ETV Bharat / sports

భారత మాజీ ఓపెనర్‌​ కన్నుమూత

author img

By

Published : Apr 6, 2023, 6:31 AM IST

Updated : Apr 6, 2023, 8:45 AM IST

టీమ్​ఇండియా మాజీ ఓపెనర్‌ సుధీర్‌ నాయక్‌(78) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.

Former India opener noted coach and curator Sudhir Naik dies aged 78
భారత మాజీ ఓపెనర్‌ కన్నుమూత

టీమ్​ఇండియా మాజీ ఓపెనర్‌ సుధీర్‌ నాయక్‌(78) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు క్రికెట్​ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ విషయాన్ని ముంబయి క్రికెట్ అసోసియేషన్ వర్గాలు తెలిపాయి. ఈయనకు ఓ కుమార్తె ఉంది. ఆమె దగ్గరే నాయక్​ ఉంటున్నారు. "సుధీర్‌ నాయక్‌ ఇటీవల బాత్రూంలో జారిపడ్డారు. తలకు గాయం కావడం వల్ల కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. కోమాలోకి వెళ్లిన నాయక్‌ మళ్లీ కోలుకోలేదు" అని ముంబయి క్రికెట్‌ సంఘానికి చెందిన ఓ అధికారి చెప్పారు.

కాగా, సుధీర్‌ నాయక్‌.. నాయక్​.. 1970-71 రంజీ ట్రోఫీ సీజన్​లో బ్లూరీ బ్యాండ్​​ గ్లోరీ టీమ్​కు నాయకత్వం వహించారు. అప్పుడు జట్టును గెలిపించి.. ట్రోఫీని ముద్దాడారు. సునీల్ గావస్కర్​, అజిత్​ వాడేకర్​, దిలీప్​ సార్దేశాయ్​, అశోక్​ మన్​కడ్​ లాంటి దిగ్గజ ఆటగాళ్లు జట్టులో లేకుండానే ఆయన తన టీమ్​ను గెలిపించారు. 1972 రంజీ సీజన్​లో తుది జట్టులో ఆయనకు చోటు దక్కలేదు. ఇక 1974లో ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్లారు. బర్మింగ్ హమ్ వేదికగా జరిగిన టెస్టుతో అరంగేట్రం చేశారు. అప్పుడు అరంగేట్రంలోనే రెండో ఇన్నింగ్స్​లో 77 పరుగులు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నారు.

ఇంకా కెరీర్​లో 1974లో భారత్‌ తరఫున మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడారు. 85 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడారు. 35 సగటుతో దాదాపు 4376 పరుగులు చేశారు. బ్యాటింగ్​లో దూకుడుగా ఉండే ఆయన.. ఫస్ట్ క్లాస్​ మ్యాచుల్లో ఏడు సెంచరీలు బాదారు. ఓ ద్విశతకం కూడా కొట్టారు. అలా తన ఆటతో క్రికెట్ అభిమానులతో పాటు సహ ఆటగాళ్లను ఆకట్టుకున్నారు. వారి ప్రశంసలను పొందారు. కానీ ఆయన తన కెరీర్​లో ఎంత పేరు సంపాదించారో అలానే కష్టాలను కూడా చూశారు. విమర్శలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా 1970లలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆయపై దొంగతనం ఆరోపణలు కూడా వచ్చాయి. లండన్​ డిపార్ట్​మెంటల్​ స్టోర్​లో రెండు జతల సాక్స్​ను దొంగిలించారని ఆయనపై ఫిర్యాదు నమోదైంది. అయితే ఆ సమయంలో సునీల్​ గావస్కర్​ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇకపోతే రెండో ఇన్నింగ్స్​లో మంచి కోచ్‌గానూ గుర్తింపు సాధించారు. క్రికెటర్​ జహీర్‌ ఖాన్‌ ఎదుగుదలలో ఆయన పాత్ర కూడా ఉంది. ఇంకా ఆయన తన కెరీర్​లో ముంబయి సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా, వాంఖడే స్టేడియం క్యురేటర్‌గా కూడా పని చేశారు.

ఇదీ చూడండి: IPL 2023: పంజాబ్‌దే పంజా.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌పై విజయం

టీమ్​ఇండియా మాజీ ఓపెనర్‌ సుధీర్‌ నాయక్‌(78) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు క్రికెట్​ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ విషయాన్ని ముంబయి క్రికెట్ అసోసియేషన్ వర్గాలు తెలిపాయి. ఈయనకు ఓ కుమార్తె ఉంది. ఆమె దగ్గరే నాయక్​ ఉంటున్నారు. "సుధీర్‌ నాయక్‌ ఇటీవల బాత్రూంలో జారిపడ్డారు. తలకు గాయం కావడం వల్ల కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. కోమాలోకి వెళ్లిన నాయక్‌ మళ్లీ కోలుకోలేదు" అని ముంబయి క్రికెట్‌ సంఘానికి చెందిన ఓ అధికారి చెప్పారు.

కాగా, సుధీర్‌ నాయక్‌.. నాయక్​.. 1970-71 రంజీ ట్రోఫీ సీజన్​లో బ్లూరీ బ్యాండ్​​ గ్లోరీ టీమ్​కు నాయకత్వం వహించారు. అప్పుడు జట్టును గెలిపించి.. ట్రోఫీని ముద్దాడారు. సునీల్ గావస్కర్​, అజిత్​ వాడేకర్​, దిలీప్​ సార్దేశాయ్​, అశోక్​ మన్​కడ్​ లాంటి దిగ్గజ ఆటగాళ్లు జట్టులో లేకుండానే ఆయన తన టీమ్​ను గెలిపించారు. 1972 రంజీ సీజన్​లో తుది జట్టులో ఆయనకు చోటు దక్కలేదు. ఇక 1974లో ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్లారు. బర్మింగ్ హమ్ వేదికగా జరిగిన టెస్టుతో అరంగేట్రం చేశారు. అప్పుడు అరంగేట్రంలోనే రెండో ఇన్నింగ్స్​లో 77 పరుగులు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నారు.

ఇంకా కెరీర్​లో 1974లో భారత్‌ తరఫున మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడారు. 85 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడారు. 35 సగటుతో దాదాపు 4376 పరుగులు చేశారు. బ్యాటింగ్​లో దూకుడుగా ఉండే ఆయన.. ఫస్ట్ క్లాస్​ మ్యాచుల్లో ఏడు సెంచరీలు బాదారు. ఓ ద్విశతకం కూడా కొట్టారు. అలా తన ఆటతో క్రికెట్ అభిమానులతో పాటు సహ ఆటగాళ్లను ఆకట్టుకున్నారు. వారి ప్రశంసలను పొందారు. కానీ ఆయన తన కెరీర్​లో ఎంత పేరు సంపాదించారో అలానే కష్టాలను కూడా చూశారు. విమర్శలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా 1970లలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆయపై దొంగతనం ఆరోపణలు కూడా వచ్చాయి. లండన్​ డిపార్ట్​మెంటల్​ స్టోర్​లో రెండు జతల సాక్స్​ను దొంగిలించారని ఆయనపై ఫిర్యాదు నమోదైంది. అయితే ఆ సమయంలో సునీల్​ గావస్కర్​ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇకపోతే రెండో ఇన్నింగ్స్​లో మంచి కోచ్‌గానూ గుర్తింపు సాధించారు. క్రికెటర్​ జహీర్‌ ఖాన్‌ ఎదుగుదలలో ఆయన పాత్ర కూడా ఉంది. ఇంకా ఆయన తన కెరీర్​లో ముంబయి సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా, వాంఖడే స్టేడియం క్యురేటర్‌గా కూడా పని చేశారు.

ఇదీ చూడండి: IPL 2023: పంజాబ్‌దే పంజా.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌పై విజయం

Last Updated : Apr 6, 2023, 8:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.