ఇంగ్లాండ్ మహిళా జట్టుతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో టీమ్ఇండియా ఓటమి చవిచూసింది. దీంతో టీ20 సిరీస్ 2-1తో కైవసం చేసుకుంది ఇంగ్లీష్ జట్టు.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా.. ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ విఫలమైనా.. స్మృతి మంధాన పదునైన షాట్లతో 70 పరుగులు చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్(36), రిచా ఘోష్ (20) ఆకట్టుకున్నారు.
అనంతరం బరిలో దిగిన ఇంగ్లాండ్ మొదట తడబడినా డేనియల్ వ్యాట్ విధ్వంసంతో విజయాన్ని చేజిక్కించుకుంది. 18.4 ఓవర్లలోనే 154 పరుగులు చేసింది. ఓపెనర్ బ్యుమౌంట్ తొందరగానే వెనుదిరిగింది. తర్వాత క్రీజులోకి వచ్చిన వ్యాట్ (89) చెలరేగింది. సీవర్తో కలిసి 112 పరుగులు జోడించింది. దీంతో ఇంగ్లీష్ జట్టు చివరి టీ20లో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది.
ఇదీ చదవండి: ICC Rankings: టేలర్ డబుల్ ధమాకా.. దిగువకు మిథాలీ