ETV Bharat / sports

ICC: 'ప్లేయర్​ ఆఫ్ ది మంత్' రేసులో ఉన్నది వీరే..

author img

By

Published : Jun 8, 2021, 3:59 PM IST

మే నెలకు సంబంధించి 'ప్లేయర్​ ఆఫ్ ది మంత్' అవార్డు నామినేషన్లను ప్రకటించింది ఐసీసీ(ICC). పురుషుల విభాగం నుంచి హసన్ అలీ(పాకిస్థాన్​), ప్రవీణ్ జయవిక్రమ(శ్రీలంక), ముష్ఫికర్ రహీమ్(బంగ్లాదేశ్​)ను నామినేట్ చేసింది. మహిళా విభాగంలో స్కాట్లాండ్​ క్రికెటర్​ కాథరిన్ బ్రైస్​తో పాటు ఐర్లాండ్ క్రికెటర్లు గేబీ లూయిస్, లీ పాల్​ పేర్లను ప్రకటించింది.

icc, player of the month
ఐసీసీ, ప్లేయర్ ఆఫ్ ది మంత్

మే నెలకు సంబంధించి 'ప్లేయర్​ ఆఫ్ ది మంత్ అవార్డు'(Player of The Month Award) నామినేషన్ల పేర్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) ప్రకటించింది. పురుషుల విభాగం నుంచి పాకిస్థాన్ క్రికెటర్​ హసన్​ అలీతో పాటు ప్రవీణ్​ జయవిక్రమ(శ్రీలంక), ముష్ఫికర్​ రహీమ్​(బంగ్లాదేశ్​) పేర్లను నామినేట్ చేసింది.

జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టుల సిరీస్​లో పాక్​ బౌలర్​ హసన్​ అలీ 14 వికెట్లు తీసుకున్నాడు. ఇక శ్రీలంక బౌలర్​ జయవిక్రమ.. బంగ్లాదేశ్​తో జరిగిన టెస్టులో 11 వికెట్లు కైవసం చేసుకున్నాడు. బంగ్లా క్రికెటర్​ రహీమ్​ శ్రీలంకతో జరిగిన సిరీస్​లో అద్భుతంగా రాణించాడు. వన్డే సిరీస్ గెలవడానికి తన వంతు పాత్ర పోషించాడు.

ఇదీ చదవండి: జాతి వివక్ష: మరో క్రికెటర్​ సస్పెండ్​ కానున్నాడా?

మహిళా విభాగం..

ఇక మహిళా క్రికెట్ విభాగంలో కాథరిన్​ బ్రైస్​(స్కాట్లాండ్), గేబీ లూయిస్​(ఐర్లాండ్), లీ పాల్​(ఐర్లాండ్).. గత నెలకు గానూ ప్లేయర్​ ఆఫ్ ది మంత్​గా నామినేట్ అయ్యారు.

ఇటీవల ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్​లో స్కాట్లాండ్​ ఆల్​రౌండర్​ బ్రైస్​ టాప్​-10లో నిలిచింది. ఐర్లాండ్​తో జరిగిన పొట్టి సిరీస్​లో 4 మ్యాచ్​లాడి 96 రన్స్​తో పాటు 5 వికెట్లు సాధించింది. ఇదే సిరీస్​లో ఐర్లాండ్ క్రికెటర్​ గేబీ లూయిస్​ 116 పరుగులు చేసింది. తమ జట్టు రెండు మ్యాచ్​లు గెలవడంలో కీలక పాత్ర పోషించింది. దీంతో పాటు 9 వికెట్లు తీసింది.

ఇదీ చదవండి: బబుల్​ నుంచి టీమ్​ఇండియాకు 20రోజులు బ్రేక్​

మే నెలకు సంబంధించి 'ప్లేయర్​ ఆఫ్ ది మంత్ అవార్డు'(Player of The Month Award) నామినేషన్ల పేర్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) ప్రకటించింది. పురుషుల విభాగం నుంచి పాకిస్థాన్ క్రికెటర్​ హసన్​ అలీతో పాటు ప్రవీణ్​ జయవిక్రమ(శ్రీలంక), ముష్ఫికర్​ రహీమ్​(బంగ్లాదేశ్​) పేర్లను నామినేట్ చేసింది.

జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టుల సిరీస్​లో పాక్​ బౌలర్​ హసన్​ అలీ 14 వికెట్లు తీసుకున్నాడు. ఇక శ్రీలంక బౌలర్​ జయవిక్రమ.. బంగ్లాదేశ్​తో జరిగిన టెస్టులో 11 వికెట్లు కైవసం చేసుకున్నాడు. బంగ్లా క్రికెటర్​ రహీమ్​ శ్రీలంకతో జరిగిన సిరీస్​లో అద్భుతంగా రాణించాడు. వన్డే సిరీస్ గెలవడానికి తన వంతు పాత్ర పోషించాడు.

ఇదీ చదవండి: జాతి వివక్ష: మరో క్రికెటర్​ సస్పెండ్​ కానున్నాడా?

మహిళా విభాగం..

ఇక మహిళా క్రికెట్ విభాగంలో కాథరిన్​ బ్రైస్​(స్కాట్లాండ్), గేబీ లూయిస్​(ఐర్లాండ్), లీ పాల్​(ఐర్లాండ్).. గత నెలకు గానూ ప్లేయర్​ ఆఫ్ ది మంత్​గా నామినేట్ అయ్యారు.

ఇటీవల ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్​లో స్కాట్లాండ్​ ఆల్​రౌండర్​ బ్రైస్​ టాప్​-10లో నిలిచింది. ఐర్లాండ్​తో జరిగిన పొట్టి సిరీస్​లో 4 మ్యాచ్​లాడి 96 రన్స్​తో పాటు 5 వికెట్లు సాధించింది. ఇదే సిరీస్​లో ఐర్లాండ్ క్రికెటర్​ గేబీ లూయిస్​ 116 పరుగులు చేసింది. తమ జట్టు రెండు మ్యాచ్​లు గెలవడంలో కీలక పాత్ర పోషించింది. దీంతో పాటు 9 వికెట్లు తీసింది.

ఇదీ చదవండి: బబుల్​ నుంచి టీమ్​ఇండియాకు 20రోజులు బ్రేక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.