ETV Bharat / sports

'ప్రపంచంలో నేనొక్కడినే ఒంటరివాడిని అనిపించింది'

author img

By

Published : Feb 19, 2021, 3:32 PM IST

భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ 2014 ఇంగ్లాండ్​ పర్యటనలో తీవ్ర ఒత్తిడికి గురైనట్లు వెల్లడించాడు. ఇంగ్లాండ్ మాజీ​ ఆటగాడు మార్క్​ నికోలస్​తో పాడ్​కాస్ట్​లో మాట్లాడిన నేపథ్యంలో.. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు కోహ్లీ.

Kohli on whether he suffered depression
ఆ సమయంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యా: కోహ్లీ

భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ తాను తీవ్రంగా ఒత్తిడికి గురైన ఓ సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు. 2014 ఇంగ్లాండ్​ పర్యటనలో తీవ్ర కుంగుబాటు​కు లోనైనట్లు వెల్లడించాడు. ఆ సమయంలో.. 'ప్రపంచంలో నేనొక్కడినే ఒంటరివాడిని' అనే భావన కలిగిందని తెలిపాడు విరాట్​. 'నాట్​ జస్ట్​ క్రికెట్​' పేరుతో ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మార్క్ నికోలస్ చేసిన పాడ్​కాస్ట్​లో ఈ వివరాలు వెల్లడించాడు కోహ్లీ.

"అవును.. నేనూ ఒత్తిడికి గురయ్యా. పరుగులు సరిగ్గా చెయ్యలేకపోతున్నాం అనే బాధతో రోజు ప్రారంభించడం చాలా కష్టంగా ఉంటుంది. దాదాపు చాలా మంది బ్యాట్స్​మెన్​ ఇది అనుభవించి ఉంటారు. ఇలాంటి సమయంలో ఏదీ మన అదుపులో ఉండదు. దీని నుంచి ఎలా బయటపడాలో అస్సలు తెలియదు. ఇంగ్లాండ్​ టూర్​లో నేనది అనుభవించా. ప్రపంచంలో నేనొక్కడినే ఒంటరివాడినేమో అనిపించింది."

- విరాట్ కోహ్లీ, భారత జట్టు కెప్టెన్​.

2014 ఇంగ్లాండ్​ టూర్​లో విరాట్​ పేలవ ప్రదర్శన చేశాడు. ఐదు టెస్టులు ఆడి వరుసగా 1, 8, 25, 0, 39, 28, 0, 7, 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కానీ, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మళ్లీ ఉత్తమ ప్రదర్శన కనబరిచి ఫామ్​లోకి వచ్చాడు.

ఇదీ చదవండి:'ఈ సంతోషం పంచుకోవడానికి తమ్ముడు లేడు'

భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ తాను తీవ్రంగా ఒత్తిడికి గురైన ఓ సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు. 2014 ఇంగ్లాండ్​ పర్యటనలో తీవ్ర కుంగుబాటు​కు లోనైనట్లు వెల్లడించాడు. ఆ సమయంలో.. 'ప్రపంచంలో నేనొక్కడినే ఒంటరివాడిని' అనే భావన కలిగిందని తెలిపాడు విరాట్​. 'నాట్​ జస్ట్​ క్రికెట్​' పేరుతో ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మార్క్ నికోలస్ చేసిన పాడ్​కాస్ట్​లో ఈ వివరాలు వెల్లడించాడు కోహ్లీ.

"అవును.. నేనూ ఒత్తిడికి గురయ్యా. పరుగులు సరిగ్గా చెయ్యలేకపోతున్నాం అనే బాధతో రోజు ప్రారంభించడం చాలా కష్టంగా ఉంటుంది. దాదాపు చాలా మంది బ్యాట్స్​మెన్​ ఇది అనుభవించి ఉంటారు. ఇలాంటి సమయంలో ఏదీ మన అదుపులో ఉండదు. దీని నుంచి ఎలా బయటపడాలో అస్సలు తెలియదు. ఇంగ్లాండ్​ టూర్​లో నేనది అనుభవించా. ప్రపంచంలో నేనొక్కడినే ఒంటరివాడినేమో అనిపించింది."

- విరాట్ కోహ్లీ, భారత జట్టు కెప్టెన్​.

2014 ఇంగ్లాండ్​ టూర్​లో విరాట్​ పేలవ ప్రదర్శన చేశాడు. ఐదు టెస్టులు ఆడి వరుసగా 1, 8, 25, 0, 39, 28, 0, 7, 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కానీ, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మళ్లీ ఉత్తమ ప్రదర్శన కనబరిచి ఫామ్​లోకి వచ్చాడు.

ఇదీ చదవండి:'ఈ సంతోషం పంచుకోవడానికి తమ్ముడు లేడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.