బలిదాన్ చిహ్నాన్ని తన గౌజులపై ముద్రించి దేశంపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు టీమిండియా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని. మాతృదేశంపై తనకేమి తక్కువ ప్రేమ లేదంటున్నాడు కెప్టెన్ కోహ్లి. ఇటీవల విరాట్ ప్రపంచకప్తో తిరిగిరావాలని తన చిన్ననాటి పాఠశాల సిబ్బంది... కోహ్లీ క్రికెట్ ఓనమాలు నేర్చుకున్న మైదానంలోని మట్టిని లండన్కు పంపిన విషయం తెలిసిందే. అయితే ఆసీస్తో మ్యాచ్ సందర్భంగా ఓవల్ మైదానంలోకి అడుగుపెట్టేముందు కోహ్లీ ఆ మట్టి వాసన చూసి బరిలోకి దిగాడు. మాతృభూమిపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. మ్యాచ్ కోహ్లి చెలరేగి ఆడటం విశేషం.
![virat smelled the school ground soil before going to ausis match](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3517067_virat_soil_test.jpg)
దిల్లీలోని విశాల్ భారతి స్కూల్లో తొమ్మిదో గ్రేడ్ వరకు చదువుకున్నాడు కోహ్లీ. ఆ పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే 1998లో వెస్ట్ దిల్లీ క్రికెట్ అకాడమీలో చేరాడు. ఆ తర్వాత తన ప్రతిభతో 2008లో ఇండియన్ క్రికెట్ జట్టులో చేరాడు. క్రికెట్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇప్పుడు అత్యుత్తమ బ్యాట్స్మెన్గా అవతరించాడు. ఈ క్రమంలో ప్రపంచకప్లో ఆసీస్తో మ్యాచ్కు ముందు తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఆ పాఠశాల మట్టిని తెప్పించుకుని వాసన చూశాడు. ఆ సమయంలో ధోనీ, కోచ్ రవిశాస్త్రి కూడా అక్కడే ఉన్నారు.