ETV Bharat / sports

ఫీల్డింగ్​పై దృష్టిపెట్టిన కోహ్లీ సేన! - టీమ్ఇండియా వార్తలు

ఇంగ్లాండ్​తో జరగనున్న ఆఖరి టెస్టు కోసం కోహ్లీ సేన తీవ్రంగా శ్రమిస్తోంది. గత టెస్టు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఫీల్డింగ్​లో పక్కాగా ఉండాలని ప్రణాళికలను రచిస్తోంది. మంగళవారం జరిగిన ప్రాక్టీస్​ సెషన్​లో టీమ్ఇండియా ఆటగాళ్లు ఫీల్డింగ్​పై దృష్టి సారించారు. దానికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్​లో పంచుకుంది.

Team India shift focus to fielding ahead of fourth Test
ఫీల్డింగ్​పై దృష్టిపెట్టిన కోహ్లీసేన!
author img

By

Published : Mar 2, 2021, 8:50 PM IST

మార్చి 4 నుంచి ఇంగ్లాండ్​తో జరగనున్న నిర్ణయాత్మక టెస్టు కోసం టీమ్ఇండియా తీవ్రంగా శ్రమిస్తోంది. సోమవారం నెట్స్​లో ప్రాక్టీస్​ చేసిన భారత ఆటగాళ్లు.. మంగళవారం ఫీల్డింగ్​పై దృష్టి సారించారు. ఫీల్డింగ్​ కోచ్​ ఆర్​.శ్రీధర్​ నేతృత్వంలో సాగిన ప్రాక్టీస్​కు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ షేర్​ చేసింది. ​

బ్యాట్స్​మన్​ మయాంక్​ అగర్వాల్​ డైవింగ్​ క్యాచ్​లు ప్రాక్టీస్ చేస్తుండగా.. ఆల్​రౌండర్​ వాషింగ్టన్ సుందర్​ త్రోలో శిక్షణ తీసుకుంటున్నాడు. వీరితో పాటు స్పిన్నర్ కుల్దీప్​ యాదవ్​, పేసర్​ ఉమేశ్​ యాదవ్​ క్యాచ్​లు ప్రాక్టీస్​ చేస్తున్నారు.

అంతకుముందు కెప్టెన్​ కోహ్లీ, రహానెతో పాటు మిగిలిన ఆటగాళ్లు నెట్​ ప్రాక్టీస్​కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్​లో పంచుకుంది. ఇంగ్లాండ్​తో జరుగుతోన్న నాలుగు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా.. ఆఖరి టెస్టులోనూ గెలిచి ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​కు అర్హత పొందాలని పట్టుదలగా ఉంది. నిర్ణయాత్మక మ్యాచ్​లో భారత జట్టును ఓడించి కోహ్లీసేన టెస్టు ఛాంపియన్​షిప్​ ఆశలను నీరుగార్చాలని రూట్​ సేన భావిస్తోంది.

ఇదీ చూడండి: నాలుగో టెస్టు ముందు పిచ్​పై వాన్​ వివాదాస్పద పోస్ట్​

మార్చి 4 నుంచి ఇంగ్లాండ్​తో జరగనున్న నిర్ణయాత్మక టెస్టు కోసం టీమ్ఇండియా తీవ్రంగా శ్రమిస్తోంది. సోమవారం నెట్స్​లో ప్రాక్టీస్​ చేసిన భారత ఆటగాళ్లు.. మంగళవారం ఫీల్డింగ్​పై దృష్టి సారించారు. ఫీల్డింగ్​ కోచ్​ ఆర్​.శ్రీధర్​ నేతృత్వంలో సాగిన ప్రాక్టీస్​కు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ షేర్​ చేసింది. ​

బ్యాట్స్​మన్​ మయాంక్​ అగర్వాల్​ డైవింగ్​ క్యాచ్​లు ప్రాక్టీస్ చేస్తుండగా.. ఆల్​రౌండర్​ వాషింగ్టన్ సుందర్​ త్రోలో శిక్షణ తీసుకుంటున్నాడు. వీరితో పాటు స్పిన్నర్ కుల్దీప్​ యాదవ్​, పేసర్​ ఉమేశ్​ యాదవ్​ క్యాచ్​లు ప్రాక్టీస్​ చేస్తున్నారు.

అంతకుముందు కెప్టెన్​ కోహ్లీ, రహానెతో పాటు మిగిలిన ఆటగాళ్లు నెట్​ ప్రాక్టీస్​కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్​లో పంచుకుంది. ఇంగ్లాండ్​తో జరుగుతోన్న నాలుగు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా.. ఆఖరి టెస్టులోనూ గెలిచి ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​కు అర్హత పొందాలని పట్టుదలగా ఉంది. నిర్ణయాత్మక మ్యాచ్​లో భారత జట్టును ఓడించి కోహ్లీసేన టెస్టు ఛాంపియన్​షిప్​ ఆశలను నీరుగార్చాలని రూట్​ సేన భావిస్తోంది.

ఇదీ చూడండి: నాలుగో టెస్టు ముందు పిచ్​పై వాన్​ వివాదాస్పద పోస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.