ETV Bharat / sports

తొలి టీ20లో తడబడిన భారత్​.. ఇంగ్లాండ్​ లక్ష్యం 125

author img

By

Published : Mar 12, 2021, 8:49 PM IST

అహ్మదాబాద్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టీ20లో భారత్​ తడబడింది. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 124 రన్స్​ చేసింది. ఫలితంగా ఇంగ్లాండ్​ జట్టు 125 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సిఉంది.

India Vs England 1st T20
ఇండియా Vs ఇంగ్లాండ్​

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న తొలి టీ20లో టీమ్ఇండియా ఆరంభం నుంచి తడబడుతూ ఆడింది. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన కోహ్లీసేన.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు నమోదు చేసింది. శ్రేయస్​ అయ్యర్​(67) అర్థశతకంతో ఆకట్టుకున్నాడు.

ఇంగ్లీష్​ బౌలర్ల ధాటికి ఆరంభంలోనే ఓపెనర్​ కేఎల్​ రాహుల్(1)​, కెప్టెన్​ విరాట్​ కోహ్లీ(0) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ వెంటనే శిఖర్​ ధావన్(4)​ వెనుదిరగ్గా.. పంత్​తో కలిసి శ్రేయస్​ అయ్యర్​ భాగస్వామ్యం నిలదొక్కుకుంటున్న సమయంలో పంత్​(21) ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి శ్రేయస్​ అయ్యర్​ మంచి పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్​మెన్​ వెంటనే వెనుదిరిగారు. మరోవైపు ఇంగ్లాండ్​ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్​ 3 వికెట్లు పడగొట్టగా.. బెన్​ స్టోక్స్​, మార్క్​ వుడ్​, ఆదిల్​ రషీద్, క్రిస్ జోర్డాన్​​​ తలో వికెట్​ సాధించారు.

నల్ల బ్యాండ్​లతో సంఘీభావం..

టీమ్ఇండియాతో జరుగుతోన్న తొలి టీ20లో ఇంగ్లాండ్​ ఆటగాళ్లు చేతికి నల్ల బ్యాండ్​ ధరించి ఫీల్డింగ్​కు వచ్చారు. మార్చి 8న ఇంగ్లాండ్​ సీనియర్​ క్రికెటర్​, బౌలర్​ జోయ్​ బెంజిమెన్​ గుండెపోటుతో మరణించిన కారణంగా.. అతనికి సంఘీభావంగా ఆ బ్యాండ్​ ధరించినట్లు ఈసీబీ ప్రకటించింది.

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న తొలి టీ20లో టీమ్ఇండియా ఆరంభం నుంచి తడబడుతూ ఆడింది. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన కోహ్లీసేన.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు నమోదు చేసింది. శ్రేయస్​ అయ్యర్​(67) అర్థశతకంతో ఆకట్టుకున్నాడు.

ఇంగ్లీష్​ బౌలర్ల ధాటికి ఆరంభంలోనే ఓపెనర్​ కేఎల్​ రాహుల్(1)​, కెప్టెన్​ విరాట్​ కోహ్లీ(0) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ వెంటనే శిఖర్​ ధావన్(4)​ వెనుదిరగ్గా.. పంత్​తో కలిసి శ్రేయస్​ అయ్యర్​ భాగస్వామ్యం నిలదొక్కుకుంటున్న సమయంలో పంత్​(21) ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి శ్రేయస్​ అయ్యర్​ మంచి పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్​మెన్​ వెంటనే వెనుదిరిగారు. మరోవైపు ఇంగ్లాండ్​ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్​ 3 వికెట్లు పడగొట్టగా.. బెన్​ స్టోక్స్​, మార్క్​ వుడ్​, ఆదిల్​ రషీద్, క్రిస్ జోర్డాన్​​​ తలో వికెట్​ సాధించారు.

నల్ల బ్యాండ్​లతో సంఘీభావం..

టీమ్ఇండియాతో జరుగుతోన్న తొలి టీ20లో ఇంగ్లాండ్​ ఆటగాళ్లు చేతికి నల్ల బ్యాండ్​ ధరించి ఫీల్డింగ్​కు వచ్చారు. మార్చి 8న ఇంగ్లాండ్​ సీనియర్​ క్రికెటర్​, బౌలర్​ జోయ్​ బెంజిమెన్​ గుండెపోటుతో మరణించిన కారణంగా.. అతనికి సంఘీభావంగా ఆ బ్యాండ్​ ధరించినట్లు ఈసీబీ ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.