ETV Bharat / sports

జడేజా, ధోనీ వీరోచిత ఇన్నింగ్స్​ వృథా... ఫైనల్లో కివీస్​

మాంచెస్టర్ వేదికగా భారత్​తో జరిగిన ప్రపంచకప్​ సెమీస్​ మ్యాచ్​లో కివీస్ విజయం సాధించింది. టీమిండియా బ్యాట్స్​మెన్ జడేజా(77), ధోని(50) రాణించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. 3 వికెట్లతో ఆకట్టుకున్న న్యూజిలాండ్​ బౌలర్​ హెన్రీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్​ అవార్డు దక్కింది.

author img

By

Published : Jul 10, 2019, 7:58 PM IST

Updated : Jul 10, 2019, 11:44 PM IST

జడేజా, ధోనీ వీరోచిత ఇన్నింగ్స్​ వృథా
ఇండియా - న్యూజిలాండ్ మ్యాచ్ హైలెట్స్​

2015 ప్రపంచకప్​ సెమీస్​ మ్యాచ్​లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ విజయాన్నందుకున్న న్యూజిలాండ్ అదే రీతిలో నేడు భారత్​పై గెలిచింది. ఈ విజయంతో కివీస్​ రెండోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. భారత్​తో జరిగిన ఈ పోరులో న్యూజిలాండ్ 18 పరుగుల తేడాతో నెగ్గింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ 240 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

అనంతరం బ్యాటింగ్​కు దిగిన భారత్ 221 పరుగులకు ఆలౌటైంది. జడేజా(77), ధోని(50) పరుగులతో ఆకట్టుకున్నప్పటికీ మ్యాచ్​ను గెలిపించలేకపోయారు. మ్యాట్ హెన్రీ 3, సాంట్నర్, బౌల్ట్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. 3 వికెట్లతో ఆకట్టుకున్న హెన్రీకి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'​ అవార్డు దక్కింది.

టాపార్డర్ టపాటపా...

240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్​కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. రోహిత్(1), కోహ్లీ(1), రాహుల్(1) వికెట్లను వరుసగా చేజార్చుకుంది. రెండో ఓవర్లోనే రోహిత్ శర్మను ఔట్ చేశాడు హెన్రీ, కాసేపటికే విరాట్ కోహ్లీని పెవిలియన్ చేర్చాడు బౌల్ట్​. తర్వాతి ఓవర్లోనే రాహుల్​ను వెనక్కి పంపాడు హెన్రీ. 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది కోహ్లీ సేన.

నిలకడగా ఆడిన పంత్ - పాండ్య..

కాసేపు దినేశ్ కార్తీక్​ - పంత్ నిలకడగా ఆడారు. అయితే నీషమ్ అద్భుత క్యాచ్​తో కార్తీక్(6) ఔట్ అయ్యాడు. అనంతరం పంత్(32), పాండ్య(32) జోడి నిలకడగా ఆడింది. స్కోరు వేగంగా కదలకపోయినా.. వికెట్ పడకుండా క్రీజులో పాతుకుపోయారు. అయితే సాంట్నర్ బౌలింగ్​లో భారీ షాట్​కు ప్రయత్నించిన పంత్(32) బౌండరీలైన్లో గ్రాండ్​హోమ్​కు క్యాచ్ ఇచ్చాడు. కాసేపటికే పాండ్య కూడా అదే రీతిలో సాంట్నర్ బౌలింగ్​లోనే పెవిలియన్ చేరాడు.

జడ్డూ అర్ధశతకం వృథా..

పాండ్య ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజా వేగంగా ఆడాడు. బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. మరోవైపు ధోని స్ట్రైక్​ రొటేట్ చేస్తూ జడ్డూకు సహకరించాడు. సాంట్నర్ బౌలింగ్​లో సిక్సర్లతో విరచుకు పడ్డాడు జడేజా. 59 బంతుల్లోనే 77 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇన్నింగ్స్ చివర్లో ధాటిగా ఆడుతూ బౌల్ట్ బౌలింగ్​లో విలియమ్సన్​ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

మలుపు తిప్పిన ధోని రనౌట్​..

జడేజా ఔటైనా..క్రీజులో ధోని ఉండటంతో గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. అప్పుడు భారత్​ గెలవాలంటే 12 బంతుల్లో 31 పరుగులు చేయాలి. 49వ ఓవర్లో సిక్సర్​తో బ్యాట్ ఝుళిపించిన మహీ.. అనంతరం రనౌటయ్యాడు. మూడో బంతికి షాట్ ఆడిన ధోని ఒక్క పరుగు పూర్తి చేశాడు. రెండో రన్​ దాదాపు పూర్తవుతుండగా గప్తిల్ వేసిన త్రో వికెట్లను నేరుగా తాకింది. ధోని పెవిలియన్ చేరాడు. అనంతరం భారత్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సేపు పట్టలేదు.

నిన్న వర్షం కారణంగా వాయిదా పడిన సెమీస్​ మ్యాచ్ బుధవారం కొనసాగింది. 46.1 ఓవర్లలో 211 పరుగులు చేసిన కివీస్ మరో 28 పరుగులు మాత్రమే జత చేయగలిగింది. రాస్ టేలర్(74), విలియమ్సన్(67) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ 3 వికెట్లు తీయగా.. మిగతా వారు తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

ఇండియా - న్యూజిలాండ్ మ్యాచ్ హైలెట్స్​

2015 ప్రపంచకప్​ సెమీస్​ మ్యాచ్​లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ విజయాన్నందుకున్న న్యూజిలాండ్ అదే రీతిలో నేడు భారత్​పై గెలిచింది. ఈ విజయంతో కివీస్​ రెండోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. భారత్​తో జరిగిన ఈ పోరులో న్యూజిలాండ్ 18 పరుగుల తేడాతో నెగ్గింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ 240 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

అనంతరం బ్యాటింగ్​కు దిగిన భారత్ 221 పరుగులకు ఆలౌటైంది. జడేజా(77), ధోని(50) పరుగులతో ఆకట్టుకున్నప్పటికీ మ్యాచ్​ను గెలిపించలేకపోయారు. మ్యాట్ హెన్రీ 3, సాంట్నర్, బౌల్ట్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. 3 వికెట్లతో ఆకట్టుకున్న హెన్రీకి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'​ అవార్డు దక్కింది.

టాపార్డర్ టపాటపా...

240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్​కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. రోహిత్(1), కోహ్లీ(1), రాహుల్(1) వికెట్లను వరుసగా చేజార్చుకుంది. రెండో ఓవర్లోనే రోహిత్ శర్మను ఔట్ చేశాడు హెన్రీ, కాసేపటికే విరాట్ కోహ్లీని పెవిలియన్ చేర్చాడు బౌల్ట్​. తర్వాతి ఓవర్లోనే రాహుల్​ను వెనక్కి పంపాడు హెన్రీ. 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది కోహ్లీ సేన.

నిలకడగా ఆడిన పంత్ - పాండ్య..

కాసేపు దినేశ్ కార్తీక్​ - పంత్ నిలకడగా ఆడారు. అయితే నీషమ్ అద్భుత క్యాచ్​తో కార్తీక్(6) ఔట్ అయ్యాడు. అనంతరం పంత్(32), పాండ్య(32) జోడి నిలకడగా ఆడింది. స్కోరు వేగంగా కదలకపోయినా.. వికెట్ పడకుండా క్రీజులో పాతుకుపోయారు. అయితే సాంట్నర్ బౌలింగ్​లో భారీ షాట్​కు ప్రయత్నించిన పంత్(32) బౌండరీలైన్లో గ్రాండ్​హోమ్​కు క్యాచ్ ఇచ్చాడు. కాసేపటికే పాండ్య కూడా అదే రీతిలో సాంట్నర్ బౌలింగ్​లోనే పెవిలియన్ చేరాడు.

జడ్డూ అర్ధశతకం వృథా..

పాండ్య ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజా వేగంగా ఆడాడు. బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. మరోవైపు ధోని స్ట్రైక్​ రొటేట్ చేస్తూ జడ్డూకు సహకరించాడు. సాంట్నర్ బౌలింగ్​లో సిక్సర్లతో విరచుకు పడ్డాడు జడేజా. 59 బంతుల్లోనే 77 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇన్నింగ్స్ చివర్లో ధాటిగా ఆడుతూ బౌల్ట్ బౌలింగ్​లో విలియమ్సన్​ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

మలుపు తిప్పిన ధోని రనౌట్​..

జడేజా ఔటైనా..క్రీజులో ధోని ఉండటంతో గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. అప్పుడు భారత్​ గెలవాలంటే 12 బంతుల్లో 31 పరుగులు చేయాలి. 49వ ఓవర్లో సిక్సర్​తో బ్యాట్ ఝుళిపించిన మహీ.. అనంతరం రనౌటయ్యాడు. మూడో బంతికి షాట్ ఆడిన ధోని ఒక్క పరుగు పూర్తి చేశాడు. రెండో రన్​ దాదాపు పూర్తవుతుండగా గప్తిల్ వేసిన త్రో వికెట్లను నేరుగా తాకింది. ధోని పెవిలియన్ చేరాడు. అనంతరం భారత్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సేపు పట్టలేదు.

నిన్న వర్షం కారణంగా వాయిదా పడిన సెమీస్​ మ్యాచ్ బుధవారం కొనసాగింది. 46.1 ఓవర్లలో 211 పరుగులు చేసిన కివీస్ మరో 28 పరుగులు మాత్రమే జత చేయగలిగింది. రాస్ టేలర్(74), విలియమ్సన్(67) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ 3 వికెట్లు తీయగా.. మిగతా వారు తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

AP Video Delivery Log - 0500 GMT News
Wednesday, 10 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0441: OBIT Rip Torn AP Clients Only 4219745
Emmy-winning US actor Rip Torn dies aged 88
AP-APTN-0420: South Korea Japan Trade 4219743
SKorea president urges Japan not to widen trade row
AP-APTN-0418: Japan South Korea Trade No access Japan; Cleared for digital and online use, except by Japanese media; NBC, CNBC, BBC, and CNN must credit ‘TV Tokyo’ if images are to be shown on cable or satellite in Japan; No client archiving or reuse; No AP reuse 4219742
Japan: SKorea export controls don't violate free trade
AP-APTN-0404: Tonga China's Reach AP Clients Only 4219740
ONLY ON AP China's aid could trap Tonga in debt
AP-APTN-0357: Mexico Last Beetle AP Clients Only 4219739
Iconic original VW Beetle thriving in Mexico
AP-APTN-0351: US WA Mountain Goat Roundup Part must courtesy Washington Dept. Of Fish And Wildlife 4219738
Mountain goats relocated by chopper to US National Park
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 10, 2019, 11:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.