ETV Bharat / sports

పింక్​ టెస్టు: టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ఇంగ్లాండ్​ - ఇండియా vs ఇంగ్లాండ్​ టెస్ట్ మ్యాచ్ 3

అహ్మదాబాద్​ వేదికగా జరుగుతోన్న పింక్​-బాల్​ టెస్టులో టాస్​ గెలిచిన ఇంగ్లాండ్​ కెప్టెన్​ జో రూట్​ బ్యాటింగ్​ ఎంచుకున్నాడు. టీమ్ఇండియా పేసర్​ ఇషాంత్​ శర్మకు ఇది వందో టెస్టు కావడం విశేషం.

Ind Vs Eng Pink Ball Test: england won the toss and elected to bat first
పింక్​ టెస్టు
author img

By

Published : Feb 24, 2021, 2:02 PM IST

Updated : Feb 24, 2021, 2:30 PM IST

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న మూడో (పింక్​-బాల్​) టెస్టులో టాస్​ గెలిచిన ఇంగ్లాండ్​​ బ్యాటింగ్​ ఎంచుకుంది. ఇరు జట్లు పలు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ రేసులో నిలవాలంటే.. టీమ్​ఇండియా ఈ మ్యాచ్​ తప్పక గెలవాలి.

ఈ సిరీస్​లో భాగంగా ఆడిన రెండు టెస్టుల్లో చెరో మ్యాచ్​ గెలిచిన ఇరుజట్లు సిరీస్​ను సమం చేశాయి. ఈ మ్యాచ్​లో గెలిచి 2-0 ఆధిక్యంలోకి వెళ్లాలని ఇరుటీమ్​లు ప్రణాళికలు రచిస్తున్నాయి. టీమ్ఇండియా పేసర్​ ఇషాంత్​ శర్మకు ఇది వందో టెస్టు కావడం విశేషం.

జట్లు:

టీమ్ఇండియా: రోహిత్​ శర్మ, శుభ్​మన్​ గిల్​, ఛెతేశ్వర్​ పుజారా, విరాట్​ కోహ్లీ (కెప్టెన్​), అజింక్య రహానె, రిషబ్​ పంత్​ (వికెట్​ కీపర్​), వాషింగ్టన్ సుందర్​, అక్షర్​ పటేల్​, రవిచంద్రన్​ అశ్విన్​, ఇషాంత్ శర్మ, జస్​ప్రీత్​ బుమ్రా.

ఇంగ్లాండ్​: డొమినిక్​ సిబ్లీ, జాక్​ క్రాలే, జానీ బెయిర్​స్టో, జో రూట్​ (కెప్టెన్​), బెన్​ స్టోక్స్​, ఓల్లీ పోప్​, బెన్ ఫోక్స్​ (వికెట్​ కీపర్​), జోఫ్రా ఆర్చర్​, జాక్​ లీచ్​, స్టువర్ట్​ బ్రాడ్​, జేమ్స్​ అండర్సన్​.

ఆటగాళ్లతో రాష్ట్రపతి, షా..

మ్యాచ్​ ప్రారంభానికి ముందు టీమ్ఇండియా, ఇంగ్లాండ్​ ఆటగాళ్లను రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, హోంమంత్రి అమిత్​షా కలిశారు. ఇరుజట్లు కెప్టెన్లు కోహ్లీ, రూట్​.. తమ ఆటగాళ్లను వారికి పరిచయం చేశారు. 100వ టెస్టు ఆడుతోన్న పేసర్​ ఇషాంత్​ శర్మ.. రాష్ట్రపతి చేతులమీదుగా జ్ఞాపికను అందుకున్నాడు.

ఇదీ చూడండి: భారత్-ఇంగ్లాండ్ టెస్టు: భారత ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులు

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న మూడో (పింక్​-బాల్​) టెస్టులో టాస్​ గెలిచిన ఇంగ్లాండ్​​ బ్యాటింగ్​ ఎంచుకుంది. ఇరు జట్లు పలు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ రేసులో నిలవాలంటే.. టీమ్​ఇండియా ఈ మ్యాచ్​ తప్పక గెలవాలి.

ఈ సిరీస్​లో భాగంగా ఆడిన రెండు టెస్టుల్లో చెరో మ్యాచ్​ గెలిచిన ఇరుజట్లు సిరీస్​ను సమం చేశాయి. ఈ మ్యాచ్​లో గెలిచి 2-0 ఆధిక్యంలోకి వెళ్లాలని ఇరుటీమ్​లు ప్రణాళికలు రచిస్తున్నాయి. టీమ్ఇండియా పేసర్​ ఇషాంత్​ శర్మకు ఇది వందో టెస్టు కావడం విశేషం.

జట్లు:

టీమ్ఇండియా: రోహిత్​ శర్మ, శుభ్​మన్​ గిల్​, ఛెతేశ్వర్​ పుజారా, విరాట్​ కోహ్లీ (కెప్టెన్​), అజింక్య రహానె, రిషబ్​ పంత్​ (వికెట్​ కీపర్​), వాషింగ్టన్ సుందర్​, అక్షర్​ పటేల్​, రవిచంద్రన్​ అశ్విన్​, ఇషాంత్ శర్మ, జస్​ప్రీత్​ బుమ్రా.

ఇంగ్లాండ్​: డొమినిక్​ సిబ్లీ, జాక్​ క్రాలే, జానీ బెయిర్​స్టో, జో రూట్​ (కెప్టెన్​), బెన్​ స్టోక్స్​, ఓల్లీ పోప్​, బెన్ ఫోక్స్​ (వికెట్​ కీపర్​), జోఫ్రా ఆర్చర్​, జాక్​ లీచ్​, స్టువర్ట్​ బ్రాడ్​, జేమ్స్​ అండర్సన్​.

ఆటగాళ్లతో రాష్ట్రపతి, షా..

మ్యాచ్​ ప్రారంభానికి ముందు టీమ్ఇండియా, ఇంగ్లాండ్​ ఆటగాళ్లను రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, హోంమంత్రి అమిత్​షా కలిశారు. ఇరుజట్లు కెప్టెన్లు కోహ్లీ, రూట్​.. తమ ఆటగాళ్లను వారికి పరిచయం చేశారు. 100వ టెస్టు ఆడుతోన్న పేసర్​ ఇషాంత్​ శర్మ.. రాష్ట్రపతి చేతులమీదుగా జ్ఞాపికను అందుకున్నాడు.

ఇదీ చూడండి: భారత్-ఇంగ్లాండ్ టెస్టు: భారత ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులు

Last Updated : Feb 24, 2021, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.