ETV Bharat / sports

పింక్​ టెస్టు కోసం నెట్స్​లో శ్రమిస్తున్న కోహ్లీ సేన - indian players practice in mothera stadium

పునర్​నిర్మించిన మొతేరా స్టేడియంలో టీమ్​ఇండియా ఆటగాళ్లు పింక్​ టెస్టు కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్​లో షేర్​ చేసింది. బ్యాటింగ్​, బౌలింగ్​తో పాటు జిమ్​లో ప్లేయర్లు సాధన చేస్తున్నారు.

India net session: Kohli's men get used to swinging pink ball, swanky stadium
పింక్​ టెస్టు కోసం నెట్స్​లో శ్రమిస్తున్న కోహ్లీ సేన
author img

By

Published : Feb 21, 2021, 6:21 PM IST

Updated : Feb 21, 2021, 6:56 PM IST

ఫిబ్రవరి 24 నుంచి అహ్మదాబాద్​ వేదికగా జరగనున్న మూడో టెస్టు కోసం భారత ఆటగాళ్లు నెట్స్​లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకు సంబంధించి టీమ్​ఇండియా క్రికెటర్లు ప్రాక్టీస్​ చేస్తున్న ఓ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్​లో పెట్టింది.

కెప్టెన్ విరాట్​ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానె, రోహిత్​ శర్మ, రిషభ్​ పంత్​లు గులాబీ బంతితో బ్యాటింగ్​ సాధన చేస్తున్నారు. జిమ్​లో వ్యాయామంతో పాటు ఫీల్డింగ్​ డ్రిల్స్​ ప్రాక్టీస్​ చేస్తున్నారు. రెండో టెస్టుకు దూరమైన భారత పేసర్ జస్ప్రీత్​ బుమ్రాతో పాటు మహమ్మద్​ సిరాజ్​లు బౌలింగ్​ ప్రాక్టీస్​ చేస్తున్నారు.

నాలుగు టెస్టుల సిరీస్​లో భాగంగా తొలి మ్యాచ్​ ఇంగ్లాండ్​ గెలువగా.. రెండో టెస్టులో భారత్​ విజయం సాధించింది. ప్రస్తుతం 1-1తో సిరీస్​ సమమైంది. దీంతో మొతేరాలో జరగనున్న పింక్​బాల్​ టెస్టు ఆసక్తికరంగా మారింది.

కోల్​కతా వేదికగా గతంలో జరిగిన డే/నైట్​ టెస్టులో వికెట్లన్నీ పేసర్లకే దక్కగా.. తాజాగా జరిగిన తొలి రెండు టెస్టుల్లో ఎక్కువ వికెట్లు స్పిన్నర్ల ఖాతాలో చేరాయి. దీంతో గులాబీ టెస్టు వికెట్​ ఎలా ఉందోనని ఆసక్తిగా మారింది.

ఇదీ చదవండి: తొమ్మిదో సారి ఆస్ట్రేలియన్​ ఓపెన్ ఛాంపియన్​గా జకోవిచ్​డై/నైట్​ టెస్టుకు రాష్ట్రపతి..

మొతేరా స్టేడియాన్ని పునర్​నిర్మించిన తర్వాత జరగనున్న తొలి మ్యాచ్​ను .. భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్​ షాలు వీక్షించనున్నారు.

ఫిబ్రవరి 24 నుంచి అహ్మదాబాద్​ వేదికగా జరగనున్న మూడో టెస్టు కోసం భారత ఆటగాళ్లు నెట్స్​లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకు సంబంధించి టీమ్​ఇండియా క్రికెటర్లు ప్రాక్టీస్​ చేస్తున్న ఓ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్​లో పెట్టింది.

కెప్టెన్ విరాట్​ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానె, రోహిత్​ శర్మ, రిషభ్​ పంత్​లు గులాబీ బంతితో బ్యాటింగ్​ సాధన చేస్తున్నారు. జిమ్​లో వ్యాయామంతో పాటు ఫీల్డింగ్​ డ్రిల్స్​ ప్రాక్టీస్​ చేస్తున్నారు. రెండో టెస్టుకు దూరమైన భారత పేసర్ జస్ప్రీత్​ బుమ్రాతో పాటు మహమ్మద్​ సిరాజ్​లు బౌలింగ్​ ప్రాక్టీస్​ చేస్తున్నారు.

నాలుగు టెస్టుల సిరీస్​లో భాగంగా తొలి మ్యాచ్​ ఇంగ్లాండ్​ గెలువగా.. రెండో టెస్టులో భారత్​ విజయం సాధించింది. ప్రస్తుతం 1-1తో సిరీస్​ సమమైంది. దీంతో మొతేరాలో జరగనున్న పింక్​బాల్​ టెస్టు ఆసక్తికరంగా మారింది.

కోల్​కతా వేదికగా గతంలో జరిగిన డే/నైట్​ టెస్టులో వికెట్లన్నీ పేసర్లకే దక్కగా.. తాజాగా జరిగిన తొలి రెండు టెస్టుల్లో ఎక్కువ వికెట్లు స్పిన్నర్ల ఖాతాలో చేరాయి. దీంతో గులాబీ టెస్టు వికెట్​ ఎలా ఉందోనని ఆసక్తిగా మారింది.

ఇదీ చదవండి: తొమ్మిదో సారి ఆస్ట్రేలియన్​ ఓపెన్ ఛాంపియన్​గా జకోవిచ్​డై/నైట్​ టెస్టుకు రాష్ట్రపతి..

మొతేరా స్టేడియాన్ని పునర్​నిర్మించిన తర్వాత జరగనున్న తొలి మ్యాచ్​ను .. భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్​ షాలు వీక్షించనున్నారు.

Last Updated : Feb 21, 2021, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.