ETV Bharat / sports

ఐదు టైటిళ్లను మిస్ చేసుకున్న టీమిండియా

లీగ్ మ్యాచ్​ల్లో సత్తాచాటి కీలక మ్యాచ్​ల్లో చేతులెత్తేస్తోంది టీమిండియా. ఇలా గత ఐదేళ్లలో 5 ఐసీసీ టైటిళ్లను చేజార్చుకుంది. న్యూజిలాండ్​తో జరిగిన సెమీస్ మ్యాచ్​లో 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

author img

By

Published : Jul 11, 2019, 9:38 AM IST

మ్యాచ్​

2011లో వరల్డ్​కప్​ గెలుపు అనంతరం రెండేళ్లకు ఐసీసీ ఛాంపియన్స్​ ట్రోఫీ విజయం సాధించింది భారత్​.. అప్పటినుంచి టీమిండియాకు ఐసీసీ టైటిల్ అందని ద్రాక్షలా మిగిలింది. లీగ్ మ్యాచ్​ల్లో సత్తా చాటి ఆఖరులో విఫలమౌతుంది. గత ఐదేళ్లలో 5 ఐసీసీ టైటిళ్లు చేజార్చుకుంది టీమిండియా.

2014 టీ 20 వరల్డ్​కప్​..

ధోని సారథ్యంలో టీమిండియా లీగ్ మ్యాచ్​లన్నింటిలో విజయం సాధించింది. ఒక్క మ్యాచ్​లోనూ ఓటమి లేకుండా ఫైనల్ చేరింది. తుదిపోరులో శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ​130 పరుగులు మాత్రమే చేయగలిగింది. రెండు ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది లంక జట్టు.

2015 ప్రపంచకప్​..

2015 మెగాటోర్నీలోనూ అప్రతిహత జైత్రయాత్రను కొనసాగించింది టీమిండియా. ఆరు లీగ్ మ్యాచ్​ల్లో వరుస విజయాలు సాధించింది. అయితే సెమీస్​లో ఆస్ట్రేలియాపై 95 పరుగుల తేడాతో ఓడి టైటిల్​ ఆశలపై నీళ్లు చల్లుకుంది.

MATCH
2015 ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్

2016 టీ 20 ప్రపంచకప్​...

ఈ టోర్నీలో జరిగిన లీగ్ మ్యాచ్​ల్లో న్యూజిలాండ్​పై మినహ మిగతా అన్ని జట్లపై గెలిచింది టీమిండియా. పాకిస్థాన్​, బంగ్లాను కూడా ఓడించింది. అయితే సెమీస్​లో వెస్టిండీస్​ ముందు బోల్తా పడింది. 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచినా.. కట్టడి చేయడంలో విఫలమైంది భారత్​.

2017 ఛాంపియన్స్ ట్రోఫీ..

ఈ టోర్నీలో టీమిండియా.. శ్రీలంకతో మినహా ఫైనల్​ వరకు ఏ ఒక్క మ్యాచ్​లోనూ ఓడలేదు. అయితే తుదిపోరులో పాకిస్థాన్​పై ఘోరఓటమిని చవిచూసింది. 124 పరుగుల తేడాతో పరాజయం చెందింది. లీగ్ మ్యాచ్​లో పాక్​పై గెలిచిన భారత్​ ఫైనల్లో చిత్తయింది.

MATCH
2017 ఛాంపియన్స్ ట్రోఫీ

2019 వరల్డ్​కప్​..

ఈ మెగాటోర్నీ లీగ్​దశలో ఇంగ్లాండ్​పై మినహా ప్రతి జట్టుపై గెలిచింది భారత్​. ఫేవరేట్లుగానూ టీమిండియానే పరిగణించారు. కీలక సెమీఫైనల్​ పోరులో కివీస్​ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. జడేజా (77), ధోని(50) అర్ధశతకాలతో రాణించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు.

ఇలా గత ఐదేళ్లలో 5 ఐసీసీ టైటిళ్లను కోల్పోయింది భారత్. లీగ్​ దశలో బాగా ఆడుతున్న టీమిండియా నాకౌట్​ మ్యాచ్​లలో చతికిలపడుతోంది. సమన్వయలోపమో, గెలుస్తామనే అతివిశ్వాసమో, ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడమో తెలియదు కానీ కీలక మ్యాచ్​లలో సత్తాచాటలేకపోతోంది భారత్​.

ఇది చదవండి: 'అన్ని సార్లూ వాళ్లే ఆడాలంటే ఎలా?'

2011లో వరల్డ్​కప్​ గెలుపు అనంతరం రెండేళ్లకు ఐసీసీ ఛాంపియన్స్​ ట్రోఫీ విజయం సాధించింది భారత్​.. అప్పటినుంచి టీమిండియాకు ఐసీసీ టైటిల్ అందని ద్రాక్షలా మిగిలింది. లీగ్ మ్యాచ్​ల్లో సత్తా చాటి ఆఖరులో విఫలమౌతుంది. గత ఐదేళ్లలో 5 ఐసీసీ టైటిళ్లు చేజార్చుకుంది టీమిండియా.

2014 టీ 20 వరల్డ్​కప్​..

ధోని సారథ్యంలో టీమిండియా లీగ్ మ్యాచ్​లన్నింటిలో విజయం సాధించింది. ఒక్క మ్యాచ్​లోనూ ఓటమి లేకుండా ఫైనల్ చేరింది. తుదిపోరులో శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ​130 పరుగులు మాత్రమే చేయగలిగింది. రెండు ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది లంక జట్టు.

2015 ప్రపంచకప్​..

2015 మెగాటోర్నీలోనూ అప్రతిహత జైత్రయాత్రను కొనసాగించింది టీమిండియా. ఆరు లీగ్ మ్యాచ్​ల్లో వరుస విజయాలు సాధించింది. అయితే సెమీస్​లో ఆస్ట్రేలియాపై 95 పరుగుల తేడాతో ఓడి టైటిల్​ ఆశలపై నీళ్లు చల్లుకుంది.

MATCH
2015 ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్

2016 టీ 20 ప్రపంచకప్​...

ఈ టోర్నీలో జరిగిన లీగ్ మ్యాచ్​ల్లో న్యూజిలాండ్​పై మినహ మిగతా అన్ని జట్లపై గెలిచింది టీమిండియా. పాకిస్థాన్​, బంగ్లాను కూడా ఓడించింది. అయితే సెమీస్​లో వెస్టిండీస్​ ముందు బోల్తా పడింది. 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచినా.. కట్టడి చేయడంలో విఫలమైంది భారత్​.

2017 ఛాంపియన్స్ ట్రోఫీ..

ఈ టోర్నీలో టీమిండియా.. శ్రీలంకతో మినహా ఫైనల్​ వరకు ఏ ఒక్క మ్యాచ్​లోనూ ఓడలేదు. అయితే తుదిపోరులో పాకిస్థాన్​పై ఘోరఓటమిని చవిచూసింది. 124 పరుగుల తేడాతో పరాజయం చెందింది. లీగ్ మ్యాచ్​లో పాక్​పై గెలిచిన భారత్​ ఫైనల్లో చిత్తయింది.

MATCH
2017 ఛాంపియన్స్ ట్రోఫీ

2019 వరల్డ్​కప్​..

ఈ మెగాటోర్నీ లీగ్​దశలో ఇంగ్లాండ్​పై మినహా ప్రతి జట్టుపై గెలిచింది భారత్​. ఫేవరేట్లుగానూ టీమిండియానే పరిగణించారు. కీలక సెమీఫైనల్​ పోరులో కివీస్​ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. జడేజా (77), ధోని(50) అర్ధశతకాలతో రాణించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు.

ఇలా గత ఐదేళ్లలో 5 ఐసీసీ టైటిళ్లను కోల్పోయింది భారత్. లీగ్​ దశలో బాగా ఆడుతున్న టీమిండియా నాకౌట్​ మ్యాచ్​లలో చతికిలపడుతోంది. సమన్వయలోపమో, గెలుస్తామనే అతివిశ్వాసమో, ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడమో తెలియదు కానీ కీలక మ్యాచ్​లలో సత్తాచాటలేకపోతోంది భారత్​.

ఇది చదవండి: 'అన్ని సార్లూ వాళ్లే ఆడాలంటే ఎలా?'

AP Video Delivery Log - 2300 GMT News
Wednesday, 10 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2245: US TX Storm Preps Must credit KEYE, No access Austin, No use US broadcast networks, No re-sale, re-use or archive 4219892
Governor urges Texans to prepare for Gulf storm
AP-APTN-2227: US House Immigration Hearing Must Credit C-SPAN 4219891
Guatemalan mother on baby's death in US custody
AP-APTN-2214: US AZ Cactus Windshield Must credit KGUN, No access Tucson, No use US broadcsat networks, No re-sale, re-use or archive 4219889
Huge cactus smashes US driver's windshield
AP-APTN-2208: Peru Japanese Princess 2 AP Clients Only 4219888
Japan's Princess Mako honors migrants to Peru
AP-APTN-2150: UK Ambassador Reax 2 AP Clients Only;No access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4219887
UK Shadow For Sec, minister, on envoy's resignation
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.