదుగుదాం"

- జై షా, బీసీసీఐ సెక్రటరీ

ఐసీసీ ప్రకటన..
ఈ కీలక నిర్ణయంపై ఐసీసీ కూడా ట్విట్టర్​ వేదికగా స్పందించింది. క్రికెట్ చరిత్రలోనే ఇదో ముఖ్యమైన ఘట్టమని.. ఇకపై ఐసీసీ నిర్వహించే అన్ని గ్లోబల్​ ఈవెంట్స్​లో పురుషులు, మహిళా క్రికెటర్లకు ఒకే విధమైన ప్రైజ్​ మనీ అందించడం సంతోషంగా ఉందని ఐసీసీ చైర్మన్ గ్రేగ్ బార్క్‌లే తెలిపారు.

ICC Announces Prize Money : మహిళల క్రికెట్‌ జట్లకు ఐసీసీ శుభవార్త చెప్పింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించే అన్ని ఈవెంట్లలో ప్రైజ్‌ మనీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఐసీసీ ఈవెంట్లలో పురుష క్రికెట్‌ జట్లు, మహిళల క్రికెట్‌ జట్లకు సమానంగా ప్రైజ్‌ మనీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా టెస్ట్‌ క్రికెట్‌లో విధించే ఓవర్‌ రేట్‌ ఆంక్షల్లో కూడా మార్పులు చేసినట్లు తెలిపింది. దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జరిగిన ఐసీసీ వార్షిక కాన్ఫరెన్స్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు నిర్వాహకులు.

ICC Equal Prize Money : క్రికెట్‌లో లింగ సమానత్వం కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ ఐసీసీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల యావత్​ ప్రపంచం హర్షం వ్యక్తం చేస్తోంది.

ఇప్పటికే బీసీసీఐ నిర్వహించే ప్రతి క్రికెట్‌ టోర్నీల్లోనూ పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా అందరికీ సమానంగా వేతనాలు అందిస్తున్నారు. ఈ సమానత్వం ఐసీసీ ఆధ్వర్యంలో జరిగే మెగా ఈవెంట్లల్లో కూడా కనిపించాలని బీసీసీఐ ఓ ప్రతిపాదనను ఐసీసీ పెద్దల ముందుంచుంది. దీనిని నిశితంగా పరిశీలించిన ఐసీసీ మేనేజ్​మెంట్​ సానుకూలంగా స్పందిస్తూ చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాన్ని తీసుకుంది.

ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు. 'ఈ మా చారిత్రక ప్రయత్నానికి సహకరించిన సహచర బోర్డు సభ్యులందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్​లో క్రికెట్​ కొనసాగింపునకు.. ప్రపంచవ్యాప్తంగా దీనిని విస్తరించేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దొహదపడుతుంది' అని జై షా తెలిపారు.

"క్రికెట్​లో లింగ సమానత్వం, మహిళా సాధికారత విషయంలో ఓ కొత్త సంప్రదాయానికి నాంది పలికాం. ఈ విషయంలో మరో అడుగు ముందుకు పడ్డదని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఇక నుంచి ఐసీసీ నిర్వహించే అన్ని మెగా ఈవెంట్లలో పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా అందరికీ సమానమైన ప్రైజ్​ మనీ అందుతుంది. అందరం కలిసి ఎదుగుదాం"

- జై షా, బీసీసీఐ సెక్రటరీ

ఐసీసీ ప్రకటన..
ఈ కీలక నిర్ణయంపై ఐసీసీ కూడా ట్విట్టర్​ వేదికగా స్పందించింది. క్రికెట్ చరిత్రలోనే ఇదో ముఖ్యమైన ఘట్టమని.. ఇకపై ఐసీసీ నిర్వహించే అన్ని గ్లోబల్​ ఈవెంట్స్​లో పురుషులు, మహిళా క్రికెటర్లకు ఒకే విధమైన ప్రైజ్​ మనీ అందించడం సంతోషంగా ఉందని ఐసీసీ చైర్మన్ గ్రేగ్ బార్క్‌లే తెలిపారు.

Last Updated : Jul 13, 2023, 10:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.