ETV Bharat / sports

తొలి ఇన్నింగ్స్​లో 337 పరుగులకు భారత్​ ఆలౌట్​

author img

By

Published : Feb 8, 2021, 11:26 AM IST

చెపాక్​ టెస్టు తొలి ఇన్నింగ్స్​లో భారత్​ ఘోరంగా విఫలమైంది. పర్యాటక జట్టు దుమ్మురేపిన పిచ్​పై మన బ్యాట్స్​మన్​ చేతులెత్తేశారు. తొలి ఇన్నింగ్స్​లో 337 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్​కు 241 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇంకా 42 పరుగులతో వెనుకబడిన ఆతిథ్య జట్టు ఫాలో ఆన్​లో పడింది.

india all out in first test first innings
తొలి ఇన్నింగ్స్​లో 337 పరుగులకు భారత్​ ఆలౌట్​

చెన్నై టెస్టు తొలి ఇన్నింగ్స్​లో భారత్​ 337 పరుగులకు ఆలౌటైంది. 257/6తో నాలుగో రోజు ఆట కొనసాగించిన టీమ్​ఇండియా మరో 21.5 ఓవర్లు మాత్రమే ఆడింది. మొదటి సెషన్​లో కాసేపు ప్రతిఘటించిన అశ్విన్​, వాషింగ్టన్​ జోడీ జట్టును 300 పరుగుల మార్క్​ దాటించారు. 80 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేసిన ఈ జోడీని​ స్పిన్నర్​ లీచ్ విడగొట్టాడు.​

ఓ వైపు వాషింగ్టన్​ సుందర్​ అర్ధ సెంచరీతో జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. 85 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఎండ్​లో అతనికి సహకారం అందించేవారు కరువయ్యారు. ఇంగ్లాండ్​ జట్టుకు 241 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

ఇదీ చదవండి: 'షాట్ల ఎంపికలో పంత్​ తెలివిగా ఉండాలి'

చెన్నై టెస్టు తొలి ఇన్నింగ్స్​లో భారత్​ 337 పరుగులకు ఆలౌటైంది. 257/6తో నాలుగో రోజు ఆట కొనసాగించిన టీమ్​ఇండియా మరో 21.5 ఓవర్లు మాత్రమే ఆడింది. మొదటి సెషన్​లో కాసేపు ప్రతిఘటించిన అశ్విన్​, వాషింగ్టన్​ జోడీ జట్టును 300 పరుగుల మార్క్​ దాటించారు. 80 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేసిన ఈ జోడీని​ స్పిన్నర్​ లీచ్ విడగొట్టాడు.​

ఓ వైపు వాషింగ్టన్​ సుందర్​ అర్ధ సెంచరీతో జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. 85 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఎండ్​లో అతనికి సహకారం అందించేవారు కరువయ్యారు. ఇంగ్లాండ్​ జట్టుకు 241 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

ఇదీ చదవండి: 'షాట్ల ఎంపికలో పంత్​ తెలివిగా ఉండాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.