ETV Bharat / sports

Ind vs Eng: టాస్​ గెలిచిన ఇంగ్లాండ్​- భారత్​ బ్యాటింగ్​

author img

By

Published : Aug 12, 2021, 3:28 PM IST

లార్డ్స్​ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టాస్​ గెలిచిన ఇంగ్లాండ్​.. ఫీల్డింగ్​ ఎంచుకుంది. కోహ్లీ సేన బ్యాటింగ్​ చేయనుంది. వర్షం కారణంగా.. టాస్​ ఆలస్యం అయింది.

IND ENG 2ND TEST
ఇండియా ఇంగ్లాండ్​ రెండో టెస్టు

భారత్​​తో రెండో టెస్టులో టాస్​ గెలిచిన ఇంగ్లాండ్​ ఫీల్డింగ్​ ఎంచుకుంది. కోహ్లీ సేన బ్యాటింగ్​ చేయనుంది. అంతకుముందు చిరుజల్లులు కురవడం వల్ల మ్యాచ్​ టాస్ కాస్త ఆలస్యం అయింది. భారత కాలమానం ప్రకారం 3:45 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

భారత్​లో శార్దూల్​ ఠాకుర్​, ఇంగ్లాండ్​లో బ్రాడ్​.. గాయాల కారణంగా మ్యాచ్​కు దూరమయ్యారు.

శార్దూల్​ స్థానంలో ఇషాంత్​ శర్మ తుది జట్టులోకి వచ్చాడు. ఇంగ్లాండ్​ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది.

తొలి టెస్టులో భారత్​ విజయం దిశగా సాగుతున్న తరుణంలో.. వర్షం అంతరాయం కలిగించింది. చివరి రోజు ఆట సాధ్యం కాకపోవడం వల్ల మ్యాచ్​ డ్రాగా ముగిసింది. రెండు జట్లకు చెరో నాలుగు పాయింట్ల చొప్పున లభించాయి. అయితే.. స్లో ఓవర్​ రేటు కారణంగా.. రెండు జట్లకు రెండు పాయింట్ల చొప్పున కోత విధించింది ఐసీసీ.

తుది జట్లు ఇవే.

టీమ్​ ఇండియా: రోహిత్​ శర్మ, కేఎల్​ రాహుల్​, ఛెతేశ్వర్​ పుజారా, విరాట్​ కోహ్లీ(కెప్టెన్​), అజింక్యా రహానె, రిషభ్​ పంత్​(వికెట్​ కీపర్​), రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ​, మహ్మద్​ షమి, జస్​ప్రీత్​ బుమ్రా, సిరాజ్​.

ఇంగ్లాండ్​: రోరీ బర్న్స్​, హసీబ్​ హమీద్​, సిబ్లే, జో రూట్​, జానీ బెయిర్​ స్టో, మొయిన్​ అలీ​, జాస్​ బట్లర్​, సామ్​ కరన్​, మార్క్​ వుడ్​, ఓలీ రాబిన్సన్​, జేమ్స్​ అండర్సన్​.

ఇదీ చూడండి: Ind vs Eng: 'పుజారా, రహానే ఫామ్​పై ఆందోళన అనవసరం'

భారత్​​తో రెండో టెస్టులో టాస్​ గెలిచిన ఇంగ్లాండ్​ ఫీల్డింగ్​ ఎంచుకుంది. కోహ్లీ సేన బ్యాటింగ్​ చేయనుంది. అంతకుముందు చిరుజల్లులు కురవడం వల్ల మ్యాచ్​ టాస్ కాస్త ఆలస్యం అయింది. భారత కాలమానం ప్రకారం 3:45 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

భారత్​లో శార్దూల్​ ఠాకుర్​, ఇంగ్లాండ్​లో బ్రాడ్​.. గాయాల కారణంగా మ్యాచ్​కు దూరమయ్యారు.

శార్దూల్​ స్థానంలో ఇషాంత్​ శర్మ తుది జట్టులోకి వచ్చాడు. ఇంగ్లాండ్​ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది.

తొలి టెస్టులో భారత్​ విజయం దిశగా సాగుతున్న తరుణంలో.. వర్షం అంతరాయం కలిగించింది. చివరి రోజు ఆట సాధ్యం కాకపోవడం వల్ల మ్యాచ్​ డ్రాగా ముగిసింది. రెండు జట్లకు చెరో నాలుగు పాయింట్ల చొప్పున లభించాయి. అయితే.. స్లో ఓవర్​ రేటు కారణంగా.. రెండు జట్లకు రెండు పాయింట్ల చొప్పున కోత విధించింది ఐసీసీ.

తుది జట్లు ఇవే.

టీమ్​ ఇండియా: రోహిత్​ శర్మ, కేఎల్​ రాహుల్​, ఛెతేశ్వర్​ పుజారా, విరాట్​ కోహ్లీ(కెప్టెన్​), అజింక్యా రహానె, రిషభ్​ పంత్​(వికెట్​ కీపర్​), రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ​, మహ్మద్​ షమి, జస్​ప్రీత్​ బుమ్రా, సిరాజ్​.

ఇంగ్లాండ్​: రోరీ బర్న్స్​, హసీబ్​ హమీద్​, సిబ్లే, జో రూట్​, జానీ బెయిర్​ స్టో, మొయిన్​ అలీ​, జాస్​ బట్లర్​, సామ్​ కరన్​, మార్క్​ వుడ్​, ఓలీ రాబిన్సన్​, జేమ్స్​ అండర్సన్​.

ఇదీ చూడండి: Ind vs Eng: 'పుజారా, రహానే ఫామ్​పై ఆందోళన అనవసరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.