ETV Bharat / sports

నలుగురు మహిళ క్రికెటర్లకు బీసీసీఐ ఎన్​ఓసీ

author img

By

Published : May 4, 2021, 12:46 PM IST

యూకే వేదికగా ఈ ఏడాది జూన్​-జులైలో జరిగే 'ది హండ్రెడ్'​ టోర్నీలో పాల్గొనడానికి బీసీసీఐ నలుగురు మహిళ క్రికెటర్లకు అనుమతిచ్చింది. ఇందుకు సంబంధించిన నో ఆబ్జెక్షన్​ సర్టిఫికెట్లను జారీ చేసింది.

bcci, Four India women players granted NOCs by BCCI to feature in The Hundred
బీసీసీఐ, నలుగురు మహిళ క్రికెటర్లకు బీసీసీఐ ఎన్​ఓసీ

'ది హండ్రెడ్​' టోర్నీలో పాల్గొనడానికి భారత మహిళ క్రికెటర్లకు నో ఆబ్జెక్షన్​ సర్టిఫికెట్(ఎన్​ఓసీ)ను జారీ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). స్మృతి మంధాన, హర్మన్​ప్రీత్ కౌర్​, జెమియా రోడ్రిగ్స్​, దీప్తి శర్మలకు ఈ సర్టిఫికెట్​లను ఇచ్చింది. ఈ లీగ్​ను ఇంగ్లాండ్ వేదికగా గతేడాది నిర్వహించతలపెట్టారు. కానీ, కొవిడ్ కారణంగా ఆ టోర్నీ వాయిదా పడింది.

బీసీసీఐ అనుమతితో ఈ జూన్​-జులైలో యూకే వేదికగా జరిగే ఒక టెస్టు, మూడు వన్డేలు, మరికొన్ని టీ20ల్లో ఆడటానికి అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ఐపీఎల్​-14లో రీఎంట్రీ ఇవ్వనున్న అశ్విన్​​​!

ఇందుకు సంబంధించి ఎన్​ఓసీలను ఇప్పటికే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుకు అందజేసింది బీసీసీఐ. ప్రస్తుతం అధికారిక ప్రకటన చేసింది. త్వరలోనే 'ది హండ్రెడ్' టోర్నీలో పాల్గొనే జట్టును ప్రకటించనున్నట్లు ఓ క్రీడా ఛానెల్​ తెలిపింది.

'ది హండ్రెడ్'​ అనేది 100 బంతుల టోర్నీ. ఈ లీగ్​లో ప్రముఖ ఆటగాళ్లు(పురుషులు, మహిళలు) పాల్గొననున్నారు.

ఇదీ చదవండి: క్వారంటైన్​లో సీఎస్కే.. రాజస్థాన్​తో మ్యాచ్​ వాయిదా

'ది హండ్రెడ్​' టోర్నీలో పాల్గొనడానికి భారత మహిళ క్రికెటర్లకు నో ఆబ్జెక్షన్​ సర్టిఫికెట్(ఎన్​ఓసీ)ను జారీ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). స్మృతి మంధాన, హర్మన్​ప్రీత్ కౌర్​, జెమియా రోడ్రిగ్స్​, దీప్తి శర్మలకు ఈ సర్టిఫికెట్​లను ఇచ్చింది. ఈ లీగ్​ను ఇంగ్లాండ్ వేదికగా గతేడాది నిర్వహించతలపెట్టారు. కానీ, కొవిడ్ కారణంగా ఆ టోర్నీ వాయిదా పడింది.

బీసీసీఐ అనుమతితో ఈ జూన్​-జులైలో యూకే వేదికగా జరిగే ఒక టెస్టు, మూడు వన్డేలు, మరికొన్ని టీ20ల్లో ఆడటానికి అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ఐపీఎల్​-14లో రీఎంట్రీ ఇవ్వనున్న అశ్విన్​​​!

ఇందుకు సంబంధించి ఎన్​ఓసీలను ఇప్పటికే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుకు అందజేసింది బీసీసీఐ. ప్రస్తుతం అధికారిక ప్రకటన చేసింది. త్వరలోనే 'ది హండ్రెడ్' టోర్నీలో పాల్గొనే జట్టును ప్రకటించనున్నట్లు ఓ క్రీడా ఛానెల్​ తెలిపింది.

'ది హండ్రెడ్'​ అనేది 100 బంతుల టోర్నీ. ఈ లీగ్​లో ప్రముఖ ఆటగాళ్లు(పురుషులు, మహిళలు) పాల్గొననున్నారు.

ఇదీ చదవండి: క్వారంటైన్​లో సీఎస్కే.. రాజస్థాన్​తో మ్యాచ్​ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.