ఆంటిగ్వా వేదికగా టీమిండియాతో జరుగుతోన్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య వెస్టిండీస్ 222 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 189/8తో ఆట ప్రారంభించిన కరీబియన్ జట్టు.. 74.2 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయింది.
రోస్టన్ చేజ్ 48 పరుగులు చేయగా, కెప్టెన్ జేసన్ హోల్డర్ 39, హెట్మయిర్ 35 పరుగులు మాత్రమే చేశారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ 5 వికెట్లు పడగొట్టాడు. మిగతా వారిలో షమి, జడేజా రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. బుమ్రా ఒక వికెట్ తీశాడు. 75 పరుగుల ఆధిక్యంలో ఉంది కోహ్లీసేన.
ఇది చదవండి: ఇంగ్లాండ్ బ్రెయిన్ లేకుండా బ్యాటింగ్ చేసింది: జోఫ్రే బాయ్కాట్